మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 22 మంది మృతి, 60 మందికి గాయాలు

మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 22 మంది మృతి, 60 మందికి గాయాలు

అమెరికాలో కాల్పులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దేశంలో రోజురోజుకీ గన్‌కల్చర్‌ పెరిగిపోతోంది..తాజగా అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అమెరికాలోని మైనేలోని లెవిస్టన్ ప్రాంతంలో ఆగంతకులు జరిపిన కాల్పుల్లో 22 మంది చనిపోయారు. 60 మంది వరకూ గాయపడ్డారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారికి ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

కాల్పులు జరిపిన ఓ వ్యక్తి చేతిలో రైఫిల్‌ పట్టుకొని ఉన్న ఫోటోలు విడుదల చేయగా..పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు ప్రస్తుతానికి ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల తలుపులు మూసి ఉంచుకోవాలని అధికారులు సూచించారు. లూయిస్టన్‌లో నిందితుడు ఉపయోగించిన బ్లాక్ పెయింట్ కలిగిన వాహనం కోసం వెతుకుతున్నామని..  నిందితుడి ఆచూకి తెలిస్తే సమాచారం ఇవ్వాలని  లూయిస్టన్ పోలీసులు సూచించారు.

అమెరికాలో గన్‌ కల్చర్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సామాన్యుల ప్రాణాలు పదుల సంఖ్యలో గాల్లో కలిసిపోతున్నాయి. దీనికి ఎలా చెక్‌ పెట్టాలనే అంశంపై అధ్యక్షుడు సైతం ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదో మనసులో పెట్టుకుని అన్నెం పున్నెం ఎరుగని అమాయకులపై తూటాల వర్షం కురిపిస్తున్న ఘటనలు తరచు జరుగుతూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *