IND vs AUS : ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు వ‌రుస షాక్‌లు.. హార్దిక్ వేలికి గాయం, అనారోగ్యం బారిన గిల్‌..!

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టైలే వేరు. హాట్ హాట్ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవికి పోటీపడే నేతలు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. తాజాగా సీఎం పదవిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరైనా సీఎం కావచ్చు , ఏదో ఒక రోజు నేను కూడా సీఎం అవుతానని ఆయన అన్నారు. కోమటిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
నెట్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా..

ఆసీస్ తో మ్యాచ్ కోసం టీమ్ఇండియా స‌న్న‌ద్ద‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న హార్దిక్ పాండ్య కుడి చేతి వేలికి గాయ‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌డికి అయిన గాయం గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. అయితే.. ఆ త‌రువాత హార్దిక్ బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాడ‌ని అంటున్నారు. దీనిపై బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. ఒక‌వేళ ఆసీస్‌తో మ్యాచ్ స‌మ‌యానికి హార్దిక్ కోలుకోలేక‌పోతే టీమ్ఇండియాకు క‌ష్టాలు త‌ప్ప‌వు.

అనారోగ్యం బారిన గిల్‌..

యువ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ అనారోగ్యం బారిన ప‌డిన‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలియ‌జేసింది. అయితే.. అత‌డికి ఏమైంది అన్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. అందుకున్న స‌మాచారం ప్ర‌కారం గిల్ డెంగ్యూ బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆసీస్‌తో మ్యాచ్‌కు అత‌డు అందుబాటులో ఉండ‌డం అనుమాన‌మే. సాధార‌ణంగా డెంగ్యూ నుంచి కోలుకునేందుకు వారం నుంచి ప‌ది రోజుల స‌మ‌యం ప‌డుతుంది. దీంతో గిల్ పాకిస్తాన్‌తో జ‌రిగే మ్యాచ్ వ‌ర‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు.

ఆసీస్‌తో మ్యాచ్‌కు గిల్ దాదాపుగా దూరం అయిన‌ట్లే. దీంతో అత‌డి స్థానంలో ఇషాన్ కిష‌న్ ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగొచ్చు. రోహిత్‌తో క‌లిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం గిల్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ల్లో ఉన్న‌ట్లు భార‌త హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ చెప్పాడు. అత‌డు త్వ‌ర‌లోనే కోలుకుంటాడ‌ని, వైద్యులు ఏం చెబుతారో వేచి చూడాల‌ని అని, గిల్ ఆసీస్‌తో మ్యాచ్‌లో ఆడ‌తాడా లేదా అనే దానిపై శ‌నివారం నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నాడు.

Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్.. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా.. ఎలక్షన్స్ ముందే రిలీజ్..

Nitin Gadkari Biopic : ఇటీవల బయోపిక్స్ ఎక్కువగా వస్తున్నా సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా, పలు రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలను వెండితెరపై చూపించడానికి వారి జీవిత కథలతో బయోపిక్ సినిమాలని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమలలోను బయోపిక్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ బయోపిక్ హంగామా మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అనేక బయోపిక్స్ రాగా బాలీవుడ్ నుంచి ఇప్పుడు మరో ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్ రాబోతుంది.
ప్రముఖ బీజేపీ(BJP) సీనియర్ నేత, ప్రస్తుత కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్ రానుంది. ‘గడ్కరీ’ అనే టైటిల్ తో ‘హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే ట్యాగ్ లైన్ ప్రమోషన్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ అనంత్ దేశముఖ్ నిర్మాణంలో అనురాగ్ రాజన్ బుసారి దర్శకత్వంలో ‘గడ్కరీ’ సినిమా నితిన్ గడ్కరీ బయోపిక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇది కేవలం మరాఠీ సినిమాగా తెరకెక్కుతుంది. మరి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. అయితే ఈ సినిమాలో నితిన్ గడ్కరీ రోల్ ని ఎవరు చేస్తున్నారో ఇంకా ప్రకటించకపోవడం విశేషం.

నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు చెందిన నేత. స్టూడెంట్ గా ఉన్నప్పట్నుంచే బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మొదటి నుంచి కూడా రోడ్స్, ట్రాన్స్ పోర్ట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. అటల్ బిహారి వాజపేయి ఉన్నప్పుడు దేశంలోని రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రోడ్లు వేయాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే కార్యక్రమాన్ని ఈయనే ప్రపోజ్ చేశారు. మహారాష్ట్ర గవర్నమెంట్ లో కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసి మహారాష్ట్ర రవాణా రోడ్డు శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు.

కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా దేశ రోడ్ల మీద ఫోకస్ చేశారు. గత 9 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రిగా పనిచేస్తూ దేశంలో ఎన్నో కొత్త రోడ్లని, హైవేలను, ఎక్స్ ప్రెస్ హైవేలను తీసుకొచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో రవాణాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు గడ్కరీ. ఇంకా దేశం మొత్తం మీద అనేక హైవేల నిర్మాణం జరుగుతుంది. దేశమంతటా ప్రయాణం అందరికి సులభతరం చేయాలనే ఉద్దేశంతో ముందు నుంచి కూడా ఒకే శాఖపై పట్టు సాధించి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలువురు గడ్కరీపై బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.

Rajinikanth: కేరళలో సూపర్ స్టార్ నయా మూవీ షురూ. వైరల్ అవుతోన్న వీడియో

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గరబోల్తా కొట్టాయి. దాంతో రజిని ఫ్యాన్స్ అంతా కాస్త నిరాశకు గురయ్యారు. అయితే జైలర్ సినిమా సంచలన విజయం సాధించి అభిమానులను ఫుల్ ఖుష్ చేసింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసింది. జైలర్ సినిమాను లేపింది అనిరుధ్ సంగీతం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ జైలర్ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు.
లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కు లోకేష్పెట్టింది పేరు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా విక్రమ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమాకు ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా లియో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ షూటింగ్ కేరళలో మొదలైంది. సూపర్ స్టార్ సినిమా కావడంతో షూటింగ్ స్పాట్ కు అభిమానులు భారీగా వచ్చారు. షూటింగ్‌ స్పాట్‌కి రజనీ వచ్చినప్పుడు తలైవా అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలు సూపర్ స్టార్ మరింత యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, రానా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమాకు కొత్త కష్టం.. ఓటీటీ రిలీజ్చేయాలంటే ఇలా చేయాల్సిందే

అక్షయ్ కుమార్ సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే హీరోగా అక్షయ్ కు పేరుంది. ఏడాదికి ఆయన 7 సినిమాలు వరకు రిలీజ్ చేస్తుంటాడు. కానీ ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఓఎంజీ 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాథియేటర్స్ లో రిలీజ్ అయ్యే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ‘OMG 2’ సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డైలాగ్స్ కు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ చిత్రయూనిట్ దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో అక్షయ్ కుమార్ సహా చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేకుండా థియేటర్లలో సినిమా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా OTT విడుదలకు సమస్య ఏర్పడింది.
OMG 2’ చిత్రం అక్టోబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అక్షయ్ కుమార్ స్వయంగా తన సినిమాను నెట్‌ఫ్లిక్స్ OTTలో చూడమని ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడింది. ‘OMG 2’ సినిమా OTT వెర్షన్‌పై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి దీంతో సినిమా 27 కట్స్ తో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.
తన సినిమా OTT విడుదల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, “నాకు ఫైట్ చేయడం ఇష్టం లేదు. నాకు రూల్స్ గురించి తెలియదు, రూల్ బుక్ ఎప్పుడూ చదవను. ఇది అడల్ట్ సినిమా అని అనుకుంటే మనం ఏమీ చేయలేం. చాలా మందికి సినిమా చూపించాం, సినిమా అందరికీ నచ్చుతుంది. యువత కోసం ఈ సినిమా చేశాం అని అన్నారు. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి శివ భక్తుడి పాత్రలో కనిపించాడు. యామీ గుప్తా, పంకజ్ మల్హోత్రా కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Varun Lavanya : వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన మెగాస్టార్..

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని(Lavanya Tripathi) నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటూ సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపోయారు. మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మధ్యే ఈ నిశ్చితార్థం జరిగింది. మెగా అభిమానులు వరుణ్ పెళ్లిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడు చేసుకుంటారా అని చూస్తున్నారు.

ఇటీవలే బాలీవుడ్ ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వద్దకు వెళ్లి తమ పెళ్లి బట్టలు కూడా డిజైనింగ్ కి ఆర్డర్ ఇచ్చారు. వరుణ లావణ్య పెళ్లి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ లో ఉండొచ్చని సమాచారం. నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కి చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిల మధ్య ఈ సెలబ్రేషన్స్ జరిగాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు తన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అభిమానులు ఈ ఫోటోల కింద కామెంట్స్ పెడుతూ వీరి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుపుతున్నారు. మరి ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కనుందో చూడాలి.

Mahesh Babu: నాని మూవీ సాంగ్ చూసి ఎమోషనల్ అయిన మహేష్ బాబు…

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హయ్ నాన్న. నాని రీసెంట్ గా దసరా సినిమాతో హిట్ అందుకున్నాడు. నాని ఊర మాస్ లుక్ లోకి మారి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటించింది. దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న అంటూ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మృణాల్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు నాని తో కలిసి సినిమా చేస్తోంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

తండ్రి కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల మందికి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి గాజు బొమ్మ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ అందమైన సాంగ్ తండ్రి కూతురికి మధ్య సాగే పాట. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈసాంగ్ పై మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా లో ఈసాంగ్ లింక్ ను షేర్ చేస్తూ.. చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. ‘ఒక తండ్రి నుంచి అతని కుమార్తె వరకు.. ప్రతి తండ్రి మదిలో ప్రతి ధ్వనించే పాట ఇది. హాయ్ నాన్న చిత్రబృందానికి నా ఆల్‌ ది బెస్ట్ అంటూ మహేష్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. హాయ్ నాన్న సినిమాకు అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు.

Telangana: దారుణం..కోతుల‌కు విషం పెట్టి చంపిన మ‌నుషులు.. నిందితులను పట్టుకోవాలంటూ స్థానికుల డిమాండ్..

Peddapalli District: గ్రానైట్ వ్యాపారం కారణంగా కొండలు అంతరించి పోతున్నాయి. దీంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వలస వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులకు కోతులకు విషమిచ్చి చంపేశారు. చనిపోయిన కోతులను చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్ కు సమాచారం అందించారు. సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు
పాపం.. మూగ జీవలను చంపేశారు… దేవుడికి ప్రతి రూపంగా భావించే వానరాలకు విషం పెట్టి దారుణంగా హత్య చేశారు.. 35కు పైగా కోతులు మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. ఈ సంఘటన పై విచారణ చేపట్టారు. ఈ దారుణ సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బ పల్లి గ్రామ సమీపంలోని స్మశాన వాటిక దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు కోతులకు విషం పెట్టి చంపేశారు. మృతి చెందిన కోతులను తీసుకొచ్చి స్మశాన వాటిక సమీపంలో పడ వేశారు. 35 పైగా కోతులు చనిపోయి ఉన్నాయి..

అయితే, పథకం ప్రకారమే.. ఈ కోతులను చంపేశారని తెలిసింది.. ఇటీవల కోతులు గ్రామాల్లోకి విపరీతంగా వస్తున్నాయి.. గ్రానైట్ వ్యాపారం కారణంగా కొండలు అంతరించి పోతున్నాయి. దీంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వలస వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులకు కోతులకు విషమిచ్చి చంపేశారు.  చనిపోయిన కోతులను చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్ కు సమాచారం అందించారు.  సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి వాటిని పశు వైద్యాధికారి రఘుపతి రెడ్డి ఆయన టీం తో పంచనామా చేయించారు.  విషం పెట్టి చంపిన వ్యక్తులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఏది ఏమైనా మూగజీవాలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలి తప్ప , విషం పెట్టి చంపడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులే ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.. ఈ కోతుల అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు..

Telangana Elections: సీఎం సీటుపై గురి! మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్..

GreenLam Industries: ప్రపంచంలోని టాప్ 3 లామినేట్ తయారీదారులలో ఒకటైన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలోని తన అత్యాధునిక తయారీ కేంద్రంలో శుక్రవారం నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్లు వెల్లడించింది. లామినేట్ యూనిట్ ఏర్పాటు దక్షిణ భారతదేశంలో తన తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు, నాణ్యమైన లామినేట్ షీట్లు మరియు కాంపాక్ట్ బోర్డ్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలలో కంపెనీ గణనీయమైన ముందడుగు వేసింది.
నల్లగొండ జిల్లా నక్రేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత తొలిసారిగా ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నక్రేకల్ కు వచ్చాడు. ఈ సదర్భంగా చిట్యాల మండలం పంతంగి టోల్ ప్లాజా నుంచి నక్రేకల్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నక్రేకల్ చౌరస్తాలో జరిగిన సభలో ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపి మధయాష్కీ, వేముల వీరేశం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ.. కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుందని, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చని ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఏదో ఒక రోజు తాను కూడా సీఎం అవుతానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు సీఎం కోమటిరెడ్డి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మోసపూరిత మాటలతో ఎన్నికల్లో మళ్లీ గెలవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు హెలి కాఫ్టర్ లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పై అబద్ధాలు చెపుతున్నారని ఆయన ఆరోపించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నకిరేకల్‌ నుంచి వేముల వీరేశం గెలుపు ఖాయమని, మెజారిటీ కోసం ప్రయత్నించాలని ఆయన క్యాడర్ ను కోరారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని, ఎన్నికలు రాగానే పథకాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకు సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు పంపిణీ చేశారని కోమటిరెడ్డి విమర్శించారు.

Kantareddy Tirupati Reddy : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

Kantareddy Tirupati Reddy – BRS : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గుడ్ బై చెప్పేస్తున్నారు. హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కుతున్నారు. ఇప్పటికే మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు మరో డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ ను వీడారు
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె. తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్డీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి తన క్యాడర్ తో పాటు వస్తున్న తిరుపతి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం పలికారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను బలవంతంగా బయటకి పంపించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పార్టీలో చేరడం స్వాగతించదగిన విషయం అన్నారు. తిరుపతి రెడ్డితో పాటు బీఆర్ఎస్ లో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తామన్నారు.

బీఆర్ఎస్ అసంతృప్త నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం చిచ్చు రాజేసింది. మైనంపల్లి రాకను కొందరు కాంగ్రెస్ కీలక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉండగా కేసుల పెట్టి కాంగ్రెస్ నేతలను వేధించిన మైనంపల్లి హనుమంతరావు లాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా రెండు టికెట్లు ఇవ్వడాన్ని కొందరు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నారు.

పార్టీ పెద్దలు ఎవరూ తమకు కనీస గౌరవం ఇవ్వలేదన్న వేదన ఆ ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కారణమైందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో కొందరు నేతలు చేరితే బలం పుంజుకున్నామని అనుకుంటే.. ఉన్న నేతలను కాపాడుకోలేకపోవడం బలహీనతే అంటున్నారు కాంగ్రెస్ లాయలిస్టులు.

Telangana Elections: 6 గ్యారంటీలు సరిపోవు.. హామీల డోస్ పెంచే పనిలో తెలంగాణ కాంగ్రెస్..!

తెలంగాణ కాంగ్రెస్‌లో తుక్కుగూడ సభతో కొత్త జోష్ వచ్చింది.. సభలో సోనియా, రాహుల్ గాంధీలు ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌తో జనాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయని చర్చ జరుగుతుంది. దీనిపై ఇటు బీజేపీ, బీఆరెస్ లు సైతం కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. కాని కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్‌లోనే గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌లో మహలక్ష్మి ద్వారా మహిళలకు ప్రతినెలా రూ. 2,500 పంపిణి, రూ. 500 కే వంట గ్యాస్ సిలిండర్.. అర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. రైతు భరోసా ద్వారా ప్రతిఏటా రైతులు, కౌలు రైతులకు రూ. 15,000 బ్యాంక్ అకౌంట్‌లోకి, వ్యవసాయ కూలీలకు రూ. 12,000 పంపీణి.. వరిపంటకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రకటించింది. గృహజ్యోతి స్కీమ్ ద్వార ప్రతి కటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని.. ఇల్లులేని వారికి ఇంటి స్థంలంతో కలిపి రూ. 5 లక్షలతో ఇంటి నిర్మాణం. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. యువ వికాసం స్కీమ్ ద్వార విద్యార్ధులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. చేయూత స్కీమ్ పథకం ద్వారా వృద్ధులకు, వికాలంగులకు, ఒంటరి మహిళలకు, రూ. 4,000 నెలవారీ పింఛను. రూ. 10 లక్షల రాజీవ్ అరోగ్యభీమా అందించాలని కాంగ్రెస్ పార్టీ తన ఆరు ఆస్త్రాలుగా చెప్పుకుంటుంది.

అయితే వీటిని ఎక్కడి నుండి అమలు చేస్తారని బీఆరెస్ చెబుతున్న వాటికి.. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తిస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు ఉదాహరణగా.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌లో 200 యూనిట్లలో ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్‌ని కర్ణాటక, రాజస్థాన్‌లో అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మహాలక్ష్మి ద్వారా రూ. 2,500, కర్ణాటకలో, వరికి క్వింటాల్‌కి రూ. 500 బోనస్ ఛత్తిస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అక్కడ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే అన్ని గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నామని, తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఇక్కడ రైతుబంధు కొనసాగుతుంది దానిని మరో 5 వేలు పెంచాల్సి ఉంటుంది. తెలంగాణలో పెన్షన్ రూ. 3 వేలు ఇస్తున్నారు. దానిని మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవి ఇష్టారితిన ఇచ్చిన హామీలు కాదని దీనిపైన ఆర్థిక నిపుణులు అధ్యయనం చేసిన తరువాతనే వీటిని ప్రకటించిందని తెలంగాణ నేతలు చెబుతున్నారు.

అయితే ఇప్పడున్న పథకాలకు తోడు కాంగ్రెస్ తీసుకొచ్చే కొత్త పథకాలకు పెద్ద బడ్జెట్ ప్రభావం ఉండదని..ఇప్పటికే కాళేశ్వరం ,పాలమూరు లాంటి పథకాలు పూర్తావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం లో పెద్ద ప్రాజెక్టులు ఏమి ఉండకపోవడం కలిసి వచ్చే అంశం. రాష్ట్రంలో పెరుగుతున్న ఆదాయంతొ కొత్త పథకాలకు ఇబ్బందలు ఉండవని భావిస్తున్నారు. అయితే ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్ ని జనాల దగ్గరకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ వ్యూహత్మకంగా డోర్ టూ డోర్ ప్రచారాన్ని చేస్తుండడం.. తాము అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నామని జనాలను కాంగ్రెస్ మెప్పించే ప్రయత్నం చేస్తుంది. కాని కాంగ్రెస్ తమ ఆస్త్రాలుగా భావిస్తున్న ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఎంత వరకు విజయతిరాలకు చెరుస్తుందో చూడాలి మరి.

1 8 9 10 11 12 22