Telangana Elections: బోధన్‌లో నాన్ కేడర్ పాలిటిక్స్.. వారి ఓట్లపైనే అన్ని పార్టీల పోక‌స్

Telangana Elections: బోధన్‌లో నాన్ కేడర్ పాలిటిక్స్.. వారి ఓట్లపైనే అన్ని పార్టీల పోక‌స్

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మూడు అంశాలపై క్లారిటీ ఇచారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఈపరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పవన్. టీడీపీతో పొత్తు విషయం బీజేపీతో మాట్లాడి.. డిల్లీలో ప్రకటించాలి అనుకున్నా.. వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చాక పొత్తులపై కోఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పవన్‌. ఇప్పటికి జనసేన ఎన్డీఏలోనే ఉందని స్పష్టం చేశారు పవన్. కూటమిలో బీజేపీ కచ్చితంగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జగన్‌ ఎన్డీఏలో లేరని.. కేవలం ఆయనను ఒక రాష్ట్ర సీఎంగానే కేంద్రం గౌరవిస్తుందని చెప్పారు పవన్. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే నిధులు విడుదల చేసిందని బీజేపీ తనతో చెప్పిందన్నారు పవన్. వారాహి విజయయాత్రలో భాగంగా పెడనలో వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని.

బోధన్ నియోజకవర్గం కొత్తగా నమోదైన మైనారిటీ ఓట‌ర్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, బిలోలి ప్రాంతాలకు చెందిన మైనారిటీ వర్గాల వారిని బోధన్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలు అక్రమంగా ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. దొంగ ఓట్లను తొలగించాలంటూ ఆందోళ‌న బాట ప‌ట్టింది బీజేపీ. ఏకంగా నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మెడ‌పాటి ప్రకాశ్ రెడ్డి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో దాదాపు 8 వేలా ఓట్లను తొల‌గించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు వేసిన స్కెచ్‌తో బీజేపీ మెజారిటీగా హిందూ ఓటు బ్యాంక్ పోల‌రైజెష‌న్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 8 వేల ఓట్లు పోవ‌డంతో డైలామాలో ప‌డింద‌ట బీఆర్ఎస్. ఇక హిందూ ఓటు బ్యాంక్‌ను చేసుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్ బీఆర్ఎస్. ఈనేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీతో ఇప్పటి వ‌ర‌కు ఉన్న వాళ్లను టార్గెట్ చేసి తమ పార్టీల్లోకి ఆక‌ర్షిస్తున్నార‌ట. బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్‌గా పైట్ మార‌డంతో ఏవ‌రి బ‌లం వాళ్లు చూపించుకోవాడానికి ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ ఫైర్
బీజేపీ నియోజక‌వ‌ర్గ ఇంచార్జ్‌గా ప్రకాశ్ రెడ్డి టికెట్ వ‌స్తే ఇబ్బంది అవుతుంద‌నే ఆలోచ‌న‌తో మ‌రో వ్యక్తికి టికెట్ వ‌స్తుంద‌నే మైండ్ గేమ్ అడుతున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, బీజేపీ మ‌ద్యే ఉండ‌టంతో.. కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ చేస్తుంద‌ని ఆరోపిస్తున్నార‌ు బీజేపీ నేతలు.ఇక ఇన్ని రోజులు క్యాడ‌ర్‌ను న‌మ్ముకున్న పార్టీలు ఇప్పుడు వ‌ర్గాల‌ను న‌మ్ముకోవ‌డం ఎల‌క్షన్ హీట్ క‌నిపించేలా చేస్తుంద‌ట. ఇప్పటికే ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అయిపోవ‌డంతో బీజేపీ అభ్యర్థి ఫైన‌ల్ అయితే పోటి ఇంకా ర‌స‌వ‌త్తరంగా ఉండ‌నుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ‌ర్గాలు, కులాలు అంటూ బోధన్ పాలిటిక్స్ ఇంకా ఎన్ని మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాలి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *