Unstoppable with NBK: అన్‏స్టాపబుల్ షోకు రానున్న బాలీవుడ్ హీరో.. రష్మికతో కలిసి సందడి..

ఇప్పటివరకు సినిమాల్లో యాక్షన్ హీరోగా అలరించిన నందమూరి బాలకృష్ణ.. అటు యాంకరింగ్‏తోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలయ్య. ఇప్పటివరకు రెండు సీజన్స్ విజయవంతగా కంప్లీట్ చేసుకున్న ఈషో.. ఇప్పుడు సీజన్ 3 రన్ అవుతుంది. ఇందులో సెలబ్రెటీల సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిగత విషయాల గురించి సైతం ఆసక్తికర ప్రశ్నలు వేసి అభిమానులకు కావాల్సిన విషయాలను తెలుసుకుంటారు బాలయ్య. అంతేకాకుండా తన కామెడీ టైమింగ్‏తో అలరిస్తుంటారు. ఇక ఇటీవల స్టార్ట్ అయిన సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ కోసం భగవంత్ కేసరి టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో శ్రీలీల, కాజల్ హీరోయిన్లుగా నటించగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీలీల, కాజల్, అనిల్ రావిపూడి అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.

ఇక ఇప్పుడు నెట్టింట వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈషోలో యానిమల్ చిత్రయూనిట్ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి వంగా రాబోతున్నారని తెలుస్తోంది. వీరి కాంబోలో తెరకెక్కిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్, టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

అయితే ఇప్పుడు వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ షోలో రణబీర్ కపూర్ పాల్గొంటే.. బాలయ్య హోస్టింగ్‏కు ఫిదా అయ్యే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా బాలయ్యకు రష్మిక ఫేవరేట్ హీరోయిన్ కూడా. దీంతో యానిమల్ టీం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ రాబోతుందనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు.

Ranveer Singh – Deepika Padukone: దీపికా, రణవీర్‏ పెళ్లి వీడియో చూసి కరణ్ ఎమోషనల్.. పెళ్లైన 5 ఏళ్లకు బయటకు వచ్చింది..

పెళ్లి చేసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, హీరో రణవీర్ సింగ్ వెడ్డింగ్ వీడియో బయటకు వచ్చింది. ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్ 8’ మొదటి ఎపిసోడ్‌లో తమ వివాహ వీడియోను పంచుకున్నారు ఈ లవబుల్ కపూల్. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘కాఫీ విత్ కరణ్’ షోకు వీరిద్దరి అతిథులుగా హజరయ్యారు. గతంలో వీరు విడి విడిగా ఈ షోకు వెళ్లారు. కానీ మొదటిసారి ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. తమ ప్రేమ, పెళ్లి, దీపికా ఇంటి సభ్యులను రణ్వీర్ ఎలా ఒప్పించాడు అనే విషయాలను ఆ వీడియోలో వెల్లడించారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘దీప్‌వీర్’ పెళ్లి వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది.దీపికా పదుకొణె నటించిన ‘యే జవానీ హై దీవానీ’లో వెడ్డింగ్ సీక్వెన్స్‌ని షూట్ చేసిన అదే టీమ్ ది వెడ్డింగ్ ఫిల్మర్స్ వెడ్డింగ్ వీడియోను క్యాప్చర్ చేసింది.

రణవీర్ తన పెళ్లిలో టోస్ట్ ఇవ్వడంతో వీడియో ప్రారంభమైంది. దీపికా పదుకొణెని పెళ్లి చేసుకుంటానని తాను ఒకసారి చెప్పానని, చివరకు ఆ రోజు వచ్చిందని వెల్లడించాడు. ‘దీప్‌వీర్’ కలిసిన అందమైన క్షణాల నుంచి.. రణవీర్, దీపికను పెళ్లి చేసుకోవడం గురించి ఆమె ఇంట్లో వారిని ఎలా ఒప్పించాడు.. చివరకు వీరి వివాహం ఎలా జరిగిందనే క్షణాలను ఆ వీడియోలో బంధించారు. దీపికా తండ్రి మాజీ బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాష్ పదుకొణె తమ నలుగురితో కూడిన ‘బోరింగ్’ కుటుంబానికి రణవీర్ కొంత ఉత్సాహాన్ని తెస్తున్నాడని వీడియోలో తెలిపారు.

సరస్సు దగ్గర జరిగిన మెహందీ వేడుకలో రణ్‌వీర్ డ్యాన్స్, దీపిక పెళ్లికి సిద్ధమవుతూ.. మండపం వద్ద ఈ జంట ప్రతిజ్ఞలు చేసుకోవడం, వారి ఆనంద్ కరాజ్ వేడుక.. ఇలా అన్నీ వీడియోలో బంధించబడ్డాయి. అంతే కాదు, రణవీర్ పెళ్లికి ముందు తన భార్యను చూడటానికి దీపికా గది బయట వేచి ఉండడం.. ఆ తర్వాత “లవ్ యు బేబీ” అని చెప్పడం కనిపిస్తోంది.

అయితే దీప్ వీర్ పెళ్లి వీడియో చూసిన కరణ్ భావోద్వేగానికి గురయ్యాడు. “ పెళ్లి వీడియో చూడడం.. ఒకరిపై మరొకరు ప్రేమను పంచుకోవడం చూడడం చాలా సంతోషంగా ఉంది. కానీ నేను బంధంలో లేను..ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉండటం వల్ల నేను ఏమి కోల్పోతున్నానో నాకు తెలుస్తోంది. జీవితంలోని విషయాలను పంచుకోవడానికి నాకు సొంత భాగస్వామి లేరు. ప్రతిరోజూ కోల్పోతున్నాను. నాలో కొంత భాగం శూన్యంగా కనిపిస్తోంది. నాకు నా పిల్లలు, అమ్మ ఉన్నారు. సంబంధాలు ఎంత కఠినంగా ఉంటాయని నాకు తెలుసు, కానీ ఒక వ్యక్తితో ఉన్న ఆత్మ సంబంధాన్ని మీరు వారి చేయి పట్టుకుని మేల్కొలపవచ్చు. కష్ట సమయాల్లో మీరు తోడును చూడవచ్చు.” అంటూ భావోద్వాగానికి గురయ్యాడు కరణ్. దీంతో అతడిని ఓదారుస్తూ.. సరైన సమయంలో మీకు సరైన వ్యక్తి దొరుకుతారంటూ దీపికా హామీ ఇచ్చింది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్ అవుతాయి.

బాలీవుడ్ జడ్జిలను ఫిదా చేసిన హైదరాబాద్ కుర్రాడు.. అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ర్యాప్ సాంగ్ తెగ వైరలవుతుంది. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు ఓ కుర్రాడు ర్యాప్ సాంగ్ అదరగొట్టేస్తోన్న వీడియో హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ టీవీ ఛానల్‏లో నిర్వహించిన మ్యూజిక్ షోలో హైదరాబాద్ గురించి చెప్తూనే సౌత్ యాక్టర్స్ అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ ఆలపించాడు. ఆ కుర్రాడి పాటకు బీటౌన్ జడ్జీలు ఫిదా కాగా.. అక్కడున్న అడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఆ యువకుడు హైదరాబాద్‏కు చెందిన రేపర్ కేదెన్ శర్మ. ఎంటీవీ హాస్టిల్ సీజన్ 3లో తన ఫర్ఫార్మెన్స్‏తో దుమ్మరేపాడు. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ రేపర్.. ‘హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీ కీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ’ అంటూ స్టేజ్ ని కిక్కెక్కించాడు. హైదరాబాద్ కల్చర్, నగరం గొప్పతనాన్ని.. ఇక్కడి వీధుల్లో చిరు వ్యాపారుల రోజు వారీ జీవితాన్ని తెలియజేస్తూ పాటను స్టార్ట్ చేశాడు.

‘పాట మధ్యలోనే మజా రావడం లేదా.. ఇప్పుడు వస్తుంది చూడండి.. అంటూ అల్లు అర్జున్ డాన్స్ అంటే అందరికీ ఇష్టం.. స్టైల్ స్టార్ అందరూ అతని.. తగ్గేదే లే మేము పుష్ప ఫ్యాన్స్’ అంటూ లిరిక్స్ తో ఓ ఊపు ఉపేసాడు. ఆ తర్వాత వెంటనే సాయి పల్లవి గురించి ప్రస్తావిస్తూ.. ‘అందాలు ఆరబోసే హీరోయిన్స్ ఉంటారు.. కానీ సాయిపల్లవి సింప్లిసిటీ, పాపులారిటీ ఎవరికీ రాదు.. తెలుగులో ఉన్నది 70 మిలియన్ జనాలు..కానీ ఆమె రౌడీ బేబీ పాటకు బిలియన్ వ్యూస్ వచ్చే క్రేజ్ ఆమెది’అంటూ ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు. ఇక అదే పాటలో హైదరాబాద్ లోని పాపులర్ ప్లేసెస్, సౌత్ మూవీస్ గొప్పతనం గురించి ప్రస్తావించడంతో జడ్జీలు ఫిదా అయ్యారు.

కేదెన్ శర్మ ర్యాప్ సాంగ్ వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇక అతనికి సంబంధించిన వీడియోను సీపీ ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలోక షేర్ చేస్తూ.. ఎంటీవీలో ప్రసారమైన ఈ షోను చూసి ఎంజాయ్ చేయండంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం కేదెన్ శర్మ ర్యాప్ సాంగ్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.

Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్.. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా.. ఎలక్షన్స్ ముందే రిలీజ్..

Nitin Gadkari Biopic : ఇటీవల బయోపిక్స్ ఎక్కువగా వస్తున్నా సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా, పలు రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలను వెండితెరపై చూపించడానికి వారి జీవిత కథలతో బయోపిక్ సినిమాలని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమలలోను బయోపిక్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ బయోపిక్ హంగామా మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అనేక బయోపిక్స్ రాగా బాలీవుడ్ నుంచి ఇప్పుడు మరో ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్ రాబోతుంది.
ప్రముఖ బీజేపీ(BJP) సీనియర్ నేత, ప్రస్తుత కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్ రానుంది. ‘గడ్కరీ’ అనే టైటిల్ తో ‘హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే ట్యాగ్ లైన్ ప్రమోషన్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ అనంత్ దేశముఖ్ నిర్మాణంలో అనురాగ్ రాజన్ బుసారి దర్శకత్వంలో ‘గడ్కరీ’ సినిమా నితిన్ గడ్కరీ బయోపిక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇది కేవలం మరాఠీ సినిమాగా తెరకెక్కుతుంది. మరి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. అయితే ఈ సినిమాలో నితిన్ గడ్కరీ రోల్ ని ఎవరు చేస్తున్నారో ఇంకా ప్రకటించకపోవడం విశేషం.

నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు చెందిన నేత. స్టూడెంట్ గా ఉన్నప్పట్నుంచే బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మొదటి నుంచి కూడా రోడ్స్, ట్రాన్స్ పోర్ట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. అటల్ బిహారి వాజపేయి ఉన్నప్పుడు దేశంలోని రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రోడ్లు వేయాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే కార్యక్రమాన్ని ఈయనే ప్రపోజ్ చేశారు. మహారాష్ట్ర గవర్నమెంట్ లో కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసి మహారాష్ట్ర రవాణా రోడ్డు శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు.

కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా దేశ రోడ్ల మీద ఫోకస్ చేశారు. గత 9 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రిగా పనిచేస్తూ దేశంలో ఎన్నో కొత్త రోడ్లని, హైవేలను, ఎక్స్ ప్రెస్ హైవేలను తీసుకొచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో రవాణాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు గడ్కరీ. ఇంకా దేశం మొత్తం మీద అనేక హైవేల నిర్మాణం జరుగుతుంది. దేశమంతటా ప్రయాణం అందరికి సులభతరం చేయాలనే ఉద్దేశంతో ముందు నుంచి కూడా ఒకే శాఖపై పట్టు సాధించి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలువురు గడ్కరీపై బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.

Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమాకు కొత్త కష్టం.. ఓటీటీ రిలీజ్చేయాలంటే ఇలా చేయాల్సిందే

అక్షయ్ కుమార్ సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే హీరోగా అక్షయ్ కు పేరుంది. ఏడాదికి ఆయన 7 సినిమాలు వరకు రిలీజ్ చేస్తుంటాడు. కానీ ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఓఎంజీ 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాథియేటర్స్ లో రిలీజ్ అయ్యే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ‘OMG 2’ సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డైలాగ్స్ కు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ చిత్రయూనిట్ దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో అక్షయ్ కుమార్ సహా చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేకుండా థియేటర్లలో సినిమా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా OTT విడుదలకు సమస్య ఏర్పడింది.
OMG 2’ చిత్రం అక్టోబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అక్షయ్ కుమార్ స్వయంగా తన సినిమాను నెట్‌ఫ్లిక్స్ OTTలో చూడమని ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడింది. ‘OMG 2’ సినిమా OTT వెర్షన్‌పై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి దీంతో సినిమా 27 కట్స్ తో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.
తన సినిమా OTT విడుదల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, “నాకు ఫైట్ చేయడం ఇష్టం లేదు. నాకు రూల్స్ గురించి తెలియదు, రూల్ బుక్ ఎప్పుడూ చదవను. ఇది అడల్ట్ సినిమా అని అనుకుంటే మనం ఏమీ చేయలేం. చాలా మందికి సినిమా చూపించాం, సినిమా అందరికీ నచ్చుతుంది. యువత కోసం ఈ సినిమా చేశాం అని అన్నారు. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి శివ భక్తుడి పాత్రలో కనిపించాడు. యామీ గుప్తా, పంకజ్ మల్హోత్రా కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.