Pongal 2024 : పొంగల్ రేసులోకి మరో తమిళ్ సినిమా.. ఆల్రెడీ అరడజను తెలుగు చిత్రాలు..

Pongal 2024 : తెలుగు వారికీ పెద్ద పండగ అంటే సంక్రాంతి. ఈ ఫెస్టివల్ ని బంధువులంతా కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. ఇక అలాంటి పండుగలో మరింత సందడి పెంచడానికి సినిమా మేకర్స్ కూడా ఉత్సాహపడుతుంటారు. ఈక్రమంలోనే పొంగల్ కి థియేటర్స్ లో అదిరిపోయే సినిమాలు తీసుకు వచ్చి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటారు. ప్రేక్షకులు కూడా పండక్కి తమ అభిమాన హీరో సినిమా వస్తే చూడాలని ఆశిస్తుంటారు.

దీంతో ఇండస్ట్రీలోని స్టార్స్ ఆ పండక్కి వచ్చేందుకు పోటీ పడుతుంటారు. ఈక్రమంలోనే వచ్చే సంక్రాంతికి పండగ అంతా థియేటర్స్ వద్దనే ఉండబోతుందని తెలుస్తుంది. 2024 పొంగల్ బరిలో నిలిచేందుకు అరడజను తెలుగు సినిమాలు పోటీ పడుతుంటే, రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఆ బరిలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ ‘గుంటూరు కారం’.. సంక్రాంతికి వస్తున్నామంటూ ముందుగా ప్రకటించారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇదే రోజు తేజ సజ్జా నటిస్తున్న ‘హనుమాన్’ కూడా రిలీజ్ కాబోతుంది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.

ఇక టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తన 75వ చిత్రంగా ‘సైంధవ్‌’ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కాబోతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇదే రోజు రవితేజ ‘ఈగల్’ని కూడా తీసుకు వస్తున్నామంటూ ఆ చిత్ర నిర్మాతలు కచ్చితంగా చెప్పేసారు. ఈ రెండు సినిమాలు యాక్షన్ థ్రిల్లర్ జోనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

వీటితో పాటు కింగ్ నాగార్జున నటిస్తున్న ‘నా సామిరంగ’, రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాలను కూడా సంక్రాంతికే తీసుకు రావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. కచ్చితమైన డేట్ ప్రకటించినప్పటికీ సంక్రాంతికి వస్తున్నామంటూ చెబుతున్నారు. ఇక ఈ రేసులోకి తమిళ హీరోలు కూడా వచ్చి చేరుతున్నారు. మామాఅల్లుళ్లు రజినీకాంత్, ధనుష్ పండక్కే వస్తున్నామంటున్నారు.

రజినీకాంత్ నటిస్తున్న ‘లాల్ సలామ్’ని సంక్రాంతికి తీసుకు వస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. తాజాగా ధనుష్ తన ‘కెప్టెన్ మిల్లర్’ని కూడా పొంగల్ కే తీసుకు వస్తున్నామంటూ ప్రకటించాడు. అయితే ఈ మామాఅల్లుళ్లు కచ్చితమైన డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. మరి ఈ చిత్రాలు అన్ని చెప్పినట్లు పండక్కే వస్తాయా? లేదా వెనక్కి తగ్గుతాయా? అనేది చూడాలి.

Salaar : ఆ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన ‘సలార్’ మూవీ మేకర్స్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..

ఇప్పుడు అంతా ‘సలార్’ కోసమే ఎదురుచూపులు. దాదాపు మూడు నెలల తర్వాత ఇటలీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. గత కొన్నాళ్లుగా మోకాలీ నొప్పితో బాధపడుతున్న ప్రభాస్.. ఇటీవల ఇటలీలో సర్జరీ చేయించుకున్నారు. అనంతరం అక్కడే విశ్రాంతి తీసుకున్న ఆయన.. బుధవారం తిరిగి రాగా.. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రభాస్ తిరిగి రావడంతో ‘సలార్’ ఆగయా.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు ఫ్యాన్స్. ఇక త్వరలోనే సలార్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ సెన్సెషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ కాగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

కేజీఎఫ్ చిత్రాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన నీల్.. ఇప్పుడు ప్రభాస్ ప్రధాన పాత్రలో సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడూ చూడాలా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు కానున్నట్లు తెలుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని.. అన్నింటిలోనూ ప్రభాస్ పాల్గొని మీడియాతో ఇంట్రాక్ట్ కానున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే తాజాగా సలార్ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ 22న విడుదల చేస్తున్నామని చిన్న క్లిప్ షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇన్నాళ్లుగా సలార్ వాయిదా అంటూ నెట్టింట జరుగుతున్న రూమర్లకు చెక్ పడింది. అలాగే హిందీ థియేట్రికల్ రైట్స్ విషయంలో సమస్యలు ఉన్నాయని.. దాంతో మరోసారి సినిమా వాయిదా పడుతుందని టాక్ నడుస్తోంది. దీంతో సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Bharateeyudu 2 : విజయవాడలో ఇండియన్ 2 షూటింగ్.. రెండు భాగాలుగా సినిమా..

Indian 2 : కమల్ హాసన్ హీరోగా శంకర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇటీవల ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పడంతో షూటింగ్ చివరి దశకు వచ్చింది అందుకున్నారు.

అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా ఉందట. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. అయితే ఎడిటింగ్ టేబుల్ మీదకి సినిమా వచ్చినప్పుడు చాలా ఎక్కువ రన్ టైంతో వచ్చిందట. దానిని కట్ చేయడానికి కూడా పెద్దగా ఆస్కారం లేకపోవడంతో.. రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారట. ఇండియన్ 2, ఇండియన్ 3 గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయట. ఇప్పుడు ఈ ఇండియన్ 3కి సంబంధించిన షూటింగే జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ విజయవాడలో జరుగుతుంది.

కమల్ హాసన్ లేని సన్నివేశాలను శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఇండియన్ 3 షూటింగ్ కోసం కమల్ హాసన్ ని 40 రోజులు కాల్‌షీట్స్ అడిగారట. అందుకు కమల్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇక ఇండియన్ 2ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే ఇండియన్ 3ని వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ చేయనున్నారట. అయితే ఈ రిలీజ్ వార్త రామ్ చరణ్ అభిమానులను భయపెడుతుంది. ఈ సినిమా షూటింగ్ వల్ల గేమ్ ఛేంజర్ చిత్రీకరణ లేటు అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇండియన్ 3కి మరో నలభై రోజులు అంటే గేమ్ ఛేంజర్ సంగతి ఏంటని కంగారు పడుతున్నారు.

Unstoppable with NBK: అన్‏స్టాపబుల్ షోకు రానున్న బాలీవుడ్ హీరో.. రష్మికతో కలిసి సందడి..

ఇప్పటివరకు సినిమాల్లో యాక్షన్ హీరోగా అలరించిన నందమూరి బాలకృష్ణ.. అటు యాంకరింగ్‏తోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలయ్య. ఇప్పటివరకు రెండు సీజన్స్ విజయవంతగా కంప్లీట్ చేసుకున్న ఈషో.. ఇప్పుడు సీజన్ 3 రన్ అవుతుంది. ఇందులో సెలబ్రెటీల సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిగత విషయాల గురించి సైతం ఆసక్తికర ప్రశ్నలు వేసి అభిమానులకు కావాల్సిన విషయాలను తెలుసుకుంటారు బాలయ్య. అంతేకాకుండా తన కామెడీ టైమింగ్‏తో అలరిస్తుంటారు. ఇక ఇటీవల స్టార్ట్ అయిన సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ కోసం భగవంత్ కేసరి టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో శ్రీలీల, కాజల్ హీరోయిన్లుగా నటించగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీలీల, కాజల్, అనిల్ రావిపూడి అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.

ఇక ఇప్పుడు నెట్టింట వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈషోలో యానిమల్ చిత్రయూనిట్ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి వంగా రాబోతున్నారని తెలుస్తోంది. వీరి కాంబోలో తెరకెక్కిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్, టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

అయితే ఇప్పుడు వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ షోలో రణబీర్ కపూర్ పాల్గొంటే.. బాలయ్య హోస్టింగ్‏కు ఫిదా అయ్యే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా బాలయ్యకు రష్మిక ఫేవరేట్ హీరోయిన్ కూడా. దీంతో యానిమల్ టీం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ రాబోతుందనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు.

Guntur Karam: ‘దమ్ మాసాలా’ ఆల్ టైమ్ రికార్డ్.. ఆ టాప్ లిస్ట్‏లో గుంటూరు కారం సాంగ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం టీజర్ రిలీజ్ కాగా.. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన దమ్ మసాలా సాంగ్ మ్యూజిక్ లవర్స్‏ను ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ క్రేజ్, చరిష్మాకు తగినట్లుగా రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్ తో రాసిన ఈ పాటకు థమన్ అదిరిపోయే ట్యూన్ అందించారు. ఈ సాంగ్ అన్ని వర్గాల అడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. అంతేకాకుండా ఈ పాటలో మహేష్ లుక్స్ చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు దమ్ మసాలా సాంగ్ ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 19.2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని టాలీవుడ్ ఫస్ట్ డే అత్యధిక వ్యూస్ అందుకున్న పాటగా నిలిచింది.

ఇప్పటివరకు సౌత్ నుంచి వచ్చిన అన్ని హిట్ సాంగ్స్ లో 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ పాటలలో మొదటి స్థానంలో బీస్ట్ మూవీ అరబిక్ కతు సాంగ్ ఉంది. ఈ పాట ఏకంగా 23.27 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే రెండో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం నుంచి విడుదలైన దమ్ మసాలా సాంగ్ నిలవడం విశేషం. ఈ పాట ఇప్పటివరకు 17.42 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. మూడో స్థానంలో విజయ్ వారిసు సినిమాలోని రంజితమే సాంగ్ 16.68 మిలియన్ వ్యూస్‏తో నిలిచింది. ఇక విజయ్ నటించిన లియో చిత్రంలోని నా రెడీ సాంగ్ 16.55 మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానంలో నిలిచింది. సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ 16.38 మిలియన్ వ్యూస్ తో టాప్ 5 లోకి వచ్చింది. ఇవే కాకుండా కళావతి సాంగ్ 14.78 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని టాప్ 6గా నిలిచింది. ఈ జాబితాలో మొత్తం టాప్ 6 సాంగ్స్ లో మూడు పాటలు మహేష్ బాబువి ఉండడం విశేషం.

Actor Venkatesh: సైలెంట్‏గా వెంకటేశ్ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేష్ బాబు హాజరు.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం వేడుక బుధవారం ఘనంగా జరిగింది. వెంకటేశ్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది. ఓవైపు బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఇక ఇప్పుడు రెండో అమ్మాయికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు వెంకీ. బుధవారం తన కూతురు నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్‏లో చాలా సైలెంట్‏గా చేశారు. ఇరు కుటుంబసభ్యులు.. ఇండస్ట్రీకి చెందిన అతికొద్ది మంది ప్రముఖుల సమక్షంలో ఎంగెజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోస్ చూస్తుంటే.. వెంకీ కూతురి నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బబు హాజరయ్యి నూతన జంటను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. వెంకటేశ్ రెండో కూతురిని విజయవాడకు చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో హయవాహిని వివాహం జరిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుంచి వెంకీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇక తన సినిమాలు తప్ప.. ఫ్యామిలీ విషయాలు బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇక ఇప్పుడు తన కూతురి ఎంగజ్మెంట్ విషయం గురించి మీడియాకు తెలియకుండానే చూసుకున్నారు. అటు వెంకీ తనయులు కూడా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు.

ఇక వెంకీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సైంధవ్ సినిమా చేస్తున్నాడు. తన కెరీర్ లో 75వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలకపాత్రలలో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.

బాలీవుడ్ జడ్జిలను ఫిదా చేసిన హైదరాబాద్ కుర్రాడు.. అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ర్యాప్ సాంగ్ తెగ వైరలవుతుంది. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు ఓ కుర్రాడు ర్యాప్ సాంగ్ అదరగొట్టేస్తోన్న వీడియో హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ టీవీ ఛానల్‏లో నిర్వహించిన మ్యూజిక్ షోలో హైదరాబాద్ గురించి చెప్తూనే సౌత్ యాక్టర్స్ అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ ఆలపించాడు. ఆ కుర్రాడి పాటకు బీటౌన్ జడ్జీలు ఫిదా కాగా.. అక్కడున్న అడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఆ యువకుడు హైదరాబాద్‏కు చెందిన రేపర్ కేదెన్ శర్మ. ఎంటీవీ హాస్టిల్ సీజన్ 3లో తన ఫర్ఫార్మెన్స్‏తో దుమ్మరేపాడు. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ రేపర్.. ‘హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీ కీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ’ అంటూ స్టేజ్ ని కిక్కెక్కించాడు. హైదరాబాద్ కల్చర్, నగరం గొప్పతనాన్ని.. ఇక్కడి వీధుల్లో చిరు వ్యాపారుల రోజు వారీ జీవితాన్ని తెలియజేస్తూ పాటను స్టార్ట్ చేశాడు.

‘పాట మధ్యలోనే మజా రావడం లేదా.. ఇప్పుడు వస్తుంది చూడండి.. అంటూ అల్లు అర్జున్ డాన్స్ అంటే అందరికీ ఇష్టం.. స్టైల్ స్టార్ అందరూ అతని.. తగ్గేదే లే మేము పుష్ప ఫ్యాన్స్’ అంటూ లిరిక్స్ తో ఓ ఊపు ఉపేసాడు. ఆ తర్వాత వెంటనే సాయి పల్లవి గురించి ప్రస్తావిస్తూ.. ‘అందాలు ఆరబోసే హీరోయిన్స్ ఉంటారు.. కానీ సాయిపల్లవి సింప్లిసిటీ, పాపులారిటీ ఎవరికీ రాదు.. తెలుగులో ఉన్నది 70 మిలియన్ జనాలు..కానీ ఆమె రౌడీ బేబీ పాటకు బిలియన్ వ్యూస్ వచ్చే క్రేజ్ ఆమెది’అంటూ ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు. ఇక అదే పాటలో హైదరాబాద్ లోని పాపులర్ ప్లేసెస్, సౌత్ మూవీస్ గొప్పతనం గురించి ప్రస్తావించడంతో జడ్జీలు ఫిదా అయ్యారు.

కేదెన్ శర్మ ర్యాప్ సాంగ్ వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇక అతనికి సంబంధించిన వీడియోను సీపీ ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలోక షేర్ చేస్తూ.. ఎంటీవీలో ప్రసారమైన ఈ షోను చూసి ఎంజాయ్ చేయండంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం కేదెన్ శర్మ ర్యాప్ సాంగ్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.

సంపూర్ణేష్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారా.? అసలు విషయం ఏంటి.?

ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు నటుడు సంపూర్ణేష్‌ బాబు. తొలి సినిమా హృదయకాలేయంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. పాజిటివ్‌ పబ్లిసిటీతోనే కాకుండా నెగిటివ్‌ పబ్లిసిటీతోనూ అందరి దృష్టిని ఆకట్టుకోవచ్చని నిరూపించాడు సంపూర్ణేష్‌ బాబు.

హృదయకాలేయం సినిమా విడుదల తర్వాత సంపూర్ణేష్‌ బాబు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఆ తర్వాత అదే అతనికి ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. దీంతో సంపూ సినిమా వస్తుందంటే మినిమం కామెడీ ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్‌ అయ్యారు. ఇక సంపూర్ణేష్‌ బాబుతో బడా నిర్మాణ సంస్థలు సైతం సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. బిగ్‌బాస్‌లో పాల్గొని ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే సంపూర్ణేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం తాజాగా విడుదలకు సిద్ధమైంది. ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘మండేలా’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ సెటైరికల్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. సంపూ మార్క్‌ కామెడీ ఈ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవనున్నట్లు మేకర్స్‌ అంచనా వేస్తున్నారు. తమిళంలో యోగిబాబు పోషించిన పాత్రలో సంపూర్ణేష్‌ బాబు నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న సంపూర్ణేష్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా సంపూ మాట్లాడుతూ.. తన అనారోగ్యం బాగా లేని కారణంగా సినిమాల్లో నటించడం లేదని గతంలో వచ్చిన వార్తలపై స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని మార్టిన్‌ లూథర్‌ కింగ్ విడుదలైన నెలల వ్యవధిలోనే మరో రెండు సినిమాలు రానున్నాయని తెలిపాడు. ఇక ఇండస్ట్రీలో కొందరు కావాలనే సంపూని తొక్కేస్తున్నారని, అందుకే పెద్దగా సినిమాలు చేయడం లేదనే టాక్‌ వినిపించిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తనతో అందరు బాగానే ఉంటారని, అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదని రూమర్స్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టేశాడు.

Rajinikanth: కేరళలో సూపర్ స్టార్ నయా మూవీ షురూ. వైరల్ అవుతోన్న వీడియో

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గరబోల్తా కొట్టాయి. దాంతో రజిని ఫ్యాన్స్ అంతా కాస్త నిరాశకు గురయ్యారు. అయితే జైలర్ సినిమా సంచలన విజయం సాధించి అభిమానులను ఫుల్ ఖుష్ చేసింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసింది. జైలర్ సినిమాను లేపింది అనిరుధ్ సంగీతం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ జైలర్ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు.
లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కు లోకేష్పెట్టింది పేరు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా విక్రమ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమాకు ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా లియో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ షూటింగ్ కేరళలో మొదలైంది. సూపర్ స్టార్ సినిమా కావడంతో షూటింగ్ స్పాట్ కు అభిమానులు భారీగా వచ్చారు. షూటింగ్‌ స్పాట్‌కి రజనీ వచ్చినప్పుడు తలైవా అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలు సూపర్ స్టార్ మరింత యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, రానా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Varun Lavanya : వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన మెగాస్టార్..

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని(Lavanya Tripathi) నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటూ సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపోయారు. మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మధ్యే ఈ నిశ్చితార్థం జరిగింది. మెగా అభిమానులు వరుణ్ పెళ్లిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడు చేసుకుంటారా అని చూస్తున్నారు.

ఇటీవలే బాలీవుడ్ ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వద్దకు వెళ్లి తమ పెళ్లి బట్టలు కూడా డిజైనింగ్ కి ఆర్డర్ ఇచ్చారు. వరుణ లావణ్య పెళ్లి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ లో ఉండొచ్చని సమాచారం. నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కి చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిల మధ్య ఈ సెలబ్రేషన్స్ జరిగాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు తన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అభిమానులు ఈ ఫోటోల కింద కామెంట్స్ పెడుతూ వీరి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుపుతున్నారు. మరి ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కనుందో చూడాలి.