Delhi Metro: ఢిల్లీ మెట్రోలో దారుణం.. వృద్ధుడిపై దాడి చేసిన యువకుడి వీరంగం.. వీడియో వైరల్‌..

Delhi Metro: గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోకు సంబంధించి అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని సరదా సంఘటనలు, కొన్ని షాకింగ్‌ విషయాలు కూడా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల చేష్టలు, అసభ్యకర ప్రవర్తనలు, డ్యాన్స్‌ రీల్స్‌ వంటి వింత పోకడలకు సంబంధించిన వీడియోలు త‌ర‌చూ వైర‌ల్‌ అవుతుంటాయి. మెట్రోలో కొందరు చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలు, యువతి యువకుల రోమాన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా అనేకం చూశాం. మెట్రో ప్రయాణికుల మధ్య చిన్నచిన్న కార‌ణాల‌కే గొడ‌వ‌లు పడుతుండటం, వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు చాలా చూశాం. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక వృద్ధుడి పై తోటి ప్రయాణికుడు దుసురుగా ప్రవర్తించాడు.

వైరల్‌ అవుతున్న వీడియోలో మెట్రో రైలు కోచ్‌లో నిలబడి ఉన్న ఒక వృద్ధ ప్రయాణికుడిపై తోటి వ్యక్తి వాగ్వాదానికి దిగటం కనిపించింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి సదరు పెద్దమనిషిపై ఒక్కసారిగా దాడికి దిగాడు…అది గమనించిన తోటి ప్రయాణికులు జోక్యం చేసుకొని పెద్దాయనకు సాయంగా నిలిబడ్డారు.. దాడి చేసిన వ్యక్తిని వారిస్తూ.. దూరంగా నెడుతున్నారు. అంతా కలిసి అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయితే, అక్కడ జరిగిన గొడవకు కారణంగా మాత్రం తెలియారాలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వెల్‌కమ్ టు ఢిల్లీ మెట్రో’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దిశా షెరావత్ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని షేర్ చేసింది. దిశా సెహ్రావత్ అనే ఖాతా ద్వారా ఈ వీడియోని షేర్‌ చేశారు. అయితే, వృద్ధుడిపై యువకుడు ఎందుకు దాడి చేశాడో స్పష్టంగా తెలియరాలేదు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చాలా మంది స్పందించారు. యువకుడిని వ్యతిరేకిస్తూ పెద్దాయనపై దాడిని ఖండించారు. దిశా షెరావత్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 50 లక్షల మందికి పైగా వీక్షించారు. కొద్దిరోజుల క్రితం మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. బ్యాక్‌ప్యాక్‌లు ధరించిన ఇద్దరు యువకులు రైలులోపల తలపడ్డారు. మీ ఫైటింగ్‌ ఆపాలంటూ..తోటి ప్రయాణికులు ఎంతగా కోరినప్పటికీ వారు తమ గొడవను ఆపలేదు. ఇతర ప్రయాణికులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

BS Yeddyurappa: మాజీ ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్.. జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్పకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటీవల బెదిరింపు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కర్నాటకలో పనిచేస్తున్న ఛాందసవాద గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా, IB ఇటీవల యడ్యూరప్ప భద్రతపై కేంద్రానికి నివేదిక సమర్పించింది. IB నివేదికలో అతని భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. ఆ తర్వాత వారి భద్రతను పెంచడానికి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం

సీఆర్‌పీఎఫ్ కమాండోలకు భద్రత బాధ్యతలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కమాండోలకు చెందిన సాయుధ సిబ్బంది యడియూరప్ప భద్రతను చూసుకుంటారు. యడియూరప్ప భద్రత కోసం మొత్తం 33 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని మోహరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదనంగా, అతని నివాసం వద్ద 10 మంది సాయుధ స్టాటిక్ గార్డులు, ఆరుగురు వ్యక్తిగత భద్రతా అధికారులతో రౌండ్-ది-క్లాక్ భద్రతను నియమించారు.

డ్రైవర్ల బృందాన్ని కూడా భద్రతా వలయం శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన డ్రైవర్లను కూడా వారి కాన్వాయ్‌లో చేర్చారు. ప్రమాదంలో ఉన్న సమయంలో యడూరప్ప సురక్షితంగా తరలించగలరు. 12 మంది సాయుధ ఎస్కార్ట్ కమాండోలను మూడు షిఫ్టుల్లో మోహరించింది. ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా నిరంతరం నిఘా ఉంచుతారు. నిరంతరం నిఘా ఉంచేందుకు, షిఫ్టుల వారీగా ఇద్దరు పరిశీలకులను నియమిస్తారు. వీరిలో యడియూరప్ప ఎల్లప్పుడూ రెండు అంచెల భద్రతను కలిగి ఉంటారు.

యడ్యూరప్పకు బెదిరింపులు యడ్యూరప్ప భద్రత కోసం మోహరించిన కమాండోలు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలవారు. ఆయుధాలు లేకపోయినా పోరాడడంలో నిష్ణాతులని హోం శాఖ వర్గాలు చెప్పినట్లు సమాచారం. వారికి మెషిన్ గన్‌లు, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను రౌండ్ ది క్లాక్ అమర్చారు. యడ్యూరప్ప కుటుంబానికి చెందిన చాలా మంది రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. గత కొంతకాలంగా తీవ్రవాద గ్రూపుల నుండి యడేూరప్పకు బెదిరింపులు వస్తున్నాయి. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఈ ముఖ్యమైన చర్య తీసుకుంది.

ATM Withdrawal: ఏటీఎమ్‌లో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలో తెలుసా.?

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ పెరిగిన ఈ రోజుల్లోనూ ఇప్పటికీ ఏటీఎమ్‌లో డబ్బులు విత్‌డ్రా చేస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ఏటీఎమ్‌లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం సులభతరమైంది. అయితే ఏటీఎమ్‌లో డబ్బు తీసుకునే సమయంలో చిరిగిన నోట్లు రావడం కూడా సర్వసాధారణమైన విషయం తెలిసిందే.

మనలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. చిరిగిన నోట్లను మార్చుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు. ఎవరికీ ఇచ్చినా తీసుకోవడానికి నిరాకరిస్తుంటారు. మరి ఏటీఎమ్‌ నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి.? బ్యాంక్‌ నియమాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.. ఏటీఎమ్‌ల నుంచి చిరిగిన నోట్లు వస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకునే వెసులుబాటు ఉందని మీకు తెలుసా.? అవును.. మ్యుటిలేడెట్ నోట్లను సులభంగా భర్తీ చేసుకోవచ్చు. ఏటీఎమ్‌లో వచ్చిన చిరిగిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు నిరాకరించకూడదని ఆర్‌బీఐ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. కేవలం నిమిషాల్లోనే నోట్లను మార్చుకోవచ్చు.

ఇందుకోసం మీకు చిరిగిన నోటు వచ్చిన ఏటీఎమ్‌ లింక్‌ చేసిన బ్యాంకులో సంప్రదించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, ఏటీఎమ్‌ పేరును పేర్కొనాలి. దీంతో పాటు ఏటీఎమ్‌ ట్రాన్సాక్షన్‌ తర్వాత వచ్చే స్లిప్‌ను అప్లికేషన్‌కు జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్లిప్‌ ఇవ్వకపోతే మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించినా సరిపోతుంది. ఈ వివరాలను అన్నింటినీ అందిస్తే వెంటనే బ్యాంకులో నోట్లను మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లను మార్చడాన్ని బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2017 ఏప్రిల్‌లో తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఏటీఎమ్‌లలో చిరిగిన నోట్లు రాకుండా ఉండడానికి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ అత్యాధునిక నోట్ సార్టింగ్ మిషన్‌ను ఉపయోగిస్తుంది. దీంతో చిరిగిన నోట్లు ఏటీఎమ్‌లో రాకుండా చేస్తుంది. అయితే ఒకవేళ పొరపాటున ఏదైనా చిరిగిన నోటు వచ్చినా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉంటే ఒకవేళ ఏదైనా బ్యాంకు చిరిగిన నోటును మార్చడానికి నిరాకరిస్తే రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం చిరిగిన నోట్లను మార్చే బాధ్యత బ్యాంకుపై పాత్రమే ఉంటుంది. డబ్బును ఏటీఎమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసే ఏజేన్సీలకు ఎలాంటి సంబంధం ఉండదు.
ఇక చిరిగిన నోట్లను బ్యాంకులు మాత్రమే కాకుండా రిజర్వ్‌ బ్యాంక్ కార్యాలయాల్లో కూడా మార్చుకోవచ్చు. ఆర్‌బీఐ నిబంధలన ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు, ఈ నోట్ల గరిష్ట విలువ రూ. 5000 మించకూడదు. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. నోట్లు బాగా కాలిపోయినా, ముక్కలుగా మారినా వాటిని మార్చుకోవడానికి కుదరదు.

Ducati Multistrada V4 RS: రేసింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. డుకాటి నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్.. టాప్ రేంజ్.. సెన్సేషనల్ ఫీచర్స్..

స్పోర్ట్స్ బైక్ లకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాటి ధర ఎక్కువైన అధిక సామర్థ్యం కలిగిన ఈ తరహా బైక్ లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. అయితే ఈ స్పోర్ట్స్ బైక్ లలో డుకాటి కంపెనీ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ క్రమంలో డుకాటి కంపెనీ మరో కొత్త స్పోర్ట్స్ బైక్ ను ఆవిష్కరించింది. డుకాటి మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ పేరుతో దీనిని ఆవిష్కరించింది. దీనిలో ఏకంగా 1103 సీసీ ఇంజిన్ ఉంటుంది. పూర్తి స్థాయి స్పోర్ట్స్ లుక్ లో అదరగొడుతుంది. దీనిలో టైటానియం సబ్ ఫ్రేమ్, లైట్ వెయిట్ తో అధిక పనితీరు అందించే విధంగా డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి. ఈ బైక్ 180 బీహెచ్పీ పవర్, 118ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వీ4ఆర్ఎస్ బైక్ చాలా శక్తివంతమైంది. ఇంతకు ముందుకు ఉన్న మల్టీస్ట్రాడా వీ4 పైక్స్ పీక్ బైక్ కంటే చాలా సామర్థ్యం కలిగినది. ఈ మల్టీస్ట్రాడా వీ4ఆర్ఎస్ అత్యంత శక్తివంతమైన డ్రై క్లచ్ ఉంటుంది. ఈ బైక్ లో సన్నటి ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఉంది.

ఎప్పుడు లాంచింగ్ అంటే.. ఇప్పటికే ఈ డుకాటి మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ ను ప్రదర్శంచిన కంపెనీ మార్కెట్లోకి 2024 జనవరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 31.48లక్షలు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

డుకాటి మల్టీస్ట్రాడా వీ4ఆర్ఎస్ డిజైన్.. దీనిలోని భాగాలు కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. ఐస్ బర్గ్ వైట్ లివరీని కలిగి ఉంది. ఈ బైక్ లో టెక్నో పాలిమర్ టైల్, టైటానియం సబ్ ఫ్రేమ్ ఉంటుంది. వీటి సాయంతో 2.5 కేజీ తక్కువ బరువుతో ఉంటుంది. ఈ బైక్ కి ఇరు పక్కలా సైడ్ కేసెస్.. ప్యాసెంజర్ సీట్ బ్యాగ్స్ ఉంటాయి.

రెండు మోడ్లు.. ఈ బైక్లో రెండు మోడ్లు ఉంటాయి. ఫుల్ పవర్, రేస్ రైడింగ్ మోడ్లు ఉంటాయి. స్టాండర్డ్ రేర్ రాడార్ కంట్రోల్ టెక్నాలజీ ద్వారా అడాప్టివ్ కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్ అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సాధ్యమవుతుంది.

భద్రతకు భరోసా.. ఈ బైక్ లో పవర్ మోడ్, ఏబీఎస్ కార్నరింగ్, డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, డుకాటి వీలీ కంట్రోల్, డేటైం రన్నింగ్ లైట్, వెహికల్ హోల్డ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.

Flipkart Dussehra Sale 2023 : రూ. 30వేల లోపు ధరలో ఆపిల్ ఐఫోన్ 14 కొనేసుకోండి.. ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే?

Flipkart Dussehra Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్‌ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. అక్టోబర్ 22, 2023న ప్రారంభమైన ఈ సేల్.. అక్టోబర్ 29, 2023 వరకు కొనసాగుతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్‌ Flipkart Sale Offers సమయంలో డ్రెస్సులు, గాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్స్, మరిన్నింటితో సహా అనేక రకాల ప్రొడక్టులపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది.
ఐఫోన్ 14పై బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లు :
ప్రస్తుతం ఇ-కామర్స్ దిగ్గజం (Apple iPhone 14)ని కేవలం రూ. 56,999 ఆకర్షణీయమైన ధరకు అందిస్తోంది. అధికారిక స్టోర్ ధర నుంచి ఆకట్టుకునే రూ. 12,901 తగ్గించింది. SBI, RBL బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 750 అదనపు తగ్గింపును పొందవచ్చు. తద్వారా ధరను ఆకర్షణీయమైన రూ. 56,249కి తగ్గించవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. :
ఆపిల్ హ్యాండ్‌సెట్ శక్తివంతమైన A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా 128GB, 256GB, 512GB స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. కొనుగోలుదారులు ఐఫోన్ 14 మల్టీ కలర్ వేరియంట్‌ల నుంచి ఎంచుకోవచ్చు. అంతేకాదు.. మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ RED, బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.

కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ 12MP ప్రైమరీ సెన్సార్‌తో 12MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో వస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.

* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.
* ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

Apple iOS 17.1 Update : ఆపిల్ ప్రొడక్టుల కోసం iOS 17.1 కొత్త అప్‌డేట్ వస్తోంది.. సరికొత్త ఫీచర్లు, బగ్ ఫిక్స్ చేసుకోవచ్చు!

Apple iOS 17.1 Update : ఆపిల్ iOS 17 నుంచి ఫస్ట్ మేజర్ అప్‌డేట్ డెవలప్ చేస్తోంది. గత సెప్టెంబర్‌లో లాంచ్ కాగా.. ప్రస్తుతం టెస్టింగ్ చేస్తోంది. iOS 17.1అప్‌డేట్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌లు, బగ్ పరిష్కారాలు ఉన్నాయి. ఫ్రెంచ్ నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ANFR) ప్రకారం.. ఐఫోన్ 12 నుంచి అధిక విద్యుదయస్కాంత వికిరణ ఉద్గారాల గురించి ఆందోళనలను కూడా పరిష్కరిస్తుంది.

అక్టోబరు 24 నుంచి iOS అప్‌డేట్ లైవ్ అవుతుందని అధికారులు పేర్కొన్నారు. కొత్త OS అప్‌డేట్ గురించి ఆపిల్ నుంచి ఇంకా ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. అయితే, స్టాండ్‌బై మోడ్, ఫొటో షఫుల్ అప్‌గ్రేడ్, మరిన్నింటికి కస్టమైజడ్ తీసుకువస్తుందని తెలిపింది. iOS 17.1తో రాబోయే సరికొత్త ఫీచర్ల సంబంధించి పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

iOS 17.1 కొత్త ఫీచర్లు, యాక్షన్ బటన్ మార్పులు :
కొత్త iPhone 15 సిరీస్ వినియోగదారులు రాబోయే అప్‌డేట్‌లో యాక్షన్ బటన్‌కు మార్పులను ఆశించవచ్చు. ఈ కొత్త ఐఫోన్ యాక్షన్ బటన్‌ను ట్యాప్ చేయడం వల్ల ఇకపై కెమెరా, ఫ్లాష్‌లైట్, ఫోకస్, మాగ్నిఫైయర్, వాయిస్ మెమో ట్రిగ్గర్ చేయవు. అయితే, మ్యూట్ ఫంక్షన్, షార్ట్‌కట్‌లు వంటి కొన్ని ఫీచర్‌లు ఐఫోన్ జేబులో ఉన్నప్పటికీ ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంది.

డైనమిక్ ఐలాండ్ ఫ్లాష్‌లైట్ నోటిఫికేషన్ :
రాబోయే iOS అప్‌డేట్ నాన్-ప్రో iPhone 15 మోడల్‌లకు ఫ్లాష్‌లైట్ నోటిఫికేషన్‌ను అందిస్తుంది. అంటే.. iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 15, iPhone 15 Plus వినియోగదారులు తమ ఫ్లాష్‌లైట్‌లను ఆన్ చేసినప్పుడు, ఫ్లాష్ ఆన్‌లో ఉందని సూచించే నోటిఫికేషన్ డైనమిక్ ఐలాండ్‌లో కనిపిస్తుంది.

కస్టమైజడ్ స్టాండ్‌బై మోడ్ (Customisable StandBy mode) :
ఐఫోన్ యూజర్లు త్వరలో iOS 17 లాంచ్‌లో ప్రకటించిన కొత్త స్టాండ్‌బై మోడ్ ఫీచర్‌లను పొందవచ్చు. 9to5Mac ప్రకారం.. ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు తమ ఐఫోన్‌లను స్మార్ట్ డిస్‌ప్లేలుగా మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో స్క్రీన్ టైమ్‌అవుట్ సెట్టింగ్ మాదిరిగానే ఐఫోన్ యూజర్లు 3 ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు.

Hyderabad: తగ్గేదేలే.. అంటూ పుష్ప సినిమాను మించిన సీన్.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

తగ్గేదేలే.. పుష్ప సినిమా ట్రెండ్ గురించి మనం చెప్పాల్సిన పనేలేదు.. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టర్.. ముఖ్యంగా గంధపు చెక్క అక్రమ రావాణా కథాంశంగా తీసిన ఈ సినిమా.. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది.. త్వరలోనే పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ కానుంది. అయితే, పుష్ప సినిమా తర్వాత.. అక్రమ రవాణా ఎలా జరుగుతుంది..? ఇలాంటి స్టైల్లో కూడా రవాణా చేస్తారా..? అనే కొత్త విషయాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే.. అదే తరహాలో డబ్బు, గంజాయ్, బంగారం, డ్రగ్స్.. ఇలా ఎన్నో విలువైన వస్తువులు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. అయితే.. తాజాగా.. పుష్ప సినిమా స్టైల్లో అక్రమంగా గంజాయ్ తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌ పేట్ బషీరాబాద్ ‌పీఎస్ పరిధి దూలపల్లి క్రాస్ రోడ్డు దగ్గర నిర్వహించిన వాహన తనిఖీలతో గంజాయి ముఠా ఆపరేషన్‌ బయటపడింది. కారు నెంబర్‌ AP 36 R 3033కి పుష్ప సినిమా తరహాలో ప్రత్యేకంగా సీటు అమర్చి గంజాయి సప్లై చేస్తున్న ముఠా పట్టుబడింది. కారు వెనుక‌ భాగంలో డిఫరెంట్ సెటప్ ఏర్పాటు చేశారు నిందితులు. కారు ఆపి తనిఖీ చేయగా 41 ప్యాకెట్‌లు, 82 రెండు కిలోల గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యుల బాగోతం బయటపడింది.

సుచిత్ర సెంటర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారును దూలపల్లిలో నిలిపి తనిఖీలు చేశారు పోలీసులు. నిందితుల నుంచి ‌కారు, రెండు సెల్ ఫోన్లు, ‌41 ప్యాకెట్‌లలో అమర్చిన 82 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అమర్నాథ్, సంజీవ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితులను లోతైన సమాచారం రాబడుతున్నారు పేట్ బషీర్‌బాద్ పోలీసులు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరి ఆపరేషన్ ఎలా సాగుతుందనే కోణంలో కూపీ లాగుతున్నారు.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. గురువారం తులం గోల్డ్ ఎంతకు చేరిందంటే..

దేశంలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకీ ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం తులం బంగారంపై రూ. 200 వరకు పెరగగా ఈరోజు (గురువారం) కూడా గోల్డ్‌ ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.

* ముంబయిలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది.

* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది.

* ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.

* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.
* ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

Telangana Elections: బోధన్‌లో నాన్ కేడర్ పాలిటిక్స్.. వారి ఓట్లపైనే అన్ని పార్టీల పోక‌స్

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మూడు అంశాలపై క్లారిటీ ఇచారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఈపరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పవన్. టీడీపీతో పొత్తు విషయం బీజేపీతో మాట్లాడి.. డిల్లీలో ప్రకటించాలి అనుకున్నా.. వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చాక పొత్తులపై కోఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పవన్‌. ఇప్పటికి జనసేన ఎన్డీఏలోనే ఉందని స్పష్టం చేశారు పవన్. కూటమిలో బీజేపీ కచ్చితంగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జగన్‌ ఎన్డీఏలో లేరని.. కేవలం ఆయనను ఒక రాష్ట్ర సీఎంగానే కేంద్రం గౌరవిస్తుందని చెప్పారు పవన్. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే నిధులు విడుదల చేసిందని బీజేపీ తనతో చెప్పిందన్నారు పవన్. వారాహి విజయయాత్రలో భాగంగా పెడనలో వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని.

బోధన్ నియోజకవర్గం కొత్తగా నమోదైన మైనారిటీ ఓట‌ర్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, బిలోలి ప్రాంతాలకు చెందిన మైనారిటీ వర్గాల వారిని బోధన్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలు అక్రమంగా ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. దొంగ ఓట్లను తొలగించాలంటూ ఆందోళ‌న బాట ప‌ట్టింది బీజేపీ. ఏకంగా నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మెడ‌పాటి ప్రకాశ్ రెడ్డి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో దాదాపు 8 వేలా ఓట్లను తొల‌గించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు వేసిన స్కెచ్‌తో బీజేపీ మెజారిటీగా హిందూ ఓటు బ్యాంక్ పోల‌రైజెష‌న్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 8 వేల ఓట్లు పోవ‌డంతో డైలామాలో ప‌డింద‌ట బీఆర్ఎస్. ఇక హిందూ ఓటు బ్యాంక్‌ను చేసుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్ బీఆర్ఎస్. ఈనేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీతో ఇప్పటి వ‌ర‌కు ఉన్న వాళ్లను టార్గెట్ చేసి తమ పార్టీల్లోకి ఆక‌ర్షిస్తున్నార‌ట. బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్‌గా పైట్ మార‌డంతో ఏవ‌రి బ‌లం వాళ్లు చూపించుకోవాడానికి ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ ఫైర్
బీజేపీ నియోజక‌వ‌ర్గ ఇంచార్జ్‌గా ప్రకాశ్ రెడ్డి టికెట్ వ‌స్తే ఇబ్బంది అవుతుంద‌నే ఆలోచ‌న‌తో మ‌రో వ్యక్తికి టికెట్ వ‌స్తుంద‌నే మైండ్ గేమ్ అడుతున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, బీజేపీ మ‌ద్యే ఉండ‌టంతో.. కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ చేస్తుంద‌ని ఆరోపిస్తున్నార‌ు బీజేపీ నేతలు.ఇక ఇన్ని రోజులు క్యాడ‌ర్‌ను న‌మ్ముకున్న పార్టీలు ఇప్పుడు వ‌ర్గాల‌ను న‌మ్ముకోవ‌డం ఎల‌క్షన్ హీట్ క‌నిపించేలా చేస్తుంద‌ట. ఇప్పటికే ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అయిపోవ‌డంతో బీజేపీ అభ్యర్థి ఫైన‌ల్ అయితే పోటి ఇంకా ర‌స‌వ‌త్తరంగా ఉండ‌నుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ‌ర్గాలు, కులాలు అంటూ బోధన్ పాలిటిక్స్ ఇంకా ఎన్ని మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాలి..!

Minister KTR: ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు ఆపేయమంటారేమో..? కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్..

Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ మాటల తూటాలను పేల్చుతూ.. ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు (KTR) కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదంటూ పేర్కొన్నారు. ‘రైతుబంధు’ నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా విమర్శలు గుప్పించారు.

ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? అందులో కూడా కేసీఆరే కనిపిస్తారు కదా? అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతులు భరించరు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.

కాంగ్రెస్ అంటేనే.. రైతు విరోధి .. అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్.. కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది.. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక 3 గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.. అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్లర్ లో రాశారు.

1 5 6 7 8 9 22