మరో వివాదానికి తెర లేపిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ నియామకం వివాదాస్పదం అవుతుంది. ఏకపక్షంగా ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ పేరును లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేయటంతో ఈ కొత్త వివాదం నెలకొంది. అలహాబాద్ మాజీ జడ్జి జస్టిస్ ఉమేశ్ కుమార్ ను ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్. DERC ఛైర్మన్ గా రాజస్థాన్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ సంగీత్ లోధా పేరును నిన్న లెఫ్టినెంట్ గవర్నర్ కు సిఫారసు చేసింది ఢిల్లీ ప్రభుత్వం.

ఢిల్లీ రాష్ట్ర కేబినెట్ సిఫారసును కాదని ఏకపక్షంగా ఎలా నియామకం చేస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ఢిల్లీలోని ఎన్నికైన ప్రభుత్వ సిఫార్సుకు వ్యతిరేకంగా DERC ఛైర్మన్‌ను నియమించడం చట్టం, రాజ్యాంగ విరుద్ధమన్న ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కి ఎందుకు మెజారిటీ ఇచ్చారని ఢిల్లీ ప్రజలపై బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోందన్న విమర్శ ఉంది. ఢిల్లీ ప్రజలకు 24గంటల ఉచిత కరెంటు అందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు అతిషి. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేసింది ఆప్ ప్రభుత్వం.

Opposition leaders meeting: పాట్నాలో విపక్ష పార్టీల ఐక్యత సమావేశం..‘ఇది సిద్దాంతాల యుద్ధం’ సమావేశానికి ముందు రాహుల్..

పాట్నా: మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఐక్యత సమావేశం (Opposition leaders meeting) మరికొద్దిసేపట్లో బీహార్ సీఎం నితీష్‌కుమార్ (Bihar CM Nithish Kumar) నివాసంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 15 ప్రతిపక్ష పార్టీలు పాల్గొననున్నాయి.

విపక్ష పార్టీల ఐక్యత సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ (Rahul Gandhi), మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), శివసేన (యూబీటి) నేత ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే పాట్నా చేరు కున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు, ఎన్డీఏను ఎదుర్కొనేందుకు ప్రధాన ఫ్రంట్ ఏర్పాటు రోడ్ మ్యాప్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యతన విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు.

లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కోచ్ లో భారీ మంటలు.. పరుగులు తీసిన జనం

ఈ మద్య రైలు ప్రమాదాలు వరుసగా జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా  బేసిన్ బ్రిడ్జి సమీపంలోని లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో గురువారం మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ట్రైన్ దూకి పరుగులు తీశారు.  లోకమాన్య తిలక్ ఎక్స ప్రెస్ ట్రైన్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చెన్నై నుంచి ముంబైకి బయలుదేరింది. బయలుదేరి కొద్ది నిమిషాల్లోనే చెన్నై బేసిన్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే ట్రైన్ ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో లోకో పైలట్ ట్రైన్ ని నిలిపివేశాడు. వెంటనే రైల్వే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. హుటాహుటిన సిబ్బంది వచ్చి ఇంజన్ లోని మంటలు కంపార్ట్ మెంట్స్ కి వ్యాపించకుండా గంటపాటు పోరాడి మొత్తానికి మంటలను ఆర్పివేశారు.

మంటలు కంట్రోల్ లోకి తెచ్చిన తర్వాత రీప్లేస్ మెంట్ ఇంజన్ ని అమర్చి రైలు అక్కడ నుంచి బయటుదేరేందుకు సిద్దం చేశారు. హై వోల్టేజీ లైన్ పై రుద్దుకు పోవడంతో ఇంజన్ లో మంటలు చెలరేగినట్టు సమాచారం. అయితే ఖచ్చితమైన కారణం గురించి వివరాలు తెలియరాలేదు. ట్రైన్ లో నుంచి మంటలు రావడంతో దట్టంగా పొగ అల్లుకుంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారే భయంతో వణికిపోయారు.. ఆగమేఘాల మీద ట్రైన్ దూకి పరుగులు పెట్టారు. ఈ ఘటన అక్కడ తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా, రైల్ మంటల కారణంగా అరక్కోణం మీదుగా వెళ్లే రైళ్లు కొద్దిపాటి ఆలస్యంగా వెళ్తాయని అధికారులు తెలిపారు.

Apple Watch Alert: ప్రాణాల రక్షణలో యాపిల్ వాచ్ టాప్.. ఇదిగో ప్రూఫ్.. ఈ మహిళ మాటలు వింటే షాకవుతారు..

ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్ వాచ్‌లను వినియోగిస్తున్నారు. గతంలో కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించే వాచ్‌ల్లో ఇప్పుడు వచ్చే ఫీచర్ల వల్ల మరింత స్మార్ట్‌గా మారాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్ వాచ్‌లో ఆరోగ్య పరిరక్షణకు వివిధ ట్రాకర్లను ఇవ్వడంతో చాలా మంది బీపీ పేషెంట్లకు ఈ వాచ్‌లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లు కానీ, వాచ్‌లు కానీ ఏవైనా ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ప్రత్యేక క్రేజ్ ఉంది. చాలా మంది యాపిల్ వాచ్ వినియోగదారులు తమ ప్రాణాలను కాపాడేందుకు యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు క్రెడిట్ ఇస్తున్నారు. యాపిల్ వాచ్ ఒక వ్యక్తికి సంబంధించిన హృదయ స్పందన రేటును నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇందులో ఏదైనా తప్పు జరిగితే వినియోగదారుని హెచ్చరిస్తుంది. తమ యాపిల్ వాచ్ వారి హృదయ స్పందనలో అవకతవకలను గుర్తించిందని చివరికి వారి ప్రాణాలను కాపాడిందని వినియోగదారులు తరచుగా చెబుతారు. ఆపిల్ వాచ్ రక్షించడానికి వచ్చిన అలాంటి మరొక సంఘటన జరిగింది. తాజాగా ఓ 29 ఏళ్ల మహిళ ప్రాణాంతక సమస్య నుంచి యాపిల్ వాచ్ బయటపడేసిందని ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆ వివరాలు ఏంటో ఓ సారి చూద్దాం.

కిమ్మీ వాట్కిన్స్ అనే 29 ఏళ్ల మహిళ ఆమె ఆపిల్ వాచ్ ద్వారా ఆమె అధిక హృదయ స్పందన రేటు గురించి హెచ్చరించింది. ఆ సమయంలో ఆమె నిద్రపోతోంది. ఆమె నిద్రలో ఉన్నప్పుడు ఆమె హృదయ స్పందన నిమిషానికి 178 బీట్‌లకు పెరిగింది. దీనికి ముందు ఆమె మైకంతో బాధపడుతుంది. దీంతో ఆమె గంటన్నర నుంచి పడుకునే ఉంది. అయితే అధిక హృదయ స్పందన రేటు నేపథ్యంలో వాచ్‌లో అలారం వల్ల ఆమె మేల్కొంది. ఈ అధిక హృదయ స్పందన రేటు దాదాపు 10 నిమిషాలు ఉందని ఆమె పేర్కొంది. దీంతో వాట్కిన్స్ వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు, ఆమెకు సాడిల్ పల్మనరీ ఎంబోలిజం ఉందని, ప్రాణాపాయకరమైన రక్తం గడ్డకట్టడం జరిగిందని ఆమె చెప్పిందని నివేదిక పేర్కొంది. సాడిల్ పల్మనరీ ఎంబోలిజం అనేది అన్నింటికంటే తీవ్రమైనది, అలాగే ప్రాణాపాయం. ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టడం వల్ల రక్తనాళాన్ని కుడి ఊపిరితిత్తులకు, ఎడమ ఊపిరితిత్తులకు చేర్చుతుంది. ప్రస్తుతం వాట్కిన్స్ రక్తం పలచబడుతోంది. ఆమె శక్తిని తిరిగి పొందుతోంది. యాపిల్ కంపెనీ ఈ నెల ప్రారంభంలో జరిగిన డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 సందర్భంగా మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతపై బలమైన ప్రాధాన్యతనిచ్చింది. యాపిల్ వాచ్ ఓఎస్ కొత్త ఆరోగ్య లక్షణాలను ప్రకటించింది. అందువల్ల మీరు యాపిల్ వాచ్ భవిష్యత్తులో శారీరక ఆరోగ్య ట్రాకింగ్ కంటే చాలా ఎక్కువ చేయగలరు. 

Whatsapp Tips: వాట్సాప్‌లో ఆ ఒక్క ఫీచర్ డిసేబుల్ చేస్తే చాలు.. మీ ఫోన్ స్టోరేజ్ సేఫ్.. వివరాలు తెలుసుకోండి

కచ్చితంగా ప్రతి ఒక్క యూజర్ వాట్సాప్ గ్రూపుల్లో ఉంటున్నారు. అయితే ఆయా గ్రూపుల్లో చాలా మంది ఫోటోలు, వీడియోలు లేదా జీఐఎఫ్‌లను స్వీకరించే పంపుతూ ఉంటారు. అయితే ఆయా గ్రూపుల్లో వారు పంపే ఫైల్స్ మనకు అవసరం లేకపోయినా ఆటోమెటిక్‌గా డౌన్ లోడ్ కావడం వల్ల మన ఫోన్స్‌లోని స్టోరేజ్ నిండిపోతూ ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ను మిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. అలాగే కచ్చితంగా ప్రతి ఒక్క యూజర్ వాట్సాప్ గ్రూపుల్లో ఉంటున్నారు. అయితే ఆయా గ్రూపుల్లో చాలా మంది ఫోటోలు, వీడియోలు లేదా జీఐఎఫ్‌లను స్వీకరించే పంపుతూ ఉంటారు. అయితే ఆయా గ్రూపుల్లో వారు పంపే ఫైల్స్ మనకు అవసరం లేకపోయినా ఆటోమెటిక్‌గా డౌన్ లోడ్ కావడం వల్ల మన ఫోన్స్‌లోని స్టోరేజ్ నిండిపోతూ ఉంటుంది. వాటిని తొలగించడానికి మీకు సమయం మొత్తం సరిపోతుంది. అయితే ప్రతి చాట్ కోసం మీడియా ఆటో-డౌన్‌లోడ్‌ను నిలిపివేయడానికి వాట్సాప్ఓ ఫీచర్‌ను అందిస్తూ ఉంటుంది. దీని గురించి చాలా మందికి మందికి తెలియదు. ఈ ఫీచర్‌ను డిజేబుల్ చేస్తే మీకు కావాల్సిన ఫైల్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఎలా డిసేబుల్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

వాట్సాప్‌లో ఆటో-డౌన్‌లోడ్ అంటే?

మీరు వాట్సాప్‌లో మీడియా ఫైల్‌ను స్వీకరించినప్పుడు యాప్ దాన్ని ఆటోమేటిక్‌గా మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ చేస్తుంది. మీడియా విజిబిలిటీ ఎంపిక డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది. ఈ ఫీచర్ ఆన్ లేదా ఆఫ్ చేయబడిన తర్వాత డౌన్‌లోడ్ చేయబడిన కొత్త మీడియాను మాత్రమే ఈ ఫీచర్ ప్రభావితం చేస్తుంది. అలాగే పాత మీడియాకు వర్తించదు.

మీరు ఆటో డౌన్‌లోడ్ ఫీచర్‌ను నిలిపివేసిన తర్వాత మీరు నిర్దిష్ట చాట్‌లోని ఫోటోలు, వీడియోలు లేదా పత్రాలను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.  మీకు అనవసరమైన మీడియాను పంపుతుందని మీరు భావించే సమూహాలు లేదా వ్యక్తిగత చాట్‌ల కోసం మాత్రమే ఫీచర్‌ని నిలిపివేయడం మంచిది. కాబట్టి, మీరు ఆ చాట్ నుండి ఏదైనా ముఖ్యమైనది పొందినట్లయితే, మీరు దానిని మీ సొంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల మీ మొబైల్ డేటాలో కొంత మొత్తాన్ని కూడా ఆదా చేస్తుంది.

హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల ధరల్లో వృద్ధి

హైదాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 13 శాతం పెరిగాయి. చదరపు అడుగు రూ.10,410గా ఉంది. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లైసెస్‌ ఫొరాస్‌ సంయుక్తంగా విడుదల చేసిన ‘హౌసింగ్‌ ప్రైస్‌ ట్రాకర్‌ రిపోర్ట్‌ క్యూ1 2023’ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 8 శాతం మేర క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు పెరిగాయి.

 
రానున్న రోజుల్లో ధరల పెరుగుదల మోస్తరుగా ఉండొచ్చని లైసెస్‌ ఫొరాస్‌ ఎండీ పంకజ్‌ కపూర్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్‌ ధరల ఫలితంగా ఇళ్ల ధరలు కూడా పెరిగాయి. అయినా కానీ, స్థిరమైన డిమాండ్‌ నెలకొంది. ఈ బలమైన ధోరణి కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. కొత్త ఇల్లు కొనుగోలు పట్ల వినియోగదారులు స్పష్టమైన ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఇళ్లు, మెరుగైన సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు, వడ్డీ రేట్ల రూపంలో ఎదురైన సవాళ్ల మధ్య హౌసింగ్‌ రంగం బలంగా నిలబడినట్టు కొలియర్స్‌ సర్వీసెస్‌ కు చెందిన అక్యుపయర్‌ సర్వీసెస్‌ ఎండీ పీయూష్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. సొంతిల్లు కలిగి ఉండేందుకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో అందుబాటు ధరలు, నాణ్యతో కూడిన ప్రాజెక్టులు ఈ రంగం వృద్ధికి తోడ్పడతాయన్నారు. 

హైదరాబాద్‌లో కోరమ్‌ ‘డిస్ట్రిక్ట్‌150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు

Follow Us :

ఆఫీసు కార్యకలాపాలు, సమావేశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ఈవెంట్ల నిర్వహణకు కూడా వేదికగా ఉపయోగపడేలా హైదరాబాద్‌లో ’డిస్ట్రిక్ట్‌150’ పేరిట కొత్త వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లు కోరమ్‌ క్లబ్‌ వెల్లడించింది. దేవ్‌భూమి రియల్టర్స్‌ భాగస్వామ్యంలో రూ. 16.5 కోట్ల పెట్టుబడితో దీన్ని నెలకొల్పుతున్నట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో వివేక్‌ నారాయణ్‌ వెల్లడించారు. 

దాదాపు 35,000 చదరపు అడుగుల  విస్తీర్ణంలో ఉండే ’డిస్ట్రిక్ట్‌150’ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇందులో ఒపెరా తరహా హాల్, పాడ్‌కాస్ట్‌ రికార్డింగ్‌ స్టూడియో, కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, థియేటర్, జిలా బ్రాండ్‌ ఇండియన్‌ రెస్టారెంట్, సబ్‌కో కాఫీ బ్రాండ్‌ మొదలైనవి ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో 8 పైగా ఇటువంటి వెంచర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి వెంచర్‌ను బెంగళూరులో నెలకొల్పుతున్నట్లు నారాయణ్‌ వివరించారు.

Komaki Electric Scooter: అప్‌డేటెట్ ఫీచర్లతో కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్ రీ లాంచ్.. అదిరే రేంజ్.. ధర మాత్రం అందుబాటులోనే..

మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్కూటర్లకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. పురుషులు, మహిళలు వినియోగించకునే వీలుండటం, సిటీ పరిధికి సరిగ్గా సరిపోతుండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని కంపెనీలు విద్యుత్ శ్రేణి స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఉన్న పలు మోడళ్లలో కొత్త ఫీచర్లు యాడ్ చేసి అప్ గ్రేడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో ఇప్పటికే తన సత్తా చూపిన కోమకి కంపెనీ ఇప్పుడు పాత మోడల్ ను సరికొత్తగా అడ్ డేట్ చేసి ఆవిష్కరించింది. కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ మోడల్ ఇప్పుడు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ తో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్, విడా వీ1 ప్రో వంటి వాటితో పోటీపడనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..

కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, లభ్యత..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో, స్పోర్ట్ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, వీటి ధరలు వరుసగా ధర రూ. 96,968, రూ. 1,29,938, రూ. 1,38,427 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ జెట్ బ్లాక్, రాయల్ బ్లూ, ప్యూర్ గోల్డ్, గార్నెట్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది .

కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్‌లు..

ఈ స్కూటర్ లో 3 kW సామర్థ్యంతో హబ్ మోటార్ ఉంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై ఎకో వేరియంట్ 75 కి.మీ నుండి 90 కి.మీల రేంజ్ ఇస్తుంది. అదే స్పోర్ట్స్ వేరియంట్ స్కూటర్ అయితే 110 కిమీల నుంచి 140 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. అదే స్పోర్ట్స్ పెర్ఫామెన్స్ అప్ గ్రేడ్ వెర్షన్ అయితే 150 కి.మీ నుంచి 180 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. బ్యాటరీ చార్జింగ్ ఇంట్లో చేస్తే నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది. గరిష్టంగా గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలుగుతుంది.

Junior Asia Cup 2023: జపాన్‌ను చిత్తుచేసి ఫైనల్‌ చేరిన టీమిండియా.. నేరుగా ప్రపంచ కప్ టోర్నీకి క్వాలిఫై..

Women’s Junior Asia Cup 2023: జపాన్‌ వేదికగా జరుగుతున్న జూనియర్‌ మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా అమ్మాయిలు 1-0తో ఆతిథ్య జపాన్ జట్టుపై విజయం సాధించారు. మ్యాచ్ ఆద్యంతం కూడా ఒక గోల్ మాత్రమే నమోదు అయింది. హోరాహోరీగా సాగిన ఈ సెమీస్‌‌లో భారత్‌ తరఫున, అలాగే పూర్తి మ్యాచ్‌లో సునేలితా(47వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది.

అయితే ఆసియా కప్ టోర్నీ టాప్ 3 స్థానాల్లో నిలిచిన జట్లు ఈ ఏడాది(నవంబర్-డిసెంబర్) చివరిలో జరిగే ఎఫ్‌ఐహెచ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో ఆసియా కప్ ఫైనల్‌కి చేరిన టీమిండియా.. శాంటియాగో వేదికగా జరిగే ప్రపంచకప్ టోర్నీకి క్వాలిఫై అయింది.

మరోవైపు ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్ 2023 మ్యాచ్‌లో చైనా లేదా సౌత్ కోరియాతో మన అమ్మాయిలు తలపడనున్నారు.

WEB POSTS :

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ లో ఫైనల్‌ కు చేరిన జొకోవిచ్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కు చేరాడు సెర్బియా స్టార్‌ నోవక్ జకోవిచ్. వరల్డ్‌ నెంబర్‌ వన్‌.. స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కరాజ్‌తో జరిగిన సెమీస్‌ పోరులో జొకోవిచ్‌ 6-3, 5-7,6-1,6-1తో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో జొకోవిచ్‌ గేమ్‌కు కౌంటర్‌ ఇచ్చిన అల్కరాజ్‌ తర్వాతి రెండు సెట్లలో నిలవలేకపోయాడు.అయితే గేమ్‌లో మాత్రం అల్కరాజ్‌ తనదైన సర్వీస్‌ షాట్లతో జొకోవిచ్‌కి చెమటలు పట్టించాడు.ఇక జొకోవిచ్‌ కెరీర్‌లో 34వ సారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు.22 టైటిల్స్‌ గెలిచిన నాదల్‌తో పాటే అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ సాధించిన ఆటగాడిగా జొకోవిచ్‌ ఉన్నాడు.

ఇక ఫైనల్లో గెలిచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ అందుకుంటే..23 టైటిల్స్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్‌ చరిత్రకెక్కనున్నాడు. మరో సెమీఫైనల్లో కాస్పర్‌ రూడ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ల మధ్య జరగనుంది. ఈ ఇద్దరిలో గెలిచిన ఆటగాడితో జొకోవిచ్‌ ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాడు.

WEB POSTS :