నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోస్ చూస్తుంటే.. వెంకీ కూతురి నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బబు హాజరయ్యి నూతన జంటను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. వెంకటేశ్ రెండో కూతురిని విజయవాడకు చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో హయవాహిని వివాహం జరిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుంచి వెంకీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇక తన సినిమాలు తప్ప.. ఫ్యామిలీ విషయాలు బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇక ఇప్పుడు తన కూతురి ఎంగజ్మెంట్ విషయం గురించి మీడియాకు తెలియకుండానే చూసుకున్నారు. అటు వెంకీ తనయులు కూడా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు.
ఇక వెంకీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సైంధవ్ సినిమా చేస్తున్నాడు. తన కెరీర్ లో 75వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలకపాత్రలలో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.