WI vs IND 2023: టీమిండియా వెస్టిండీస్ టూర్.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..

Follow Us :

West Indies Tour: ప్రపంచకప్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిపోయింది. ఆసీస్ ముందు తేలిపోయినా టీమిండియా.. ఈ ఏడాది జులై-ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే తన విండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆతిథ్య జట్టుతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది. సోమవారం బీసీసీఐ చేసిన ట్వీట్‌లో విండీస్‌లో భారత్ ఆడే అన్నీ మ్యాచ్‌ల వివరాలు ఉన్నాయి.

WEB POSTS :

రేపటితో ముగియనున్న..టేబుల్ టెన్నిస్‌ నేషనల్‌ ర్యాంకింగ్ ఈవెంట్‌

హైదరాబాద్‌లో టేబుల్ టెన్నిస్‌ నేషనల్‌ ర్యాంకింగ్ ఈవెంట్‌ విజయవంతంగా కొనసాగుతున్నాయి. జాతీయ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొయినాబాద్ ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్స్‌లో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలో దేశ వ్యాప్తంగా దాదాపు 1850 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ నెల 4న ప్రారంభం అయిన ఈ పోటీలు.. రేపటితో ముగియనున్నాయి. ఇక క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా జాతీయ ర్యాంకుల నిర్ధారించనున్నట్లు జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య కార్యదర్శి కమలేశ్ మెహతా తెలిపారు. అండర్‌ 11 నుంచి సీనియర్స్‌ వరకు మొత్తం 12 విభాగాల్లో క్రీడాకారుల మధ్య పోటీ జరుగుతుందన్నారు. ఇక ఈవెంట్‌కు విశేష స్పందన వస్తుందని ఈవెంట్‌ నిర్వాహకులు విజయ్ కుమార్ తెలిపారు.

WEB POSTS :

Telangana: మహబూబాబాద్‌‌లో దారుణం.. శీలానికి వెలకట్టి మరి యువతి ప్రాణాలను బలిగొన్నారు..

Mahabubabad News: తెలంగాణలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు హడలెత్తిస్తున్నాయి. ప్రేమ పేరుతో ఓ యువతి గొంతుకోశాడు మహబూబాబాద్‌కి చెందిన వినయ్‌. బీటెక్‌ విద్యార్థిని పెళ్ళిచేసుకుంటానని నమ్మించి నయవంచన చేశాడు. గత కొంతకాలంగా యువతిని లైంగికంగా ఉపయోగించుకున్నాడు. పెళ్ళి ప్రస్తావన రాగానే మొహం చాటేశాడు. అంతేకాదు. ఐదు లక్షలకు భవ్య శీలానికి వెలకట్టాడు వినయ్‌. పెద్దమనుషుల ద్వారా పంచాయితీ పెట్టి మరి బేరం పెట్టాడు.. దీంతో తనకు జరిగిన మోసాన్ని భరించలేక, అవమానాన్ని తట్టుకోలేక భవ్య ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు వినయ్‌ని ప్రాధేయపడుతోన్న ఫోన్‌ సంభాషణ ప్రస్తుతం కలకలం రేపుతోంది.

ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే, భవ్య ప్రాణాలు తీసిన వినయ్‌ పై చర్యలు తీసుకోవాలని.. భవ్య కుటుంబసభ్యులు మృతదేహంతో వినయ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. భవ్య ప్రాణాలు తీసిన వినయ్‌ని శిక్షించాలని డిమాండ్ చేసింది. దీంతో కురవి మండలం నేరడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భవ్య ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చేస్తోంది. కాగా.. యువతి శీలానికి వెలకట్టి మరి పెద్దలు బలిగొన్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

WEB POSTS :

దూసుకొస్తున్న బిపోర్ జాయ్.. పలు రైళ్లు రద్దు

గుజరాత్ తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శక్తివంతమైన తుఫాను పోర్‌బందర్‌కు నైరుతి దిశలో 310 కి.మీ, దేవభూమి ద్వారకకు నైరుతి దిశలో 320 కి.మీ మరియు జఖౌ నౌకాశ్రయానికి నైరుతి దిశలో 380 కి.మీ వ్యాపించి ఉంది. జూన్ 15 న కచ్, సౌరాష్ట్రతో సహా గుజరాత్ తీర ప్రాంతాలను తాకనుందని అంచనా వేసింది. దీనితో, ఇది జూన్ 16 న రాజస్థాన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అరేబియా సముద్రం, భారత వాతావరణ శాఖ (IMD) డేటా ప్రకారం 1965 తర్వాత జూన్‌లో పశ్చిమ రాష్ట్రాన్ని తాకడం ఇది మూడో తుఫాను అని వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రం మీదుగా ఇప్పటి వరకు 13 తుఫానులు అభివృద్ధి చెందాయి. వీటిలో రెండు గుజరాత్ తీరం, ఒకటి మహారాష్ట్ర, ఒకటి పాకిస్తాన్ తీరం, మూడు ఒమన్-యెమెన్ తీరాలు మరియు ఆరు సముద్రం మీదుగా బలహీనపడ్డాయి. ” అని IMD తెలిపింది.

‘బిపోర్‌జాయ్’ తుఫాను దృష్ట్యా ప్రజలు సముద్రంలోకి వెళ్లకుండా నిరోధించడానికి గుజరాత్‌లోని నవ్‌సారి తీరానికి సమీపంలో పోలీసులు మోహరించారు. జూన్ 15 సాయంత్రం నాటికి ‘బిపార్జోయ్’ చాలా తీవ్రమైన తుఫానుగా బలహీనపడి, గుజరాత్‌లోని జాఖౌ నౌకాశ్రయం సమీపంలో దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బిపోర్ జాయ్ తుఫాను ముప్పు పెరుగుతున్న దృష్ట్యా, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా యంత్రాంగం హెచ్చరిక జారీ చేసింది. శక్తివంతమైన తుఫాను ‘బిపార్‌జోయ్’ గుజరాత్ తీరానికి దగ్గరగా కదులుతున్నందున, పశ్చిమ రైల్వే రాష్ట్రంలోని తీర ప్రాంతాలకు వెళ్లే 50 కి పైగా రైళ్లను రద్దు చేసింది.

తుఫాను గుజరాత్ తీరంలోని కచ్ జిల్లాలో జాఖౌ ఓడరేవు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందున, తీరం నుండి 10 కి.మీ దూరంలో ఉన్న ప్రజలను తరలించాలని ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. కోస్తా జిల్లాలైన కచ్, పోర్ బందర్, దేవభూమి ద్వారకా, జామ్‌నగర్, జునాగఢ్, మోర్బీలలోని తీరప్రాంతానికి సమీపంలో నివసించే వారిని తరలించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. తీరానికి 10 కిలోమీటర్ల లోపు ఉన్న వేలాది మందిని మంగళవారం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 1,300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు దేవభూమి ద్వారక తీర ప్రాంత అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని దక్షిణ మరియు ఉత్తర తీరాల వెంబడి ఫిషింగ్ కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి.వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం కచ్, దేవభూమి ద్వారక, పోర్ బందర్, జామ్‌నగర్, రాజ్‌కోట్, జునాఘర్ మరియు మోర్బిలో జూన్ 15 ఉదయం నుండి సాయంత్రం వరకు గంటకు 145 కి.మీ నుండి 125-135 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

WEB POSTS :

ICC World Cup 2023: హైదరాబాదీలకు బ్యాడ్‌ న్యూస్‌.. ఉప్పల్‌ మైదానంలో టీమిండియా మ్యాచుల్లేవ్‌..

ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటోన్న హైదరాబాదీలకు బీసీసీఐ నిరాశ మిగిల్చింది. ఈ మెగా టోర్నీలో అన్ని ప్రధాన స్టేడియాల‌్లో టీమ్ఇండియా మ్యాచ్‌ల‌కు అవ‌కాశాన్ని క‌ల్పించిన బీసీసీఐ.. ఉప్పల్ స్టేడియాన్ని మాత్రం విస్మరించింది. తాజాగా రిలీజైన వన్డే వరల్డ్‌ కప్‌ డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఇది డ్రాఫ్ట్‌ షెడ్యూల్ అయినప్పటికీ దీనినే ఫైనల్ చేసే అవకాశం లేకపోలేదు. దీంతో హైదరాబాదీ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను నిరాశకు లోనవుతున్నారు. అయితే.. ఉప్పల్‌లో పాకిస్థాన్ మాత్రం రెండు క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. పాకిస్థాన్‌కు ఉప్పల్‌లో ఛాన్స్ ఇచ్చి టీమ్ఇండియాకు అవ‌కాశం ఇవ్వక‌పోవ‌డం హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌ను డిజ‌పాయింట్‌ కు గురిచేస్తోంది. కాగా ప్రపంచకప్‌ లీగ్ దశలో టీమిండియా మొత్తం 9 మ్యాచ్‌లు ఆడనుంది. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌పై, అందులోనూ ఉప్పల్ స్టేడియంలో టీమిండియాకు మ్యాచ్‌లు లేకపోవడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో కొందరు నెటిజన్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ హైదరాబాద్‌కు అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా భారత్‌ మ్యాచ్‌లు కేటాయించకుండా పాకిస్తాన్‌ మ్యాచ్‌లు ఆడిస్తున్నారంటూ, దీనిపై మాట్లాడాంటూ ఫ్యాన్స్‌ రిక్వెస్టులు పంపుతున్నారు.

WEB POSTS :

Warangal: వరంగల్‌లో వీధికుక్కల హల్ ఛల్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను గాయపరచిన కుక్క

Warangal: వీధి కుక్క దాడిలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ తోపాటు పలువురు గాయపడిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్టవాడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీను బట్టల బజార్లో విధులు నిర్వహిస్తున్నారు. అటుగా వెళుతున్న రాజమ్మ అనే వృద్ధురాలిని కుక్కలు దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనుపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

గాయపడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీను, రాజమ్మ తో పాటు కాశిబుగ్గకు చిందిన నవీన్, కాజీపేట కు చెందిన పర్వేజ్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితులను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఎంజీఎం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఇప్పటికే అనేకసార్లు కుక్కల దాడి ఘటన జరుగుతున్న నిద్రమత్తులో ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు పై జంగా రాఘవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

WEB POSTS :

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు శేజల్‌. దుర్గం చిన్నయ్య పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సీబీఐకి ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకే సీబీఐకి ఫిర్యాదు చేశానన్నారు. ఇక తనపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని.. న్యాయం జరిగే వరకు ఢిల్లీలోనే ఉంటానని శేజల్‌ అన్నారు.

WEB POSTS :

రూ. వెయ్యి కోట్ల భూములు కొట్టేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో పాదర్శకంగా భూ రికార్డులు ఉండేవని.. ఇప్పుడు నిషేధిత భూములను కూడా దోచుకుంటున్నారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.. వెయ్యి కోట్ల రూపాయల భూములను కొట్టేస్తున్నారంటూ ఆయన ఘాటైన ఆరోపణలు చేశారు.. ధరణి సమస్యలు పరిష్కారం కాక రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి కలెక్టరేట్ల ముందు వేలాది మంది రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు.. సమస్యల పరిష్కారం కోసం 30శాతం కమిషన్లు అడుగుతున్నారని రేవంత్‌ రెడ్డి ఫైరయ్యారు.

కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బందు, రైతు బీమా రాదని కేసీఆర్ తెలంగాణ ప్రజలని కన్ఫ్యూజ్‌ చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.. ధరణి రద్దు చేస్తే తమ కుట్ర బయట పడుతుందని ప్రభుత్వం భయపడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ధరణిని రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తీసుకొస్తామన్నారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ భూములపై విచారణ జరిపిస్తామన్నారు..

WEB POSTS :

Khammam: మద్యం మత్తులో దర్జాగా హైవే పైకాళ్లు చాపి కూర్చున్న వ్యక్తి.. వాహనాలు తాకుతూ వెళ్తున్నా కదలని వైనం….

పగటి పూట బిక్షాటన చేస్తూ..రాత్రుళ్ళు ఫుల్ గా మందు కొడతాడు. ఆ వ్యక్తి రాత్రి మందు ఎక్కువై మత్తులో డివైడర్ కు ఆనుకుని రెండు కాళ్ళు చాపి దర్జాగా హైవే పై కూర్చున్నాడు. సృహలో లేకపోవడంతో కాళ్ళకు ఆనుకుని వందలాది వెహికిల్స్ వెళ్తున్న అతనికి స్పృహ లేదు.

తాగర అన్న.. తాగి ఊగ రా అన్నట్టు గా ఒక వ్యక్తి ఫుల్ గా తాగి నడి రోడ్డు మీదనే మద్యం మత్తులో కూర్చున్నాడు. వందలాది వాహనాలు రయ్.. రయ్..మంటు పోతున్నాయి కానీ అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. వెళ్ళే వాహనాలకు అడ్డుగా కాళ్ళు చాపి కూర్చోవడంతో బస్, లారీలు..చక్రాల కింద కాళ్ళు ఎక్కడ నలిగిపోతాయో అనే విషయం కూడా పట్టించుకోకుండా ఎవ్వరూ దారిన వారు వెళ్తున్నారు. ఇంత వరకు ఒకే.. అయితే అటుగా వెళ్ళే పోలీసులు కూడా కనీసం కన్నెత్తి చూడకుండా.. చూసి చూడనట్టు హైవే పెట్రోలింగ్ వెహికిల్ లో రయ్.. మంటు దూసుకు పోయారే.. కానీ మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పోలీసులు కూడా వదిలేశారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఆర్టీసీ బస్ స్టాండ్ కు ఇన్ గేట్ సమీపంలో మెయిన్ హైవే రోడ్డు పై రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇది. సత్తుపల్లి లో పగటి పూట బిక్షాటన చేస్తూ..రాత్రుళ్ళు ఫుల్ గా మందు కొడతాడు. ఆ వ్యక్తి రాత్రి మందు ఎక్కువై మత్తులో డివైడర్ కు ఆనుకుని రెండు కాళ్ళు చాపి దర్జాగా హైవే పై కూర్చున్నాడు. సృహలో లేకపోవడంతో కాళ్ళకు ఆనుకుని వందలాది వెహికిల్స్ వెళ్తున్న అతనికి స్పృహ లేదు. ఇంక ఆర్టీసీ బస్సులు మాత్రం డివైడర్ వద్ద ఆ యువకుడు కూర్చునే సరికి బస్ స్టాండ్ లోకి బస్ లు మలుపు తిప్పెందుకు ఇబ్బంది పడ్డారు. ఇదంతా బాగా నే ఉంది..

ఎలాంటి బాధ్యత లేదన్నట్టుగా సత్తుపల్లి పోలీసులు పోలీస్ వాహనం లో అక్కడే రయ్..రయ్..మంటు తిరుగుతున్నారు.. తమకు ఎందుకు అన్నట్లుగా.. రోడ్డు మధ్య ఉన్న  అతని పట్టించుకుని కనీసం రోడ్డు పక్కకు కూడా తీసుకు వెళ్ళలేదు. మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బైకు మీద వచ్చి చూసుకుంటూ తాపీగా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి దగ్గరలోనే బైకు ఆపి ఎంచక్కా సెల్ ఫోన్ మాట్లాడుతూ.. టీ లు తాగుతున్నారు. ఈ దృశ్యాలు చూసిన కొందరు సమాజం పట్ల మరి బాధ్యత లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు. నిర్లక్ష్యంగా రోడ్ల మీద వ్యవహరిస్తూ వాహన చోదకులు ఇబ్బందులు గురి చేస్తున్న వారి పై కొంచెం పోలీసులు కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు.

 

WEB POSTS :

Telangana: భూ సమస్య తీర్చి బాధితుడి కొడుకు దృష్టిలో హీరోగా మారిన జిల్లా కలెక్టర్.. ఐడాక్‌లో కలుసుకుని సందడి

ప్రజల దృష్టిలో హీరోలుగా నిలబడవచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలబడుతున్నారు పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ ఒక వ్యక్తి భూ సమస్యను పరిష్కరించారు. దీంతో బాధితుడి తనయుడు దృష్టిలో ఆ కలెక్టర్ హీరో అయ్యాడు. అభిమానిగా మారాడు. ఈ తెలంగాణలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది.
ప్రజల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకుని అభిమానాన్ని సంపాదించుకోవాలంటే.. సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు.. ఫైట్స్, డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదని కొందరు అధికారులు నిరూపిస్తున్నారు. అవును ప్రభుత్వ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే ప్రజల దృష్టిలో హీరోలుగా నిలబడవచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలబడుతున్నారు పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ ఒక వ్యక్తి భూ సమస్యను పరిష్కరించారు. దీంతో బాధితుడి తనయుడు దృష్టిలో ఆ కలెక్టర్ హీరో అయ్యాడు.  అభిమానిగా మారాడు. ఈ తెలంగాణలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

దమ్మపేట మండలం జమేదార్ బంజర్‌కు చెందిన కుంజా వెంకటేశ్వలు తనకు భూమి సమస్య ఉంది.. పరిష్కరించమని కొంతకాలం క్రితం గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రం సమర్పించాడు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి  స్పందిస్తూ.. పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై సభలో చర్చ జరగడంతో కలెక్టర్ ఆదేశాలతో భూ సమస్య పరిష్కారం జరుగుతుందని వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులకు తెలిపారు.

భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడడం బాధితుడు వెంకటేశ్వర్లు కుమారుడు హర్షానందన్‌ పరిశీలించాడు. దీనికి కారణంగా హర్షానందన్‌ కలెక్టర్‌ను కలవాలని పట్టుబట్టాడు. కలెక్టరేట్‌కు తీసుకెళ్లాలని తండ్రిని కోరారు. కొడుకు కోరిక తీర్చడం కోసం సోమవారం వెంకటేశ్వర్లు తన కుమారుడిని కలెక్టరేట్‌కు తీసుకొచ్చి ప్రజావాణి సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టిను కలిశారు. కలెక్టర్‌ని కలిసిన హర్షానందన్‌ సంతోషంగా కరచాలనం చేశాడు. అనుదీప్ దురిశెట్టి కొద్దిసేపు ఆ బాలుడితో మాట్లాడి.. ఫోటో దిగారు. ఈ ఘటన సోమవారం ప్రజావాణిలో హైలెట్‌గా మారింది.

WEB POSTS :