బాలీవుడ్ జడ్జిలను ఫిదా చేసిన హైదరాబాద్ కుర్రాడు.. అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు..

బాలీవుడ్ జడ్జిలను ఫిదా చేసిన హైదరాబాద్ కుర్రాడు.. అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ర్యాప్ సాంగ్ తెగ వైరలవుతుంది. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు ఓ కుర్రాడు ర్యాప్ సాంగ్ అదరగొట్టేస్తోన్న వీడియో హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ టీవీ ఛానల్‏లో నిర్వహించిన మ్యూజిక్ షోలో హైదరాబాద్ గురించి చెప్తూనే సౌత్ యాక్టర్స్ అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ ఆలపించాడు. ఆ కుర్రాడి పాటకు బీటౌన్ జడ్జీలు ఫిదా కాగా.. అక్కడున్న అడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఆ యువకుడు హైదరాబాద్‏కు చెందిన రేపర్ కేదెన్ శర్మ. ఎంటీవీ హాస్టిల్ సీజన్ 3లో తన ఫర్ఫార్మెన్స్‏తో దుమ్మరేపాడు. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ రేపర్.. ‘హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీ కీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ’ అంటూ స్టేజ్ ని కిక్కెక్కించాడు. హైదరాబాద్ కల్చర్, నగరం గొప్పతనాన్ని.. ఇక్కడి వీధుల్లో చిరు వ్యాపారుల రోజు వారీ జీవితాన్ని తెలియజేస్తూ పాటను స్టార్ట్ చేశాడు.

‘పాట మధ్యలోనే మజా రావడం లేదా.. ఇప్పుడు వస్తుంది చూడండి.. అంటూ అల్లు అర్జున్ డాన్స్ అంటే అందరికీ ఇష్టం.. స్టైల్ స్టార్ అందరూ అతని.. తగ్గేదే లే మేము పుష్ప ఫ్యాన్స్’ అంటూ లిరిక్స్ తో ఓ ఊపు ఉపేసాడు. ఆ తర్వాత వెంటనే సాయి పల్లవి గురించి ప్రస్తావిస్తూ.. ‘అందాలు ఆరబోసే హీరోయిన్స్ ఉంటారు.. కానీ సాయిపల్లవి సింప్లిసిటీ, పాపులారిటీ ఎవరికీ రాదు.. తెలుగులో ఉన్నది 70 మిలియన్ జనాలు..కానీ ఆమె రౌడీ బేబీ పాటకు బిలియన్ వ్యూస్ వచ్చే క్రేజ్ ఆమెది’అంటూ ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు. ఇక అదే పాటలో హైదరాబాద్ లోని పాపులర్ ప్లేసెస్, సౌత్ మూవీస్ గొప్పతనం గురించి ప్రస్తావించడంతో జడ్జీలు ఫిదా అయ్యారు.

కేదెన్ శర్మ ర్యాప్ సాంగ్ వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇక అతనికి సంబంధించిన వీడియోను సీపీ ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలోక షేర్ చేస్తూ.. ఎంటీవీలో ప్రసారమైన ఈ షోను చూసి ఎంజాయ్ చేయండంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం కేదెన్ శర్మ ర్యాప్ సాంగ్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *