Telangana Election 2023: Minister KTR Counter To PM Modi Says We Are Not B Team Of BJP, C Team Of Congress

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అంతేకాకుండా.. మాటల తూటాలు పేల్చుతూ.. ఎన్నికల రణరంగంలో సవాల్ చేసుకుంటున్నాయి. తాజాగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయాలను మరింత హీటెక్కించింది. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారన్నారు. మోదీని ప్రధానిని చేసే ఘట్టానికి పునాది పడింది ఇక్కడే అన్న ఆయన.. ఈ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తెలంగాణలో మార్పు తుఫాన్‌ కనిపిస్తోంది.. ఇక్కడ గెలిచేది బీజేపీనే అన్నారు.. కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ బీఆర్‌ఎస్‌ పార్టీ అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏలో 3 అంశాలు ఉన్నాయన్నారు. లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్‌ మాపై ఆరోపణలు చేస్తోందని.. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని, కచ్చితంగా జైలులో వేస్తామంటూ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ జన్మలో బీసీని సీఎంని చేయనివ్వరు.. మాది ఎన్డీయే, బీజేపీ.. ఓబీసీ మిత్రులపై అత్యంత ప్రేమ ఉంటుందంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

కాగా.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. రాహుల్‌ వచ్చి.. బీఆర్‌ఎస్‌ని బీజేపీ బీ టీమ్‌ అంటారని.. ఇప్పుడు మోదీ.. కాంగ్రెస్‌కి సీ టీమ్ అంటున్నారని.. తమది మాత్రం ముమ్మాటికీ టీ టీమ్‌, అంటే తెలంగాణ టీమ్‌ అన్నారు కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌ అంటేనే భారత రైతు సమితి అన్నారు. ఇక ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని వాళ్లు.. మాపై విమర్శలు చేయడం విడ్డూమన్నారు. నిన్నటి వరకు మత రాజకీయాలు చేశారు.. ఇప్పుడు కుల రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. బీజేపీ హయాంలో బీసీలకు మిగిలింది అరణ్య రోదనేనన్నారు. ఇక TSPSC పేపర్లు లీక్‌ చేసింది మీ బీజేపీ నేతలే అని.. నిందితులతో వేదిక పంచుకుని మాపై నిందలా అంటూ మండిపడ్డారు.

Telangana Election: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం.. సహాయకుడిగా వచ్చే వారికి ఇంక్ తప్పనిసరి..!

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ఈసీ సమీక్షించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ విషయంలో కొన్ని సూచనలు, నిబంధనలు జారీ చేసింది ఎన్నికల కమిషన్.

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెడతారు. సహాయకుడు అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలి. తన ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలి. ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కీలక మార్పులు చేసింది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అందరూ ఎన్నికల కోడ్ పాటించాలని సూచించింది ఎన్నికల కమిషన్. నిబంధనలు పాటించకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే స్థలం, సమయం తదితర వివరాలను స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. కుల, మత, భాషలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదన్నారు.

నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అఫిడవిట్ లోని అన్ని కాలమ్స్‌ను తప్పనిసరిగా అభ్యర్థులకు సూచించారు. నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ ద్వారా కూడా స్వీకరించడం జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. పోటీలో ఉండే అభ్యర్థులు తమ క్రిమినల్ రికార్డులను  లీడింగ్ న్యూస్ పేపర్స్, టీ.వీ ఛానళ్లలో పబ్లిష్ చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును అధ్యయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్రంలో ఇప్పటికే పర్యటిస్తోంది. అటు ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు. పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చునేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. మరోవైపు పోలింగ్ శాతం పెంచే అంశంపైనా ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు సదస్సులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది.

Telangana Election: తెలంగాణ అమాత్యుల్లో టెన్షన్ టెన్షన్.. మంత్రులు సేఫ్ జోన్‌లో ఉన్నారా..?

ఎన్నికల సమయం ఆసన్నమైదంటే చాలు.. రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకోవడానికి తమ శక్తియుక్తులను కూడగట్టుకుని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ప్రజల మధ్యకు చేరుకుని వారిని ఆకట్టుకుని, ఆకర్షించడానికి చేసే యత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే..! ఇప్పుడు ఇదే విధంగా తెలంగాణలో ప్రచారం హోరెత్తుతుంది. పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం నెలకొంది.

నామినేషన్లపర్వం ప్రారంభం కావటంతో అటు విపక్షాలు సైతం ప్రచారంలో జోరు పెంచాయి. ప్రచార రథాల రాక, మైకుల మోత, నేతల పర్యటనలు, కార్యకర్తల హడావిడితో పల్లెలు పట్టణాల్లో రాజకీయ కోలాహాలం నెలకొంది. ఎన్నికల గడువు నెల రోజులు కూడా లేకపోవటంతో, తెల్లవారింది మొదలు.. సాయంత్రం పొద్దుబోయేదాకా అభ్యర్థులు ఊరూవాడా చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న మంత్రులు అంతా సేఫ్ జోన్లో ఉన్నారా? ఎంత మంది మంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు? సేఫ్ జోన్‌లో ఉన్న మంత్రులు ఎవరు? రిస్క్ జోన్‌లోకి వెళుతున్నదీ ఎవరు అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కి‌ల్స్‌లో మొదలైంది.

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల గెలుపోటములపై చర్చ మొదలైంది. ఇటు బెట్టింగ్‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. అధికార పార్టీకి చెందిన మంత్రుల్లో బరిలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో అన్న హాట్ హాట్ చర్చ మొదలైంది. కేసీఅర్ కేబినెట్‌లో ఉన్న మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌లు పోటీలో లేరు. మిగిలిన వారంతా బరిలో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులను పక్కన పెడితే, మిగిలిన వారిపై చర్చ మొదలైంది. అటు కాంగ్రెస్ ,ఇటు బిజెపి పార్టీలు బరిలో ఉన్న మంత్రులపై బలమైన అభ్యర్థులను దింపే ప్రయత్నం చేసింది. అదే సమయంలో ప్రధాన పార్టీలు మంత్రుల నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు మంత్రుల నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి వెళుతున్నారు.

మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డీ బరిలో ఉండడంతో నిర్మల్ నియోజకవర్గంపై అందరి నజర్ ఉంది. ఇటు ప్రశాంత్ రెడ్డిపై సునీల్ రిడ్డీ పోటీలో ఉండడంతో ఇప్పుడు బాల్కొండ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. ఇటు కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సై అనడంతో ఆ నియోజకవర్గం సెన్సేషనల్‌గా మారింది. ఇక ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ గెలుపోటములపై హాట్ హాట్ గా చర్చలు మొదలు అయ్యాయి. ఇటు పువ్వాడ అజయ్‌పై కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తుండడంతో ఆ సీటు ఫలితంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగి రెడ్డీ నిరంజన్ రెడ్డి పోటీలో ఉన్న నియోజకవర్గాల ఫలితాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్న సనత్ నగర్, మల్లా రెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గాల రిజల్స్ట్‌పై ఉత్కంఠ భరింతంగా మారింది.

మొత్తంగా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ మంత్రులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు మారేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇక వీరి రాజకీయ భవిష్యత్ తేలాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు ఆగాల్సిందే..!

Telangana Election: హాట్ సీటుగా పాలేరు.. కాంగ్రెస్, సీపీఎం పొత్తు కటీఫ్.. ఎవరి ఓట్లకు గండి..!

తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ సీటుగా మారిన పాలేరు నియోజక వర్గంలో.. రోజుకో విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అందరూ ఊహించినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ షర్మిల పాలేరు పోటీ నంచి తప్పుకున్నారు. అనూహ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే షర్మిల తప్పుకున్నా.. ఇపుడు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీకి సై అంటున్నారు. దీంతో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లెఫ్ట్ ఓటు బ్యాంకుతో.. ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంచనాలకు అందని, ఊహించని రాజకీయ పరిణామాలతో ఆసక్తి కరంగా మారింది. చివరి వరకు టికెట్‌పై ఆశ పెట్టుకున్న తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రె కి బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడంతో.. తుమ్మల కాంగ్రెస్ గూటికి చేరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి, గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్ళు కడుగుతానని, దాని కోసమే పాలేర లో పోటీ చేస్తున్నట్లు తుమ్మల ప్రకటించారు. కానీ అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెరపైకి వచ్చారు. దీంతో తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు.

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాలేరులో పోటీ చేస్తానని మాట ఇచ్చారు. నియోజకవర్గంలో నూతన క్యాంపు కార్యాలయం, సొంతంగా ఇళ్ళు కూడా నిర్మిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేశారు. అయితే ఉహించని విధంగా ఒక దశలో కాంగ్రెస్‌లో పార్టీ విలీనం పై చర్చలు జరిపారు. కానీ దానికి బ్రేక్ పడటంతో ఒంటరిగా పాలేరు లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు షర్మిల. కానీ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో పాలేరు రాజకీయం మరో మలుపు తిరిగింది. షర్మిల పోటీ చేస్తే..కాంగ్రెస్ ఓటు బ్యాంకు, వైఎస్ అభిమానుల ఓట్లు చీల్చి, అంతిమంగా పొంగులేటికి మైనస్ అయ్యి.. బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందనే లెక్కలు వేసుకున్నారు. ఆ ప్రచారమే జరిగింది. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కాంగ్రెస్‌కు ,ముఖ్యంగా పొంగులేటికి కొంత ఊరట కలిగించింది.

పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకూ ఉప ఎన్నికలతో కలుపుకుని 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, రెండు సార్లు సీపీఎం, ఒకసారి సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు గెలుపొందాయి. ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్, కాంగ్రెస్ మధ్య పొత్తులో సీట్ల సర్దుబాటు కుదరక, సీపీఎం, కాంగ్రెస్ మధ్య బ్రేకప్ అయ్యింది. దీంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత నియోజకవర్గం కావడంతో, ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సీపీఎం పోటీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ జరుగుతోంది. పాలేరులో కమ్యూనిస్టులు గెలిచే స్థితిలో లేకపోయినా, ఒకరి గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు ఉన్నాయి. సీపీఎం, సీపీఐలకు కొంత ఓటు బ్యాంకు ఉంది. ఇపుడు పోటీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుతారన్న భావిస్తున్నారు. అది మళ్ళీ అధికార బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ గా మారుతుందా.. అనే కోణంలో చర్చ జరుగుతోంది. గతంలో బలంగా ఉన్న వామ పక్షాలు రాను రానూ ఉద్యమాలకే పరిమితం అయ్యాయి. ఆ పార్టీ లు బలహీన పడ్డారనే వాదన వినిపిస్తోంది. మరి ఇపుడు పాలేరులో సీపీఎం పోటీతో ఎంత మేరకు ప్రభావితం చేస్తోంది..? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి..? అన్నదీ వేచి చూడాలి..!

పవన్ లేకుండానే టీడీపీ-జనసేన సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చే అవకాశం..

తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండ‌బోతుంది.? రెండు పార్టీలు క‌లిసి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎలా చేస్తాయి. ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల్లో ఆస‌క్తిగా మారింది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరి రోజులు గ‌డిచిపోతుంది. అయినా ఉమ్మడి పోరాటాల‌పై మాత్రం స్పష్టత రావడం లేదు. రెండు పార్టీలు క‌లిసి ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై ఉమ్మడి కార్యాచ‌ర‌ణ క‌మిటీ ఏర్పాటు చేసాయి. ఈ క‌మిటీ మొద‌టిసారి రాజ‌మండ్రిలో స‌మావేశ‌మైంది. ప్రభుత్వంపై ఆందోళ‌న‌ల కంటే రెండు పార్టీల క‌ల‌యిక‌పైనే ముందుగా దృష్టి పెట్టాయి. రాష్ట్ర స్థాయిలో జ‌రిగిన స‌మావేశానికి నారా లోకేష్‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రై క్యాడర్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇక ఆ త‌ర్వాత జిల్లా స్థాయిలో స‌మ‌న్వయ స‌మావేశాలు జ‌రిగాయి. రెండు పార్టీల మ‌ధ్య ఎలాంటి పొర‌ప‌చ్చాలు లేకుండా క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగడంపైనే చ‌ర్చించాయి. ఒక‌రకంగా చెప్పాలంటే ఈ సమావేశాలు క్యాడర్ మ‌ధ్య క‌ల‌యిక కోసం ఏర్పాటు చేసిన‌వే. ముఖ్యంగా పొత్తు వ‌ల్ల రెండు పార్టీల నాయ‌కుల్లో గానీ కార్యక‌ర్తల్లో గానీ మ‌న‌స్పర్ధలు లేకుండా ముందుకెళ్లేలా ఈ స‌మావేశాలు నిర్వహించారు. మ‌రోవైపు ఓటు బ‌ద‌లాయింపుపైనా స‌మ‌న్వయ స‌మావేశాల్లో చర్చించారు. రెండు పార్టీల ఓట్లు ఇత‌ర పార్టీల‌కు మ‌ళ్లకుండా ఉమ్మడి అభ్యర్ధికే ఖ‌చ్చితంగా వేసేలా చూడాల‌ని స‌మావేశంలో అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తంగా రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో జ‌రిగిన సమావేశాల్లో ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేకుండా క‌లిసిక‌ట్టుగా సాగ‌డంపైనే చ‌ర్చించాయి. తాజాగా న‌వంబ‌ర్ తొమ్మిదో తేదీన మ‌రోసారి రాష్ట్ర జేఏసీ స‌మావేశం అవుతుంది. ఈ స‌మావేశంలో అన్ని అంశాల‌పై క్లారిటీ ఇచ్చే దిశ‌గా రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి.
ఉమ్మడి స‌మావేశంలో మేనిఫెస్టోపై క్లారిటీ ఇచ్చే దిశ‌గా టీడీపీ-జన‌సేన‌..
ఈ నెల తొమ్మిదో తేదీని టీడీపీ-జ‌న‌సేన ఉమ్మడి స‌మావేశం విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నుంది. ముందుగా ఈ స‌మావేశాన్ని మంగ‌ళగిరిలోని టీడీపీ కార్యాల‌యంలో జ‌ర‌పాల‌ని నిర్ణయించినప్పటికీ వేదిక‌ను విజ‌య‌వాడ‌కు మార్చారు. ఓ ప్రయివేట్ హోట‌ల్‌లో జరిగే ఈ స‌మావేశానికి నారా లోకేష్‌తో పాటు జేఏసీలోని 12 మంది స‌భ్యులు హాజ‌రుకానున్నారు. అయితే జ‌న‌సేన నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స‌మావేశానికి హాజ‌రుకావ‌డం లేదు. ఈ స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. గ‌త స‌మావేశంలో మేనిఫెస్టోపై ప‌వ‌న్ క‌ళ్యాణ్-నారా లోకేష్ చ‌ర్చించారు. ఆ త‌ర్వాత ఇటీవ‌ల చంద్రబాబుతో భేటీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా మేనిఫెస్టో విడుద‌ల‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించారు. దీనికి కొన‌సాగింపుగా గురువారం జ‌రిగే స‌మావేశంలో మేనిఫెస్టోకు తుదిరూపు తీసుకురానున్నారు. ఇప్పటికే సూప‌ర్ సిక్స్ పేరిట తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. ఇది ప్రిలిమిన‌రీ మేనిఫెస్టో మాత్రమే..వాస్తవంగా విజ‌య‌ద‌శ‌మి రోజు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ప్రక‌టించారు. అది వాయిదా ప‌డింది. సూప‌ర్ సిక్స్‌తో పాటు మ‌రికొన్ని అంశాల‌తో టీడీపీ ప్రతిపాద‌న‌లు సిద్దం చేసింది. అటు జ‌న‌సేన కూడా ష‌ణ్ముక వ్యూహం పేరుతో రెండేళ్ల క్రితం ప్రక‌టించిన అంశాల‌న్నీ మేనిఫెస్టోలో పొందుప‌రిచేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు స‌మాచారం. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాద‌న‌ల‌పై చ‌ర్చించిన త‌ర్వాత మేనిఫెస్టోపై ఓ స్పష్టత‌కు రానున్నట్లు తెలిసింది. త్వర‌లో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల దిశ‌గా రెండు పార్టీలు సిద్దమ‌వుతున్నాయి. ఇక గురువారం జ‌రిగే స‌మావేశంలో రైతుల స‌మ‌స్యల‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు. రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు, రైతుల‌ను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నట్లు తెలిసింది.
దీపావ‌ళి త‌ర్వాత ఉమ్మడి పోరాటాల‌కు సిద్దమ‌వుతున్న రెండు పార్టీలు..
తొమ్మిదో తేదీ ఉమ్మడి స‌మావేశంలో తీసుకునే నిర్ణయాల‌పై మ‌రోసారి చంద్రబాబు-ప‌వ‌న్ భేటీలో చ‌ర్చిస్తారు. దీపావ‌ళి త‌ర్వాత మ‌రోసారి ఇద్దరు నేత‌లు స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలోనే మేనిఫెస్టో విడుద‌ల‌కు తేదీని ఖ‌రారు చేయ‌నున్నారు. మ‌రోవైపు ఉమ్మడి పోరాటాల‌కు కూడా దీపావ‌ళి త‌ర్వాత ప్రత్యేక షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. చంద్రబాబు-ప‌వ‌న్ భేటీ కంటే ముందుగానే జేఏసీ నేత‌లు తాత్కాలిక షెడ్యూల్, మేనిఫెస్టోల‌కు తుదిరూపు తీసుకురానున్నారు. మొత్తానికి వ‌చ్చే వారం నుంచి దూకుడు పెంచేలా టీడీపీ-జ‌న‌సేన ప్రణాళిక‌తో ముందుకెళ్తున్నాయి.

‘దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు’.. పురందేశ్వరిపై మండిపడుతోన్న వైసీపీ నేతలు..

పురందేశ్వరి రాసిన బెయిల్ రద్దు లేఖ ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆమె తీరుపై వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె ఏ పార్టీలో ఉన్నారు.. ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఆమె కళ్లకు కనిపించడం లేదా అంటూ నిలదీస్తోంది వైసీపీ.
సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీజేఐకి పురందేశ్వరి లేఖరాయడం పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతోంది వైసీపీ. ఆమెకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలి పదవి పార్టీకి సేవ చేసేందుకా.. లేక టీడీపీ అధినేతగా ఉన్న బావకు సేవ చేసేందుకా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. పురందేశ్వరికి డబ్బు వ్యామోహం తప్ప.. దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు. పురంధేశ్వరి దృష్టంతా పైరవీలు, సంపాదనపైనే ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి.
పురందేశ్వరికి నీతి, నిజాయితీ ఉంటే..చంద్రబాబు స్కాంలపై CBI విచారణ కోసం లేఖ రాయాలని డిమాండ్ చేశారు మంత్రి రోజా. NTR పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తూ.. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పురంధేశ్వరి చదువుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షురాలిగా కనీసం పది ఊర్లు కూడా పురందేశ్వరి తిరగలేదు. కానీ టీడీపీని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచిస్తోందని ఆరోపించారు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.
పురందేశ్వరికి పదవులు, డబ్బు పైనే ఆశ తప్ప పార్టీ గురించి ఏమాత్రం ఆలోచన లేదని ఆరోపిస్తోంది వైసీపీ. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాలను కాదని టీడీపీకి భుజం కాస్తోందనీ.. బీజేపీని టీడీపీలో విలీనం చేసే స్థాయికి తీసుకొచ్చిందనేది వైసీపీ ఆరోపణ. పార్టీకి ద్రోహం చేస్తున్న పురందేశ్వరిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

VK Pandian: ఒడిశా పాలిటిక్స్‌లో సూపర్ సీఎం.. ఐఏఎస్ అధికారికి బంపర్ ఆఫర్.. అసలు ఏం జరిగిందంటే..?

రాజకీయాల్లో అవకాశాలు అంత ఈజీగా రావు.. అలాగే ఒక్కోసారి అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. ప్రస్తుతం ఒడిశా రాజకీయాలలో అలాంటి పరిణామమే జరిగింది. నిన్నటిదాకా రాజ్యాంగేతర శక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆ ఐఏఎస్ అధికారి ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా మారారు.. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ సీఎంగా పిలిచే స్థాయికి చేరుకున్నారు.. తమిళనాడులో ఇపుడు ఆ ఐఎఎస్ పెరు హ్యాష్ ట్యాగ్ గా మారింది. తమిళనాడుకు చెందిన వి.కార్తికేయ పాండ్యన్ 200 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఒడిశా క్యాడర్‌కు ఎంపికైన కార్తికేయ పాండ్యన్ అనేక కీలక బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఒడిశా ప్రభుత్వం ఆయన్ను కీలక స్థానంలో కూర్చోబెట్టింది.

ట్రాన్స్ఫర్మేషనల్ ఇన్సియేటివ్స్(Transformational Initiatives) పదవి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే క్యాబినెట్ హోదా కూడా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2000 నుంచి ఐ.ఏ.ఎస్ అధికారిగా అనేక బాధ్యతలు చేపట్టిన పాండ్యన్ ఇటీవల ఒడిశా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. 2011 నుంచి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కార్తికేయ పాండ్యన్.. అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందు బిజేడి అభ్యర్థుల ఎంపికలో పాండ్యన్ కీలకంగా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రతి కీలక నిర్ణయం వెనుక కార్తీకేయ పాండ్యన్ ఆలోచన ఉండేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ప్రతిపక్షాలైతే నిత్యం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కంటే కార్తికేయ పాండ్యన్ నే ఎక్కువగా టార్గెట్ చేసేవి. ఐఏఎస్ అధికారి రాజ్యాంగేతర శక్తిగా మారారని అన్నింట్లో తల దూర్చేవారని ఆరోపణలు చేసేవి కూడా.. ఇక అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా కార్తికేయ పాండ్యన్ తీరు నచ్చేది కాదు. సీఎంను కలవాలన్నా ముందుగా కార్తికేయ పాండ్యన్ ని కలవాల్సిందే.. ఇక పాండ్యన్ ని కలవడం కూడా అంతగా కుదిరేది కాదని అసంతృప్తిగా ఉండే పరిస్థితి. ఇక త్వరలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కార్తికేయ పాండ్యన్ ఇలాంటి విమర్శల నుంచి విముక్తి కోసం తాను దూరమవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

Assembly Elections: గత ఎన్నికల్లో భారీ ఓట్లు సాధించి టాప్ 10లో నిలిచిన అభ్యర్థులు వీరే! సీఎం ఏ నంబర్‌లో ఉన్నారంటే?

నేషనల్ లెవల్ పొలిటికల్‌ మేజిక్కులకు కేరాఫ్‌ అడ్రస్‌గా వుండే మధ్యప్రదేశ్‌లో ఈసారి ఏం జరగబోతుంది. మార్చి సంక్షోభం కాంగ్రెస్‌ను గద్దెదించింది. కమల్‌నాథ్‌ పోయి కమలనాథులు పవర్‌లోకి వచ్చారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఫోర్త్‌ టర్మ్‌ సీఎం అయ్యారు. మరి ఈసారి బీజేపీ విక్టరీ కంటిన్యూ అవుతుందా? కసితో కాంగ్రెస్‌ పవర్‌ను చేజిక్కుంటుందా? ఎవరి వ్యహాలు వాళ్లవే. మధ్యప్రదేశ్‌ తీర్పు ఎటువంటి అన్నదీ ఆసక్తికరంగా మారింది.

అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్లు, మెజారిటీని పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ అభ్యర్థులలో 10 మంది భారీ ఓట్లను మెజారిటీతో గెలుపొందారు. ఈ టాప్ 10 ఎమ్మెల్యే అభ్యర్థులకు 11 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఇండోర్ 2 అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ మెండలా మొదటి స్థానంలో ఉండగా, టాప్ 10 అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మూడో స్థానంలో నిలిచారు. ఈ టాప్ 10 ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీ, నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని టాప్ 10 అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించారు. ఈ అభ్యర్థులపై భారీ ఓట్ల వర్షం కురిసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నుండి జితూ పట్వారీ టాప్ 10 అభ్యర్థులలో ఉన్నారు.

ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన టాప్ 10 ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఇండోర్ 2 నుంచి రమేష్ మెండోలా పేరు మొదటి స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేష్ మెండోలాకు 1 లక్షా 38 వేల 794 ఓట్లు అంటే 63.95 శాతం ఓట్లు వచ్చాయి. అదేవిధంగా, భోపాల్‌లోని గోవింద్‌పురా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణ గౌర్‌కి 1 లక్షా 25 వేల 487 అంటే 58 శాతం ఓట్లు దక్కాయి. బుద్నీ నుంచి బీజేపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు 1 లక్షా 23 వేల 492 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నిజయోజకవర్గంలోని ఓట్లలో 60.25 శాతం చౌహాన్‌కు దక్కాయి. ఇండోర్ 5 స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మహేంద్ర హార్దియా 1 లక్షా 17 వేల 836 ఓట్లు రాగా 48.30 శాతం ఓట్లు అతని ఖాతాలో చేరాయి. ఇండోర్ 1 నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శుక్లాకు 1 లక్షా 14 వేల 555 (50.24 శాతం) ఓట్లు వచ్చాయి.

భోపాల్‌లోని నరేలా స్థానం నుంచి బీజేపీకి చెందిన విశ్వాస్ సారంగ్ కోక్‌కు 1 లక్షా 8 వేల 654 (53.24 శాతం), కుక్షి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర బఘెల్‌కు 1 లక్షా 8 వేల 391 (65.63 శాతం), రౌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జితు పట్వారీకి 1 లక్షా 7వేల 740 ఓట్లు వచ్చాయి. మొత్తం నియోజకవర్గ ఓట్లలో 49.95 శాతం దక్కించుకున్నారు. హుజూర్‌ నుంచి రామేశ్వర్ శర్మకు 1 లక్షా 7 వేల 288 (51.35 శాతం) ఓట్లు, భైందేహి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ధర్ము సింగ్ సిర్సామ్‌కు 1 లక్షా 4 వేల 592 (52.10 శాతం) ఓట్లు వచ్చాయి.

BS Yeddyurappa: మాజీ ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్.. జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్పకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటీవల బెదిరింపు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కర్నాటకలో పనిచేస్తున్న ఛాందసవాద గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా, IB ఇటీవల యడ్యూరప్ప భద్రతపై కేంద్రానికి నివేదిక సమర్పించింది. IB నివేదికలో అతని భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. ఆ తర్వాత వారి భద్రతను పెంచడానికి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం

సీఆర్‌పీఎఫ్ కమాండోలకు భద్రత బాధ్యతలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కమాండోలకు చెందిన సాయుధ సిబ్బంది యడియూరప్ప భద్రతను చూసుకుంటారు. యడియూరప్ప భద్రత కోసం మొత్తం 33 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని మోహరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదనంగా, అతని నివాసం వద్ద 10 మంది సాయుధ స్టాటిక్ గార్డులు, ఆరుగురు వ్యక్తిగత భద్రతా అధికారులతో రౌండ్-ది-క్లాక్ భద్రతను నియమించారు.

డ్రైవర్ల బృందాన్ని కూడా భద్రతా వలయం శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన డ్రైవర్లను కూడా వారి కాన్వాయ్‌లో చేర్చారు. ప్రమాదంలో ఉన్న సమయంలో యడూరప్ప సురక్షితంగా తరలించగలరు. 12 మంది సాయుధ ఎస్కార్ట్ కమాండోలను మూడు షిఫ్టుల్లో మోహరించింది. ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా నిరంతరం నిఘా ఉంచుతారు. నిరంతరం నిఘా ఉంచేందుకు, షిఫ్టుల వారీగా ఇద్దరు పరిశీలకులను నియమిస్తారు. వీరిలో యడియూరప్ప ఎల్లప్పుడూ రెండు అంచెల భద్రతను కలిగి ఉంటారు.

యడ్యూరప్పకు బెదిరింపులు యడ్యూరప్ప భద్రత కోసం మోహరించిన కమాండోలు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలవారు. ఆయుధాలు లేకపోయినా పోరాడడంలో నిష్ణాతులని హోం శాఖ వర్గాలు చెప్పినట్లు సమాచారం. వారికి మెషిన్ గన్‌లు, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను రౌండ్ ది క్లాక్ అమర్చారు. యడ్యూరప్ప కుటుంబానికి చెందిన చాలా మంది రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. గత కొంతకాలంగా తీవ్రవాద గ్రూపుల నుండి యడేూరప్పకు బెదిరింపులు వస్తున్నాయి. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఈ ముఖ్యమైన చర్య తీసుకుంది.

Telangana Elections: బోధన్‌లో నాన్ కేడర్ పాలిటిక్స్.. వారి ఓట్లపైనే అన్ని పార్టీల పోక‌స్

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మూడు అంశాలపై క్లారిటీ ఇచారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఈపరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పవన్. టీడీపీతో పొత్తు విషయం బీజేపీతో మాట్లాడి.. డిల్లీలో ప్రకటించాలి అనుకున్నా.. వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చాక పొత్తులపై కోఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పవన్‌. ఇప్పటికి జనసేన ఎన్డీఏలోనే ఉందని స్పష్టం చేశారు పవన్. కూటమిలో బీజేపీ కచ్చితంగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జగన్‌ ఎన్డీఏలో లేరని.. కేవలం ఆయనను ఒక రాష్ట్ర సీఎంగానే కేంద్రం గౌరవిస్తుందని చెప్పారు పవన్. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే నిధులు విడుదల చేసిందని బీజేపీ తనతో చెప్పిందన్నారు పవన్. వారాహి విజయయాత్రలో భాగంగా పెడనలో వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని.

బోధన్ నియోజకవర్గం కొత్తగా నమోదైన మైనారిటీ ఓట‌ర్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, బిలోలి ప్రాంతాలకు చెందిన మైనారిటీ వర్గాల వారిని బోధన్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలు అక్రమంగా ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. దొంగ ఓట్లను తొలగించాలంటూ ఆందోళ‌న బాట ప‌ట్టింది బీజేపీ. ఏకంగా నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మెడ‌పాటి ప్రకాశ్ రెడ్డి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో దాదాపు 8 వేలా ఓట్లను తొల‌గించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు వేసిన స్కెచ్‌తో బీజేపీ మెజారిటీగా హిందూ ఓటు బ్యాంక్ పోల‌రైజెష‌న్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 8 వేల ఓట్లు పోవ‌డంతో డైలామాలో ప‌డింద‌ట బీఆర్ఎస్. ఇక హిందూ ఓటు బ్యాంక్‌ను చేసుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్ బీఆర్ఎస్. ఈనేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీతో ఇప్పటి వ‌ర‌కు ఉన్న వాళ్లను టార్గెట్ చేసి తమ పార్టీల్లోకి ఆక‌ర్షిస్తున్నార‌ట. బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్‌గా పైట్ మార‌డంతో ఏవ‌రి బ‌లం వాళ్లు చూపించుకోవాడానికి ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ ఫైర్
బీజేపీ నియోజక‌వ‌ర్గ ఇంచార్జ్‌గా ప్రకాశ్ రెడ్డి టికెట్ వ‌స్తే ఇబ్బంది అవుతుంద‌నే ఆలోచ‌న‌తో మ‌రో వ్యక్తికి టికెట్ వ‌స్తుంద‌నే మైండ్ గేమ్ అడుతున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, బీజేపీ మ‌ద్యే ఉండ‌టంతో.. కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ చేస్తుంద‌ని ఆరోపిస్తున్నార‌ు బీజేపీ నేతలు.ఇక ఇన్ని రోజులు క్యాడ‌ర్‌ను న‌మ్ముకున్న పార్టీలు ఇప్పుడు వ‌ర్గాల‌ను న‌మ్ముకోవ‌డం ఎల‌క్షన్ హీట్ క‌నిపించేలా చేస్తుంద‌ట. ఇప్పటికే ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అయిపోవ‌డంతో బీజేపీ అభ్యర్థి ఫైన‌ల్ అయితే పోటి ఇంకా ర‌స‌వ‌త్తరంగా ఉండ‌నుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ‌ర్గాలు, కులాలు అంటూ బోధన్ పాలిటిక్స్ ఇంకా ఎన్ని మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాలి..!