Minister KTR: ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు ఆపేయమంటారేమో..? కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్..

Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ మాటల తూటాలను పేల్చుతూ.. ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు (KTR) కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదంటూ పేర్కొన్నారు. ‘రైతుబంధు’ నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా విమర్శలు గుప్పించారు.

ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? అందులో కూడా కేసీఆరే కనిపిస్తారు కదా? అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతులు భరించరు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.

కాంగ్రెస్ అంటేనే.. రైతు విరోధి .. అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్.. కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది.. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక 3 గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.. అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్లర్ లో రాశారు.

Raja Singh: నన్ను, యోగిని చంపేస్తారట.. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదు చేసిన బీజీపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

Telangana Assembly Election 2023: ఎన్నికల సమయంలో గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. తన భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తనతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ పేర్కొన్న రాజాసింగ్ బుధవారం తనకు మరో బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. తనను, తన కుంటుంబాన్ని, ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోతో పాటు నగర పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు లేఖను రాజాసింగ్ విడుదల చేశారు. కాల్ చేసిన వ్యక్తి సుమారు 6 నిమిషాల పాటు మాట్లాడాడని.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ ఫిర్యాదులో తెలిపారు.

సిటీ పోలీసులకు ఇచ్చిన వీడియో స్టేట్‌మెంట్‌లో.. బుధవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తనకు కాల్ వచ్చిందని రాజాసింగ్ చెప్పారు. “ఎన్నికలు లేదా కౌంటింగ్ రోజు ముందు నన్ను, నా కుటుంబానికి హాని కలిగిస్తామని కాలర్ బెదిరించాడు.. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోష్‌మహల్‌లో ప్రచారం చేసేందుకు నగరానికి వచ్చినప్పుడు తమకు హాని తలపెడతామని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు.. ఆ నంబర్ కాలర్ ఐడీ విదేశాలకు చెందినది..’’ అంటూ రాజాసింగ్ తెలిపారు.

“ఈ వ్యక్తికి నా ప్రతి కదలిక గురించి హైదరాబాద్‌లో నివసించే వ్యక్తి నిరంతరం వివరిస్తున్నాడు. నా కుటుంబ సభ్యుల గురించి.. నేను ప్రచారానికి వెళ్లినప్పుడు.. ఏ బుల్లెట్ నడుపుతానో, అలాగే పలు విషయాల గురించి అతనికి తెలుసు” అని రాజా సింగ్ వివరించారు. “నేను గతంలో బెదిరింపు కాల్‌లను ఎదుర్కొన్నప్పటికీ, పోలీసులు ఈ ప్రత్యేక ముప్పును పరిష్కరించడం అత్యవసరం, ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్న ప్రస్తావన కారణంగా.. చర్యలు తీసుకోండి” అంటూ డిజిపికి విజ్ఞప్తి చేశారు.

కాగా.. వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం ఏడాది తర్వాత భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అంతేకాకుండా.. మళ్లీ బీజేపీ గోషామహాల్ టికెట్ ను కేటాయించింది. ఈ మేరకు ఫస్ట్ లిస్ట్‌లోనే బీజేపీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒక్క షేక్‌హ్యాండ్‌.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.. పవన్, నాని కలయిక వెనుక ఇంత అర్ధముందా?

ఒక్క షేక్‌హ్యాండ్‌.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా గుడివాడలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బద్ద శత్రువుల్లాంటి ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఇలా హ్యాపీగా నవ్వుతూ కరచాలనం చేసుకోవడం చాలామందిని అర్ధం కాట్లేదు. అటూ.. ఇటూ.. వార్‌ అయితే కంటిన్యూ అవుతోంది. ఒక పెళ్ళి వేడుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.

వంగవీటి రాధా పెళ్లి.. సరికొత్త చర్చకు దారి తీసింది. ఆయన పెళ్లికి హాజరైన సమయంలో కనిపించిన సీన్స్‌ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మాజీ మంత్రి,. వైసీపీ నేత కొడాలినాని.. ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం.. పైగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు ఇలా మెలగడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిచింది కూడా. అయితే గుడివాడలో మాత్రం పొలిటికల్‌గా దుమారం రేగింది. మాజీ మంత్రి కొడాలిపై టీడీపీ, జనసేన నేతలు మండిపడ్డారు. కేవలం పవన్‌తో కరచాలనం కోసం.. నాని ఎంతకు దిగజారారో అంతా చూశారని ఆరోపించారు నేతలు. పవన్‌ చుట్టూ అభిమానులున్నా.. కొడాలి నాని మాత్రం వారిని తోసుకుంటూ వెళ్లి పవన్‌తో చెయ్యి కలిపారని మండిపడ్డారు.

అయితే వంగవీటి రాధా పెళ్లికి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు. తనకు సన్నిహితులైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పెళ్లికి పిలిచారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొడాలి నాని.. అప్పటికే పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆయన వంగవీటి రాధాను కంగ్రాట్స్‌ చెప్పేందుకు స్టేజ్‌ ఎక్కేలోపే పవన్‌ కల్యాణ్‌ రావడం జరిగింది. ఇద్దరూ ఎదురెదురుగా రావడంతో.. ముందు కొడాలి నాని నమస్కారం చేశారు.. అది చూసి పవన్‌ ప్రతి నమస్కారం చేసి.. కరచాలనం కోసం చేయి ఇచ్చారు. దీంతో నాని కూడా ముందుకు కదిలి చేయి కలిపారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అటు జనసేన వారు పవన్‌తో షేక్‌ హ్యాండ్‌ కోసం నాని ఎగబడ్డారంటే.. నానితో పరిచయం కోసం పవన్‌ చేయి ఇచ్చారంటూ ఎవరికి నచ్చిన పోస్టులు వారు పెడుతున్నారు.

అయితే పెళ్లికి వచ్చిన అతిథులు ఎదురుపడితే ఇలా నమస్కరించుకుని.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం కనీస సంస్కారం అంటూ మరికొందరు స్పందించారు. తెలుగు దేశం పార్టీ – జనసేన పార్టీలు మాత్రం కొడాలి నాని టార్గెట్‌ గానే ఆరోపణలు చేస్తున్నాయి. అసలు కొడాలి ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలంటూ జనసేన అంటోంది. రెండు బస్సులతో రెండు కోట్ల బెంజ్‌ కారు ఎలా కొన్నావంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

AP Politics: ఏపీలో హీటెక్కిన రాజకీయాలు.. పోటా పోటీ యాత్రలతో జనంలోకి వైసీపీ, టీడీపీ

ఆరు నెలల్లో ఎన్నికలు జరగునున్న ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నాలుగున్నరేళ్లలో చేసిన సంక్షేమం-అభివృద్ధి ఎజెండాగా మరోసారి ప్రజల్లోకి వెళ్తుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ప్రతిపక్ష తెలుగు దేశం, జనసేన పార్టీలు పోటా పోటీ యాత్రలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయన భార్య భువనేశ్వరి జనం మద్యలోకి వచ్చారు.

సామాజిక సాధికార యాత్ర ద్వారా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోనే ఉన్న వైసీపీ కేడర్, తాజాగా ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేపడుతోంది. అక్టోబర్ 26 నుంచి 60 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రలు కొనసాగనున్నాయి. ఒక్కో రోజు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని మూడు ప్రాంతాల్లో మూడు నియోజకవర్గాల్లో యాత్రలు జరగనున్నాయి. మద్యాహ్నం ఒంటి గంట నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

వైసీపీ సామాజిక సాధికార యాత్రకు సంబంధించి షెడ్యూల్ పార్టీ వర్గాలు విడుదల చేశాయి. అయా నియోజకవర్గాల్లో ముందుగా ఎంపిక చేసిన సచివాలయాన్ని వైసీపీ నేతలు సందర్శిస్తారు. ఇక్కడే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, స్థానికంగా ఎంపిక చేసిన 200 మందితో కలిసి సహాపంక్తి భోజనం చేస్తారు. తర్వాత మీడియా సమావేశం ఉంటుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సామాజిక సాధికారత,గత ప్రభుత్వం పేదల విషయంలో వ్యవహారించిన తీరును ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్ర వెళ్లే మార్గంలో ముందుగా నిర్ణయించిన చోట్ల ప్రజలతో మమేకం అవుతారు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తారు. సామాజిక సాధికార యాత్ర లో భాగంగా బస్సు పైనుంచే ప్రజల నుద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రసంగించనున్నారు. అక్టోబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సామాజిక సాధికార యాత్ర ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రులు,ఇతర నేతలు లాంఛనంగా ప్రారంభించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పైనే స్పెషల్ ఫోకస్
సామాజిక సాధికార యాత్ర… పేరుకు తగ్గట్లుగానే బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసింది వైసీపీ. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏవిధంగా ప్రాధాన్యత ఇచ్చిందో, ప్రజలకు వివరించడమే యాత్ర లక్ష్యంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. కేబినెట్‌తో పాటు ఇతర పదవుల్లోనూ భారీగా కేటాయింపులు చేయడం, ఆయా వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రను ఉపయోగించుకొనున్నారు వైసీపీ నేతలు. బస్సు యాత్రలో పేదలు పాల్గొనేలా చూడాలని సీఎం జగన్ ఇప్పటికే నేతలకు సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పేదలకు-పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందనే నినాదాన్ని బస్సు యాత్ర ద్వారా బలంగా తీసుకెళ్లాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో వైసీపీ నేతలు క్లాస్ వార్ స్లోగన్‌తో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేదంటే సమన్వయకర్తలు అధ్యక్షతన బస్సు యాత్ర జరగనుంది. ప్రతి బస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు తప్పకుండా ఉండేలా ప్లాన్ చేశారు. సభలు ఎలా జరగాలి. ఎలాంటి అంశాలతో ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే రీజినల్ కోఆర్డినేటర్లు సమావేశాలు పెట్టి వివరించారు. మొదటి విడతలో నవంబర్ 9 వ తేదీ వరకూ ఒక్కో రోజు మూడు ప్రాంతాల్లో యాత్రలు సాగనున్నాయి.
బస్సు యాత్ర మొదటి విడత షెడ్యూల్ రిలీజ్ చేసిన వైసీపీ
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వ తేదీ వరకూ మొదటి విడత సామాజిక సాధికార యాత్ర లు జరగనున్నాయి. దీనికి సంబందించిన పోస్టర్ ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు విడుదల చేశారు. మొదటి రోజు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమ లో సింగనమలలో యాత్రలు జరగనున్నాయి. మొదటి విడతలో 39 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కోనసాగనుంది.
జనంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
మరోవైపు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టై జైల్లో ఉండటంతో ఇప్పుడు ఆయన భార్య భువనేశ్వరి జనం మద్యలోకి వచ్చారు. చేయి చేయి కలిపి పోరాటం చేద్దామని ప్రజలకు భువనేశ్వరి పిలుపినిచ్చారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె నుంచి యాత్రను ఆమె ప్రారంభించారు. తండ్రి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, నిజం గెలవాలికి భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఆమె వెంట చిత్తూరు, తిరుపతి జిల్లాల టీడీపీ నేతలతో పాటు ఎమ్మెల్సీ అనురాధ, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు.
నిజం గెలవాలి యాత్రలో పరామర్శలు..
నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు వార్త విని ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రగిరిలో మరణించిన ప్రవీణ్‌రెడ్డి, నేండ్రగుంటలో కన్నుమూసిన చిన్నబాబు కుటుంబాన్ని భువనేశ్వరి ఓదార్చారు. వారి కుటుంబాలకు 3 లక్షల చెక్కు అందజేశారు. కష్టకాలంలో అండగా ఉన్న ప్రతీ ఒక్కరి బాధ్యత పార్టీ తీసుకుంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. పరామర్శ తర్వాత చంద్రగిరిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు, రాజకీయాలు చేసేందుకు తాను రాలేదని భువనేశ్వరి అన్నారు. తానెప్పుడు ఇలా బయటకు రాలేదని తెలిపారు. నిజం గెలవాలన్నది ఒక పోరాటమని తెలిపారు.

వచ్చే నెల 3న మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం.. ఏం చెప్పబోతున్నారంటే?

లుగు దేశం పార్టీ – జనసేన ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కమిటీ సభ్యులను నియమించిన ఇరు పార్టీలు.. వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించాయి. ఆ తర్వాత సమావేశమైన పవన్, లోకేష్ ప్రస్తుత రాజకీయాలు, ఉమ్మడి పోరాటానికి సంబంధించిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 1నుంచి ఉమ్మడిగా జనంలోకి వెళ్ళాలని నిర్ణయించారు.

టీడీపీ-జనసేన ఉమ్మడి ఎజెండాతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నవంబర్‌ 1 నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోతో ఒకటో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు. ఓట్ల తొలగింపుతో సహా ప్రతి ప్రజా సమస్యపై ఇక నుంచి రెండు పార్టీలు కలిసే పోరాడాలే కార్యచరణ రూపొందించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నవంబర్ 3న విజయవాడలో మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఫ్లాన్ చేశాయి రెండు పార్టీలు. ఈ సందర్భంగా ఉమ్మడిగా ఇంటింటి ప్రచారంపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు రెండు పార్టీల నేతలు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించింది టీడీపీ-జనసేన. వైసీపీ పోవాలి.. టీడీపీ-జనసేన రావాలి అనే నినాదంతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్తామని ఇదివరకే పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సంయుక్తంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నవంబర్‌ 1న ఉమ్మడి కార్యాచరణతో సిద్ధమవుతున్నారు. ఇకపై ఉమ్మడి వెళ్లే ఏ కార్యక్రమంలోనూ రెండు పార్టీలు సమన్వయం కలిసి వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే విజయవాడలో మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఇటు తెలుగు దేశం పార్టీతో కలిసి నడుస్తూనే భారతీయ జనతా పార్టీతో పొత్తుపైనా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎన్డీయేలోనే కొనసాగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నందునే పొత్తు పెట్టుకున్నామని, దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి మూడు పార్టీలు కలిసి వెళ్ళే అవకాశమున్నట్లు పవన్ మాటలను బట్టి అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలోనే మొదటి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ మీటింగ్‌లో మూడు తీర్మానాలు చేశాయి టీడీపీ, జనసేన. ఆంధ్రప్రదేశ్‌ను అరాచక పాలన నుంచి కాపాడడం, అన్ని వర్గాలకు అభివృద్ది అందించడం, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన తెలపడం. వీటిని ఉమ్మడి కార్యాచరణగా తీసుకెళ్లడానికి జిల్లాల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలోని ఉమ్మడి జిల్లాల్లో అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో జరిగే సమావేశాలకు రెండు పార్టీల కార్యకర్తలు పాల్గొని, నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆ తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. మ్యానిఫెస్టో ప్రకటించి, నవంబర్‌ 1 నుంచే ఇంటింటి ప్రచారం కూడా చేపడతామన్నారు. ఇక ప్రజా సమస్యలపై పోరులో భాగంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రాంతాల వారీగా నివేదిక తయారు చేయబోతున్నాయి రెండు పార్టీలు. మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై అధికార పార్టీ నుంచి గట్టి విమర్శలే వస్తున్నాయి. ఆ రెండు పార్టీల జాయింట్‌ యాక్షన్‌తో జగన్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు వైసీపీ నేతలు.

Andhra Pradesh: రాజధాని తరలింపా?.. అలా అని ఎవరు చెప్పారు?.. సీఎస్ జవహర్ రెడ్డి ఏమన్నారంటే..

విశాఖపట్నం, అక్టోబర్ 25: రాజధాని తరలింపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతోంది రాజధాని షిఫ్టింగ్ ఎంతమాత్రమూ కాదన్నారు. అసలు రాజధాని షిఫ్టింగ్ అని ఎవరు చెప్పారు? ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి ఒక కమిటీ ని వేశాం, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయన్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.

కోస్టల్ సెక్యూరిటీ పై ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లో అపెక్స్ కమిటీ సమావేశం, అనంతరం పీఎం మోడీ నిర్వహించిన రాష్ట్రాల ప్రోగ్రెస్ కు సంబందించిన వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖ కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కే ఎస్ జవహర్ రెడ్డి ఆయా కార్యక్రమాల గురించి మీడియా కు వివరిస్తున్న క్రమంలో మీడియా తో మాట్లాడుతూ రాజధానికి సంబంధించి పై వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ది కి సంబందించిన ఏర్పాట్లు మాత్రమే..
జీవో నెంబర్ 2015 పేరుతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఏంటంటే రాష్ట్రంలోనే పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక ప్రాంతాలున్నాయి, ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం తో పాటు విశాఖ ఏజెన్సీలో మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందనీ గతంలో నీతి అయోగ్ వెనకబడిన జిల్లాలను ప్రతిపాదించిన సమయంలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కొన్నాళ్లపాటు నిధులు కూడా విడుదలయ్యాయి. ఆ మేరకు అభివృద్ధి జరగకపోవడంతో ఉత్తరాంధ్ర అభివృద్ది మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.ఈ సమయాల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు లేదంటే ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని, అలాగే ఆ సమయంలో అధికారిక పర్యటన కోసం వచ్చే కీలక ఉన్నత అధికారులకు సంబంధించిన కార్యాలయాలు, వాళ్లు నివాసం ఉండాలంటే అవసరమైతే వాటికి సంబంధించిన భవనాలు, ఇతర శాఖలకు సంబంధించిన ఎవరైనా ఈ ముఖ్యమైన అధికారులు ఈ ప్రాంతానికి వస్తే వాళ్లు ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన చర్యలపై త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆ జీ వో లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

ఆ కమిటీలో ముగ్గురు సీనియర్ అధికారులని సభ్యులుగా నియమించారు. పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, అలాగే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ని సభ్యులుగా నియమిస్తూ కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ ఓ విడత విశాఖ లో పర్యటించి, జిల్లా అధికారులతో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమయంలో ప్రధానంగా సీఎం ఇక్కడకు వస్తే ఉండడానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం తో పాటు దాదాపు 10 నుంచి 15 లక్షల చదరపు అడుగుల అధికారిక వ్యవహారాల స్పేస్, 1500 వరకు వివిధ రకాల నివాస గృహాలకు సంబందించిన సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాంగం అందించింది.

ప్రస్తుతానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమే..
రాజధాని కి సంబందించిన న్యాయ వివాదాలు ప్రస్తుతం సుప్రీం కోర్టు లో పెండింగ్ లో ఉన్నాయి. ఈ వ్యాజ్యం పై డిసెంబర్ లో విచారణ, వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజధాని కి సంబందించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ ను మాత్రం షిఫ్ట్ చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి రాష్ట్రం లో ఎక్కడైనా నివాసం ఉండొచ్చు.
ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే ఆయన కార్యాలయం అక్కడ నుంచి పాలించవచ్చు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పాలన చేయొచ్చు..ఈ వెసులుబాటు తోనే ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో విశాఖ కు సీ ఎం వో ను షిఫ్ట్ చేసి విశాఖ తో పాటు అమరావతి లో కూడా ఉంటూ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ పాలన సాగించవచ్చు. అదే సమయంలో ఎన్నికల నాటికి రాజధాని విషయం లో కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి విశాఖ కు సీ ఎం వో ను షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో ఏర్పాటైన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17 నుంచి విశాఖ కు క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ చేసి, ఇక్కడనుంచి ముఖ్యమంత్రి పాలన సాగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు రాజధాని మార్పుకు సంబంధించినవి ఎంత మాత్రం కాదంటూ సీ ఎస్ ఇచ్చిన వివరణ పై మరొకసారి రాష్ట్ర వ్యాప్త చర్చ కు తెరలేపినట్టైంది.

Telangana Elections: సీఎం సీటుపై గురి! మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్..

GreenLam Industries: ప్రపంచంలోని టాప్ 3 లామినేట్ తయారీదారులలో ఒకటైన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలోని తన అత్యాధునిక తయారీ కేంద్రంలో శుక్రవారం నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్లు వెల్లడించింది. లామినేట్ యూనిట్ ఏర్పాటు దక్షిణ భారతదేశంలో తన తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు, నాణ్యమైన లామినేట్ షీట్లు మరియు కాంపాక్ట్ బోర్డ్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలలో కంపెనీ గణనీయమైన ముందడుగు వేసింది.
నల్లగొండ జిల్లా నక్రేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత తొలిసారిగా ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నక్రేకల్ కు వచ్చాడు. ఈ సదర్భంగా చిట్యాల మండలం పంతంగి టోల్ ప్లాజా నుంచి నక్రేకల్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నక్రేకల్ చౌరస్తాలో జరిగిన సభలో ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపి మధయాష్కీ, వేముల వీరేశం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ.. కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుందని, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చని ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఏదో ఒక రోజు తాను కూడా సీఎం అవుతానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు సీఎం కోమటిరెడ్డి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మోసపూరిత మాటలతో ఎన్నికల్లో మళ్లీ గెలవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు హెలి కాఫ్టర్ లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పై అబద్ధాలు చెపుతున్నారని ఆయన ఆరోపించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నకిరేకల్‌ నుంచి వేముల వీరేశం గెలుపు ఖాయమని, మెజారిటీ కోసం ప్రయత్నించాలని ఆయన క్యాడర్ ను కోరారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని, ఎన్నికలు రాగానే పథకాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకు సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు పంపిణీ చేశారని కోమటిరెడ్డి విమర్శించారు.

Kantareddy Tirupati Reddy : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

Kantareddy Tirupati Reddy – BRS : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గుడ్ బై చెప్పేస్తున్నారు. హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కుతున్నారు. ఇప్పటికే మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు మరో డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ ను వీడారు
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె. తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్డీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి తన క్యాడర్ తో పాటు వస్తున్న తిరుపతి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం పలికారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను బలవంతంగా బయటకి పంపించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పార్టీలో చేరడం స్వాగతించదగిన విషయం అన్నారు. తిరుపతి రెడ్డితో పాటు బీఆర్ఎస్ లో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తామన్నారు.

బీఆర్ఎస్ అసంతృప్త నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం చిచ్చు రాజేసింది. మైనంపల్లి రాకను కొందరు కాంగ్రెస్ కీలక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉండగా కేసుల పెట్టి కాంగ్రెస్ నేతలను వేధించిన మైనంపల్లి హనుమంతరావు లాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా రెండు టికెట్లు ఇవ్వడాన్ని కొందరు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నారు.

పార్టీ పెద్దలు ఎవరూ తమకు కనీస గౌరవం ఇవ్వలేదన్న వేదన ఆ ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కారణమైందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో కొందరు నేతలు చేరితే బలం పుంజుకున్నామని అనుకుంటే.. ఉన్న నేతలను కాపాడుకోలేకపోవడం బలహీనతే అంటున్నారు కాంగ్రెస్ లాయలిస్టులు.

Pawan Kalyan: ఏపీ సర్కార్‌పై పవన్‌ ఫైర్‌.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల జీతాలు కూడా పక్కదారి పట్టిస్తున్నారంటూ..

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మూడు అంశాలపై క్లారిటీ ఇచారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఈపరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పవన్. టీడీపీతో పొత్తు విషయం బీజేపీతో మాట్లాడి.. డిల్లీలో ప్రకటించాలి అనుకున్నా.. వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చాక పొత్తులపై కోఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పవన్‌. ఇప్పటికి జనసేన ఎన్డీఏలోనే ఉందని స్పష్టం చేశారు పవన్. కూటమిలో బీజేపీ కచ్చితంగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జగన్‌ ఎన్డీఏలో లేరని.. కేవలం ఆయనను ఒక రాష్ట్ర సీఎంగానే కేంద్రం గౌరవిస్తుందని చెప్పారు పవన్. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే నిధులు విడుదల చేసిందని బీజేపీ తనతో చెప్పిందన్నారు పవన్. వారాహి విజయయాత్రలో భాగంగా పెడనలో వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని.
డెకరేటివ్ సర్ఫేసింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉంటూ, సబ్‌స్ట్రేట్ విభాగంలోకి అడుగుపెట్టిన గ్రీన్‌లామ్ డెకరేటివ్ లామినేట్‌లు, కాంపాక్ట్ లామినేట్‌లు, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ క్లాడ్‌లు, డెకరేటివ్ వెనీర్లు, ఇంజినీరింగ్ చెక్క ఫ్లోర్లు, డోర్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్‌ల కోసం ప్లైవుడ్ వరకు విభిన్న ఉత్పత్తులను అందిస్తోంది. తయారీలో నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉపరితల పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా ఉండటంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ మార్కెట్ అవకాశాన్ని వేగవంతం చేస్తూ, దాని వృద్ధికి కొత్త ఆదాయ వనరులను అందిస్తుంది.

Radikaa Sarathkumar : బండారు క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి రోజాకు నటి రాధిక మద్దతు, మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం

Radikaa Sarathkumar – Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రోజాకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజాగా మరో సినీ నటి రాధిక సైతం స్పందించారు. మంత్రి రోజాకు ఆమె మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు.
”రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? చివరికి మహిళలను వ్యభిచారులుగా చిత్రీకరిస్తారా? దీని వల్ల మేము భయపడబోము. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటు. వెంటనే క్షమాపణలు చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోండి. రోజాకు నేను అండగా ఉంటాను. ఇంత నీచంగా మాట్లాడటం దారుణం. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ వివక్షపై ప్రధాని మోదీ దృష్టి సారించాలి” అని నటి రాధిక అన్నారు.
నటి ఖుష్బూ సైతం రోజాకు మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణం అన్నారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రోజాకు తక్షణమే క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు ఖుష్బూ. ఆయన క్షమాపణ చెప్పేదాకా సాగే పోరాటంలో తాను కూడా కలుస్తానని చెప్పారు. ఓవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారని, మరోవైపు మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బండారు లాంటి వ్యక్తులు మహిళా నేతలను ఉద్దేశించి నీచంగా మాట్లాడటం ఆవేదన కలిగించే అంశమన్నారు ఖుష్బూ.