ప్రపంచ కప్ కోసం భారత జట్టు కొత్త శిక్షణా కిట్ను పొందింది. అక్టోబరు 5న, భారత ఆటగాళ్లు ఆరెంజ్ జెర్సీలో మూడు గంటలపాటు తీవ్రమైన ప్రాక్టీస్ చేశారు. జట్టు మొత్తం ప్రాక్టీస్లో లీనమైంది. ఈ సమయంలో భారత క్రికెట్ జట్టును చూసేందుకు ఓ వికలాంగ అభిమాని టిక్కెట్ కొనడానికి స్టేడియంకు చేరుకున్నాడు. ఈ అభిమాని విరాట్ కోహ్లి చిత్రాన్ని కూడా తన చేతితో గీసి, స్టేడియానికి తీసుకొచ్చాడు. అది అతనికి 40 గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందంట. కోహ్లితో పాటు టీమిండియా ఆటగాళ్లు కూడా ఈ అభిమానిని కలుసుకుని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
వీడియోలోని ఇంటర్వ్యూలో, శ్రీనివాస్ అనే అభిమాని మాట్లాడుతూ, నేను ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం టిక్కెట్లు కొనడానికి వచ్చాను. అయితే, నేను విరాట్ కోహ్లీని కలిశాను. 40 గంటల సమయం పట్టిన ఈ చిత్రాన్ని నా చేతులతో రూపొందించాను. కోహ్లీ నా దగ్గరకు వచ్చి దీనిపై నా ఆటోగ్రాఫ్ కావాలా అని అడిగాడు. తను ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. నేను తరతో ఫొటోలు కూడా తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
తను మైదానంలో దూకుడుగా ఉంటాడు. కానీ, మైదానం వెలుపల అతను చాలా దయగల, మంచి వ్యక్తి. ఆయన కవర్ డ్రైవ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన ఫ్యాన్ అయ్యాను. మేం అభిమానులు బహుశా జట్టుపై ఒత్తిడి తెస్తాం. కానీ, అది వారి పట్ల మనకున్న ప్రేమ మాత్రమే. మొత్తం జట్టుకు శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు.

