వారంలో రెండోసారి ఈ ఆందోళన..
హమాస్ దాడికి జో బిడెన్ ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)ని ఒక వారంలోపే ప్రస్తావించడం ఇది రెండోసారి. చాలా మంది ఈ ఆర్థిక కారిడార్ను చైనా BRI ప్రాజెక్ట్కు ప్రత్యామ్నాయంగా కూడా చూస్తున్నారు. ఇది అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా దేశాలను సంయుక్తంగా కలుపుతుంది. సెప్టెంబరులో న్యూఢిల్లీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా భారత్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ కారిడార్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగం భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతంతో అనుసంధానించే తూర్పు కారిడార్, మరొక భాగం గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్తో అనుసంధానించే ఉత్తర కారిడార్.