పవన్ లేకుండానే టీడీపీ-జనసేన సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చే అవకాశం..

తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండ‌బోతుంది.? రెండు పార్టీలు క‌లిసి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎలా చేస్తాయి. ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల్లో ఆస‌క్తిగా మారింది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరి రోజులు గ‌డిచిపోతుంది. అయినా ఉమ్మడి పోరాటాల‌పై మాత్రం స్పష్టత రావడం లేదు. రెండు పార్టీలు క‌లిసి ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై ఉమ్మడి కార్యాచ‌ర‌ణ క‌మిటీ ఏర్పాటు చేసాయి. ఈ క‌మిటీ మొద‌టిసారి రాజ‌మండ్రిలో స‌మావేశ‌మైంది. ప్రభుత్వంపై ఆందోళ‌న‌ల కంటే రెండు పార్టీల క‌ల‌యిక‌పైనే ముందుగా దృష్టి పెట్టాయి. రాష్ట్ర స్థాయిలో జ‌రిగిన స‌మావేశానికి నారా లోకేష్‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రై క్యాడర్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇక ఆ త‌ర్వాత జిల్లా స్థాయిలో స‌మ‌న్వయ స‌మావేశాలు జ‌రిగాయి. రెండు పార్టీల మ‌ధ్య ఎలాంటి పొర‌ప‌చ్చాలు లేకుండా క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగడంపైనే చ‌ర్చించాయి. ఒక‌రకంగా చెప్పాలంటే ఈ సమావేశాలు క్యాడర్ మ‌ధ్య క‌ల‌యిక కోసం ఏర్పాటు చేసిన‌వే. ముఖ్యంగా పొత్తు వ‌ల్ల రెండు పార్టీల నాయ‌కుల్లో గానీ కార్యక‌ర్తల్లో గానీ మ‌న‌స్పర్ధలు లేకుండా ముందుకెళ్లేలా ఈ స‌మావేశాలు నిర్వహించారు. మ‌రోవైపు ఓటు బ‌ద‌లాయింపుపైనా స‌మ‌న్వయ స‌మావేశాల్లో చర్చించారు. రెండు పార్టీల ఓట్లు ఇత‌ర పార్టీల‌కు మ‌ళ్లకుండా ఉమ్మడి అభ్యర్ధికే ఖ‌చ్చితంగా వేసేలా చూడాల‌ని స‌మావేశంలో అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తంగా రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో జ‌రిగిన సమావేశాల్లో ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేకుండా క‌లిసిక‌ట్టుగా సాగ‌డంపైనే చ‌ర్చించాయి. తాజాగా న‌వంబ‌ర్ తొమ్మిదో తేదీన మ‌రోసారి రాష్ట్ర జేఏసీ స‌మావేశం అవుతుంది. ఈ స‌మావేశంలో అన్ని అంశాల‌పై క్లారిటీ ఇచ్చే దిశ‌గా రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి.
ఉమ్మడి స‌మావేశంలో మేనిఫెస్టోపై క్లారిటీ ఇచ్చే దిశ‌గా టీడీపీ-జన‌సేన‌..
ఈ నెల తొమ్మిదో తేదీని టీడీపీ-జ‌న‌సేన ఉమ్మడి స‌మావేశం విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నుంది. ముందుగా ఈ స‌మావేశాన్ని మంగ‌ళగిరిలోని టీడీపీ కార్యాల‌యంలో జ‌ర‌పాల‌ని నిర్ణయించినప్పటికీ వేదిక‌ను విజ‌య‌వాడ‌కు మార్చారు. ఓ ప్రయివేట్ హోట‌ల్‌లో జరిగే ఈ స‌మావేశానికి నారా లోకేష్‌తో పాటు జేఏసీలోని 12 మంది స‌భ్యులు హాజ‌రుకానున్నారు. అయితే జ‌న‌సేన నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స‌మావేశానికి హాజ‌రుకావ‌డం లేదు. ఈ స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. గ‌త స‌మావేశంలో మేనిఫెస్టోపై ప‌వ‌న్ క‌ళ్యాణ్-నారా లోకేష్ చ‌ర్చించారు. ఆ త‌ర్వాత ఇటీవ‌ల చంద్రబాబుతో భేటీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా మేనిఫెస్టో విడుద‌ల‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించారు. దీనికి కొన‌సాగింపుగా గురువారం జ‌రిగే స‌మావేశంలో మేనిఫెస్టోకు తుదిరూపు తీసుకురానున్నారు. ఇప్పటికే సూప‌ర్ సిక్స్ పేరిట తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. ఇది ప్రిలిమిన‌రీ మేనిఫెస్టో మాత్రమే..వాస్తవంగా విజ‌య‌ద‌శ‌మి రోజు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ప్రక‌టించారు. అది వాయిదా ప‌డింది. సూప‌ర్ సిక్స్‌తో పాటు మ‌రికొన్ని అంశాల‌తో టీడీపీ ప్రతిపాద‌న‌లు సిద్దం చేసింది. అటు జ‌న‌సేన కూడా ష‌ణ్ముక వ్యూహం పేరుతో రెండేళ్ల క్రితం ప్రక‌టించిన అంశాల‌న్నీ మేనిఫెస్టోలో పొందుప‌రిచేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు స‌మాచారం. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాద‌న‌ల‌పై చ‌ర్చించిన త‌ర్వాత మేనిఫెస్టోపై ఓ స్పష్టత‌కు రానున్నట్లు తెలిసింది. త్వర‌లో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల దిశ‌గా రెండు పార్టీలు సిద్దమ‌వుతున్నాయి. ఇక గురువారం జ‌రిగే స‌మావేశంలో రైతుల స‌మ‌స్యల‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు. రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు, రైతుల‌ను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నట్లు తెలిసింది.
దీపావ‌ళి త‌ర్వాత ఉమ్మడి పోరాటాల‌కు సిద్దమ‌వుతున్న రెండు పార్టీలు..
తొమ్మిదో తేదీ ఉమ్మడి స‌మావేశంలో తీసుకునే నిర్ణయాల‌పై మ‌రోసారి చంద్రబాబు-ప‌వ‌న్ భేటీలో చ‌ర్చిస్తారు. దీపావ‌ళి త‌ర్వాత మ‌రోసారి ఇద్దరు నేత‌లు స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలోనే మేనిఫెస్టో విడుద‌ల‌కు తేదీని ఖ‌రారు చేయ‌నున్నారు. మ‌రోవైపు ఉమ్మడి పోరాటాల‌కు కూడా దీపావ‌ళి త‌ర్వాత ప్రత్యేక షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. చంద్రబాబు-ప‌వ‌న్ భేటీ కంటే ముందుగానే జేఏసీ నేత‌లు తాత్కాలిక షెడ్యూల్, మేనిఫెస్టోల‌కు తుదిరూపు తీసుకురానున్నారు. మొత్తానికి వ‌చ్చే వారం నుంచి దూకుడు పెంచేలా టీడీపీ-జ‌న‌సేన ప్రణాళిక‌తో ముందుకెళ్తున్నాయి.

‘దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు’.. పురందేశ్వరిపై మండిపడుతోన్న వైసీపీ నేతలు..

పురందేశ్వరి రాసిన బెయిల్ రద్దు లేఖ ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆమె తీరుపై వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె ఏ పార్టీలో ఉన్నారు.. ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఆమె కళ్లకు కనిపించడం లేదా అంటూ నిలదీస్తోంది వైసీపీ.
సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీజేఐకి పురందేశ్వరి లేఖరాయడం పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతోంది వైసీపీ. ఆమెకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలి పదవి పార్టీకి సేవ చేసేందుకా.. లేక టీడీపీ అధినేతగా ఉన్న బావకు సేవ చేసేందుకా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. పురందేశ్వరికి డబ్బు వ్యామోహం తప్ప.. దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు. పురంధేశ్వరి దృష్టంతా పైరవీలు, సంపాదనపైనే ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి.
పురందేశ్వరికి నీతి, నిజాయితీ ఉంటే..చంద్రబాబు స్కాంలపై CBI విచారణ కోసం లేఖ రాయాలని డిమాండ్ చేశారు మంత్రి రోజా. NTR పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తూ.. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పురంధేశ్వరి చదువుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షురాలిగా కనీసం పది ఊర్లు కూడా పురందేశ్వరి తిరగలేదు. కానీ టీడీపీని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచిస్తోందని ఆరోపించారు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.
పురందేశ్వరికి పదవులు, డబ్బు పైనే ఆశ తప్ప పార్టీ గురించి ఏమాత్రం ఆలోచన లేదని ఆరోపిస్తోంది వైసీపీ. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాలను కాదని టీడీపీకి భుజం కాస్తోందనీ.. బీజేపీని టీడీపీలో విలీనం చేసే స్థాయికి తీసుకొచ్చిందనేది వైసీపీ ఆరోపణ. పార్టీకి ద్రోహం చేస్తున్న పురందేశ్వరిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

Vijayawada Bus Accident: గేర్‌ తప్పుగా మార్చడంతోనే ప్రమాదం.. విజయవాడ ఘటనలో ముగ్గురిపై చర్యలు

Vijayawada Bus Accident: విజయవాడ బస్టాండ్‌లోకి బస్సు దూసుకెళ్లి.. ముగ్గురు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్‌ ప్రకాశం సహా మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. బస్సు డ్రైవర్‌ ప్రకాశం తప్పుగా గేర్‌ ఎంచుకోవడం వల్లే బస్సు బస్టాండ్‌లోకి దూసుకెళ్లిందని నివేదికలో పేర్కొన్నారు. దాంతో డ్రైవర్‌ ప్రకాశంపై సస్పెన్షన్‌ వేటు వేశారు. విధుల పర్యవేక్షణలో ఆటోనగర్‌ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ వి.వి.లక్ష్మి విఫలమయ్యారని నిర్ధరించారు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టం ఉన్న బస్సుకు పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లను పంపాల్సి ఉంది. కానీ.. అలా చేయకుండా సూపర్‌ లగ్జరీ బస్సులను నడిపిన డ్రైవర్‌ ప్రకాశాన్ని పంపారని కమిటీ తేల్చింది. కానీ.. డ్రైవర్‌కు ముందస్తుగా.. సమగ్ర శిక్షణ ఇవ్వలేదని నిర్ధారించారు. అందుకు.. ఆటోనగర్ అసిస్టెంట్ డిపో మేనేజర్ వి.వి లక్ష్మి బాధ్యతారాహిత్యమే కారణమని తెలుపుతూ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాలను సమగ్రంగా పర్యవేక్షించాల్సిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ విఫలమయ్యారని కమిటీ తేల్చింది. ఆయనపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రెండు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్ లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కండక్టర్ వీరయ్య, కుమారి, చిన్నారి అయాన్స్ గా గుర్తించారు. మృతుల కటుంబ సభ్యులకు ఆర్టీసీ 5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 10 లక్షలు ప్రకటించారు.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. బస్సు ప్రమాదంతో ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌ కూడా ఉలిక్కిపడింది. వెంటనే ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేసిన ఆర్టీసీ కమిటీ.. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో.. దాని ఆధారంగా ఆర్టీసీ అధికారులు ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు.

Venkatesh : వెంకటేష్ కూతురి నిశ్చితార్థం వేడుకలో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఫోటోలు..

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తన రెండో కూతురి హయవాహిని నిశ్చితార్థం వేడుక నిన్న సైలెంట్ గా జరిగిపోయింది. దగ్గుబాటి కుటుంబ సభ్యులు, వరుడు కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ నుంచి దగ్గర స్నేహితులు మాత్రమే ఈ నిశ్చితార్థం వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి, మహేష్ బాబు, నాగచైతన్య.. తదితరులు ఈ వేడుకలో కనిపించారు.

1 / 5
2 / 5
3 / 5
4 / 5
5 / 5

Valmiki Caves: పర్యాటకులను సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోన్న వాల్మీకి గుహలు.. ప్రత్యేకతలేంటో తెలుసా?

ఆశ్చర్యం.. సంభ్రమాశ్చర్యం… బోరా గుహలు, బెలూం గుహలను తలదన్నే విధంగా అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా వెలుగులోకి వచ్చాయి వాల్మీకి గుహలు. సహజ సిద్ధం తో పాటు అతి ప్రాచీన చరిత్ర కలిగి రామాయణంతో ముడిపడి ఉండటం ఈ గుహలకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్ల మేకల పల్లి దగ్గర వాల్మీకి గుహలు వెలుగు చూశాయి. అత్యంత సహజ సిద్ధంగా ఉన్నాయి
1 / 5
2 / 5
3 / 5
4 / 5
5 / 5

Aadi Keshava : ఆదికేశవ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో వైష్ణవ తేజ్, శ్రీలీల డాన్స్.. ఫోటోలు..

వైష్ణవ తేజ్, శ్రీలీల కలిసి చేస్తున్న సినిమా ఆదికేశవ. ఈ మూవీ నుంచి తాజాగా మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు. నిన్న ఒక ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో వైష్ణవ తేజ్, శ్రీలీల డాన్స్ వేసి అదరగొట్టేశారు.
1 / 10
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10

Mrunal Thakur : బ్లాక్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ స్టైలిష్ ఫోటోషూట్..

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సినిమాల్లో తన పాత్రలతో, సోషల్ మీడియాలో అందాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ ఫోటోషూట్ చేసి వావ్ అనిపిస్తుంది.

1 / 6
2 / 6
3 / 6
4 / 6
5 / 6
6 / 6

Leo: రజనీకాంత్‌ని టార్గెట్‌ చేసిన విజయ్‌.. లియో 500కోట్లు!

డైరక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ లేటెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ లియో 500 కోట్ల మార్క్ దాటేసింది. దళపతి విజయ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన సినిమా లియో. బాక్సాఫీస్‌ దగ్గర మామూలుగా లేవు వసూళ్లు. సినిమా విడుదలైన తొలి వారంలోనే దాదాప 500 కోట్ల మార్కు దాటేసింది లియో. లియో డొమెస్టిక్‌ కలెక్షన్లు 262 కోట్లు. డొమెస్టిక్‌ వైజ్‌ కలెక్షన్లలో తమిళ సినిమాల్లో రెండో హయ్యస్ట్ గ్రాసింగ్‌ సినిమాగా రికార్డు క్రియేట్‌ చేస్తోంది లియో. ఆల్రెడీ రజనీకాంత్‌ నటించిన జైలర్‌ 343.47 కోట్ల లైఫ్‌ టైమ్‌ కలెక్షన్లతో నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉంది. ఆల్‌ టైమ్‌ తమిళ సినిమా కలెక్షన్లలో మూడో ప్లేస్‌లో ఉంది లియో. రజనీకాంత్‌ నటించిన జైలర్‌ ఫస్ట్ ప్లేస్‌లో, 2.0 సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాయి.
1 / 4
2 / 4
3 / 4
4 / 4

Viral News: ఓరీ దేవుడో.. ఎంతపెద్ద కొండచిలువ.. మేకను సజీవంగా మింగేస్తుంటే చూసిన జనాలను..

పైథాన్ విషపూరితం కానప్పటికీ, దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, భయంకర పాముగానే పిలుస్తారు. ఈ పాము తన బాధితుడిని పట్టుకున్న తర్వాత, దానిని చంపిన తర్వాత మాత్రమే విడిచిపెడుతుంది. మలేషియాలోని కెడా నుంచి ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. 23 అడుగుల పొడవైన కొండచిలువ మేకను సజీవంగా మింగేసింది. అయితే దానిని తిన్న తర్వాత కొండచిలువ కదలలేని స్థితిలో ఉండిపోయింది. నివేదిక ప్రకారం.. సుమారు 140 కిలోల బరువున్న ఈ కొండచిలువ ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది దానిని చాకచక్యంగా పట్టుకుని బంధించారు. మైక్రో బ్లాగింగ్ సైట్‌లో వైరల్ అయిన ఫోటోలలో పాము పొడవు చాలా భయానకంగా కనిపిస్తుంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కొండచిలువ మేకను మింగినట్లు తమకు సమాచారం వచ్చిందని చెప్పారు రెస్క్యూ టీం. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న బృందం సహాయక చర్యలు చేపట్టింది.

జనావాసాల సమీపంలోకి వచ్చిన ఒక భారీ కొండచిలువ.. అక్కడ ఎదురుపడిన ఒక మేకను మింగేసింది. కానీ అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల అది కదలలేకపోయింది. ఈ సంఘటన అక్టోబర్ 19న జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం.. ఆ భారీ సర్పాన్ని పట్టి బంధించారు. 140 కిలోల బరువు, భారీ పొడవైన కొండచిలువ మేకను సజీవంగా మింగేసింది. పాము పొడవు చూసి ప్రజలు భయంతో వణికిపోయారు.

సజీవంగా ఉన్న మేకను మింగుతుండగా చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేక తన ఇంటి సమీపంలోని ఎన్‌క్లోజర్‌లో ఉండగా, కొండచిలువ దాడి చేసిందని చెప్పారు. అయితే అది కనిపించిన వెంటనే కొండచిలువ దానిపై దాడి చేసిందన్నారు.. కొండచిలువ పూర్తిగా కదలలేక పోవడంతో దానిని పట్టుకునేందుకు ఆ శాఖ పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. 25 నిమిషాల్లోనే కొండచిలువను అదుపు చేశారు. కొండచిలువను అడవిలోకి విడుదల చేయడానికి ముందు పెనిన్సులర్ మలేషియా డిపార్ట్‌మెంట్ వన్యప్రాణి, నేషనల్ పార్క్‌లకు అప్పగించారు.

అయితే, ఇది పైథాన్‌లో అత్యంత ప్రమాదకరమైన జాతిగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి మనుషులను కూడా మింగేస్తాయని చెప్పారు. పాములలో ఇది అతి పొడవైన జాతి అని చెప్పారు. ఇలాంటి పైథాన్‌లు దక్షిణ, ఆగ్నేయాసియాలో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు.

1 3 4 5 6 7 22