అయితే వీటిని ఎక్కడి నుండి అమలు చేస్తారని బీఆరెస్ చెబుతున్న వాటికి.. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తిస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు ఉదాహరణగా.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్లో 200 యూనిట్లలో ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ని కర్ణాటక, రాజస్థాన్లో అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మహాలక్ష్మి ద్వారా రూ. 2,500, కర్ణాటకలో, వరికి క్వింటాల్కి రూ. 500 బోనస్ ఛత్తిస్ఘడ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అక్కడ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే అన్ని గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నామని, తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఇక్కడ రైతుబంధు కొనసాగుతుంది దానిని మరో 5 వేలు పెంచాల్సి ఉంటుంది. తెలంగాణలో పెన్షన్ రూ. 3 వేలు ఇస్తున్నారు. దానిని మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవి ఇష్టారితిన ఇచ్చిన హామీలు కాదని దీనిపైన ఆర్థిక నిపుణులు అధ్యయనం చేసిన తరువాతనే వీటిని ప్రకటించిందని తెలంగాణ నేతలు చెబుతున్నారు.
అయితే ఇప్పడున్న పథకాలకు తోడు కాంగ్రెస్ తీసుకొచ్చే కొత్త పథకాలకు పెద్ద బడ్జెట్ ప్రభావం ఉండదని..ఇప్పటికే కాళేశ్వరం ,పాలమూరు లాంటి పథకాలు పూర్తావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం లో పెద్ద ప్రాజెక్టులు ఏమి ఉండకపోవడం కలిసి వచ్చే అంశం. రాష్ట్రంలో పెరుగుతున్న ఆదాయంతొ కొత్త పథకాలకు ఇబ్బందలు ఉండవని భావిస్తున్నారు. అయితే ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్ ని జనాల దగ్గరకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ వ్యూహత్మకంగా డోర్ టూ డోర్ ప్రచారాన్ని చేస్తుండడం.. తాము అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నామని జనాలను కాంగ్రెస్ మెప్పించే ప్రయత్నం చేస్తుంది. కాని కాంగ్రెస్ తమ ఆస్త్రాలుగా భావిస్తున్న ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఎంత వరకు విజయతిరాలకు చెరుస్తుందో చూడాలి మరి.