నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు చెందిన నేత. స్టూడెంట్ గా ఉన్నప్పట్నుంచే బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మొదటి నుంచి కూడా రోడ్స్, ట్రాన్స్ పోర్ట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. అటల్ బిహారి వాజపేయి ఉన్నప్పుడు దేశంలోని రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రోడ్లు వేయాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే కార్యక్రమాన్ని ఈయనే ప్రపోజ్ చేశారు. మహారాష్ట్ర గవర్నమెంట్ లో కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసి మహారాష్ట్ర రవాణా రోడ్డు శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు.
కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా దేశ రోడ్ల మీద ఫోకస్ చేశారు. గత 9 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రిగా పనిచేస్తూ దేశంలో ఎన్నో కొత్త రోడ్లని, హైవేలను, ఎక్స్ ప్రెస్ హైవేలను తీసుకొచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో రవాణాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు గడ్కరీ. ఇంకా దేశం మొత్తం మీద అనేక హైవేల నిర్మాణం జరుగుతుంది. దేశమంతటా ప్రయాణం అందరికి సులభతరం చేయాలనే ఉద్దేశంతో ముందు నుంచి కూడా ఒకే శాఖపై పట్టు సాధించి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలువురు గడ్కరీపై బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.