జనావాసాల సమీపంలోకి వచ్చిన ఒక భారీ కొండచిలువ.. అక్కడ ఎదురుపడిన ఒక మేకను మింగేసింది. కానీ అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల అది కదలలేకపోయింది. ఈ సంఘటన అక్టోబర్ 19న జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం.. ఆ భారీ సర్పాన్ని పట్టి బంధించారు. 140 కిలోల బరువు, భారీ పొడవైన కొండచిలువ మేకను సజీవంగా మింగేసింది. పాము పొడవు చూసి ప్రజలు భయంతో వణికిపోయారు.
సజీవంగా ఉన్న మేకను మింగుతుండగా చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేక తన ఇంటి సమీపంలోని ఎన్క్లోజర్లో ఉండగా, కొండచిలువ దాడి చేసిందని చెప్పారు. అయితే అది కనిపించిన వెంటనే కొండచిలువ దానిపై దాడి చేసిందన్నారు.. కొండచిలువ పూర్తిగా కదలలేక పోవడంతో దానిని పట్టుకునేందుకు ఆ శాఖ పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. 25 నిమిషాల్లోనే కొండచిలువను అదుపు చేశారు. కొండచిలువను అడవిలోకి విడుదల చేయడానికి ముందు పెనిన్సులర్ మలేషియా డిపార్ట్మెంట్ వన్యప్రాణి, నేషనల్ పార్క్లకు అప్పగించారు.
అయితే, ఇది పైథాన్లో అత్యంత ప్రమాదకరమైన జాతిగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి మనుషులను కూడా మింగేస్తాయని చెప్పారు. పాములలో ఇది అతి పొడవైన జాతి అని చెప్పారు. ఇలాంటి పైథాన్లు దక్షిణ, ఆగ్నేయాసియాలో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు.