Andhra Pradesh: రాజధాని తరలింపా?.. అలా అని ఎవరు చెప్పారు?.. సీఎస్ జవహర్ రెడ్డి ఏమన్నారంటే..

Andhra Pradesh: రాజధాని తరలింపా?.. అలా అని ఎవరు చెప్పారు?.. సీఎస్ జవహర్ రెడ్డి ఏమన్నారంటే..

విశాఖపట్నం, అక్టోబర్ 25: రాజధాని తరలింపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతోంది రాజధాని షిఫ్టింగ్ ఎంతమాత్రమూ కాదన్నారు. అసలు రాజధాని షిఫ్టింగ్ అని ఎవరు చెప్పారు? ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి ఒక కమిటీ ని వేశాం, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయన్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.

కోస్టల్ సెక్యూరిటీ పై ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లో అపెక్స్ కమిటీ సమావేశం, అనంతరం పీఎం మోడీ నిర్వహించిన రాష్ట్రాల ప్రోగ్రెస్ కు సంబందించిన వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖ కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కే ఎస్ జవహర్ రెడ్డి ఆయా కార్యక్రమాల గురించి మీడియా కు వివరిస్తున్న క్రమంలో మీడియా తో మాట్లాడుతూ రాజధానికి సంబంధించి పై వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ది కి సంబందించిన ఏర్పాట్లు మాత్రమే..
జీవో నెంబర్ 2015 పేరుతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఏంటంటే రాష్ట్రంలోనే పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక ప్రాంతాలున్నాయి, ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం తో పాటు విశాఖ ఏజెన్సీలో మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందనీ గతంలో నీతి అయోగ్ వెనకబడిన జిల్లాలను ప్రతిపాదించిన సమయంలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కొన్నాళ్లపాటు నిధులు కూడా విడుదలయ్యాయి. ఆ మేరకు అభివృద్ధి జరగకపోవడంతో ఉత్తరాంధ్ర అభివృద్ది మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.ఈ సమయాల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు లేదంటే ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని, అలాగే ఆ సమయంలో అధికారిక పర్యటన కోసం వచ్చే కీలక ఉన్నత అధికారులకు సంబంధించిన కార్యాలయాలు, వాళ్లు నివాసం ఉండాలంటే అవసరమైతే వాటికి సంబంధించిన భవనాలు, ఇతర శాఖలకు సంబంధించిన ఎవరైనా ఈ ముఖ్యమైన అధికారులు ఈ ప్రాంతానికి వస్తే వాళ్లు ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన చర్యలపై త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆ జీ వో లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

ఆ కమిటీలో ముగ్గురు సీనియర్ అధికారులని సభ్యులుగా నియమించారు. పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, అలాగే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ని సభ్యులుగా నియమిస్తూ కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ ఓ విడత విశాఖ లో పర్యటించి, జిల్లా అధికారులతో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమయంలో ప్రధానంగా సీఎం ఇక్కడకు వస్తే ఉండడానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం తో పాటు దాదాపు 10 నుంచి 15 లక్షల చదరపు అడుగుల అధికారిక వ్యవహారాల స్పేస్, 1500 వరకు వివిధ రకాల నివాస గృహాలకు సంబందించిన సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాంగం అందించింది.

ప్రస్తుతానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమే..
రాజధాని కి సంబందించిన న్యాయ వివాదాలు ప్రస్తుతం సుప్రీం కోర్టు లో పెండింగ్ లో ఉన్నాయి. ఈ వ్యాజ్యం పై డిసెంబర్ లో విచారణ, వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజధాని కి సంబందించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ ను మాత్రం షిఫ్ట్ చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి రాష్ట్రం లో ఎక్కడైనా నివాసం ఉండొచ్చు.
ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే ఆయన కార్యాలయం అక్కడ నుంచి పాలించవచ్చు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పాలన చేయొచ్చు..ఈ వెసులుబాటు తోనే ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో విశాఖ కు సీ ఎం వో ను షిఫ్ట్ చేసి విశాఖ తో పాటు అమరావతి లో కూడా ఉంటూ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ పాలన సాగించవచ్చు. అదే సమయంలో ఎన్నికల నాటికి రాజధాని విషయం లో కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి విశాఖ కు సీ ఎం వో ను షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో ఏర్పాటైన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17 నుంచి విశాఖ కు క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ చేసి, ఇక్కడనుంచి ముఖ్యమంత్రి పాలన సాగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు రాజధాని మార్పుకు సంబంధించినవి ఎంత మాత్రం కాదంటూ సీ ఎస్ ఇచ్చిన వివరణ పై మరొకసారి రాష్ట్ర వ్యాప్త చర్చ కు తెరలేపినట్టైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *