Titan Submersible: టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలుడుకు కారణం.. కెటాస్ట్రోపిక్ ఇంప్లోషన్ అంటే ఏమిటి?

Titan Submersible Implosion: అట్లాంటిక్ మహా సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్(Titanic) ఓడను చూసివచ్చేందుకు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు జల సమాధి అయిపోయారు. సముద్రం లోపలికి టైటాన్ సబ్‌మెర్సిబుల్ నౌకలో బయలుదేరిన నలుగురు కుబేరులతో పాటు పైలట్ చనిపోయినట్టు ఓషన్ గేట్(OceanGate) సంస్థ ప్రకటించింది. కనిపించకుండా పోయిన కొన్ని గంటలకే టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోయి ఉండొచ్చని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అమెరికా కోస్ట్ గార్డ్ వెల్లడించింది. సౌండ్ మానిటరింగ్ పరికరాల ద్వారా పేలుడుపై నిర్ధారణకు వచ్చినట్టు తెలిపింది. టైటాన్ సబ్‌మెర్సిబుల్ శిథిలాలు కొన్ని లభ్యయినట్టు వెల్లడించింది.

కెటాస్ట్రోపిక్ ఇంప్లోషన్ కారణంగానే టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోయి ఉంటుందని అమెరికా రక్షణ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అత్యంత వేగంతో సముద్రం అడుగున నీటి పీడనాన్ని(Water pressure) చీల్చుకుంటూ టైటాన్ సబ్‌మెర్సిబుల్ దూసుకెళుతుండగా ఏర్పడిన ఒత్తిడి కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపారు. సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం చదరపు అంగుళానికి 14.7 పౌండ్లు (psi)గా ఉంటుంది. టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రయాణించిన లోతులో నీటి పీడనం దాదాపు 6,000 psiగా ఉందని అంచనా. సైంటిఫిక్ అమెరికన్ గణాంకాల ప్రకారం చూస్తే.. సముద్ర గర్భంలో సంచరించే భారీ తెల్ల సొరచేప కాటు వేసినప్పుడు దాదాపు 4,000 psi శక్తిని కలిగి ఉంటుందట.

మిల్లీ సెకన్లలోనే బ్లాస్ట్: టైటాన్ సబ్‌మెర్సిబుల్ విస్సోటనానికి దానిలో తలెత్తిన లోపాలతో పాతు ఇతర సాంకేతిక కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అత్యధిక నీటి పీడనం వల్ల మిల్లీ సెకన్లలోనే టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. టైటాన్ సబ్‌మెర్సిబుల్ లో ప్రయాణించిన వారెవరూ బతికుండే అవకాశమే లేదని అంటున్నారు. టైటానిక్ ఓడ శిథిలాలు ఉత్తర అట్లాంటిక్ సముద్రగర్భంలో దాదాపు 3,800 మీటర్లు (12,400 అడుగులు) లోతులో ఉన్నాయని అంచనా.

Jagannath Temples: పూరీ తరహా భారత్‌లోని ప్రసిద్ధ జగన్నాథ దేవాలయాలివే.. ఆ దేశంలోనూ..

Jagannath Temples: జగన్నాథ ఆలయం అనే మాట వినగానే ఒడిశాలోని పూరి క్షేత్రమే అందరికీ గుర్తు వస్తుంది. కానీ పూరీ దేవాలయంతో పాటు దేశంలో కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. మైయన్మార్‌లోనూ ప్రసిద్ధ జగన్నాథ దేవాలయం ఉంది.

స్వామివారి రథాన్ని చూసిన భాగ్యం.. తాకిన ధన్యం.. అందుకే భక్తకోటి పురవీధుల్లోకి వేంచేసి స్వామివారికి స్వాగతం పలుకుతుంటారు. దేవదేవుల రథాలను లాగడానికి భక్తజనులు పోటీ పడుతుంటారు. దాదాపు పదిహేను లక్షల మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య.. జగన్నాథుడి వైభవం చూడతరమా.. స్వామివారి ఆలయం దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచా మందిరం వరకు ప్రతి ఏటా ఈ రథోత్సవం ఉంటుంది. కానీ మూడు కిలోమీటర్లలో జనాలు కిక్కిరిసిపోతారు.

గుండీచా మందిరం చేరుకున్నాక.. రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయాన్నే మేళతాళాలతో లోపలికి తీస్కెళ్తారు. అక్కడే స్వామి వారు ఏడు రోజుల పాటు ఉంటారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగుముఖం పడతారు. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ మర్నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతులిస్తారు. ద్వాదశి నాడు తిరిగి విగ్రహాలను ర్నతసింహాసనంపై ప్రతిష్టించడంతో ఈ యాత్ర పూర్తవుతుంది. స్వామిలేక చిన్నబోయిన పూరీ ఆలయం తిరిగి కళకళలాడటం మొదలవుతుంది.

సాక్షాత్తూ భగవంతుడే తన మందిరం వీడి.. పురవీధుల్లోని అందరినీ పలకరిస్తూ పులకరించే ఉత్సవ వేళ.. పూరీలో వైకుంఠమే దిగివచ్చిన అనుభూతి.
భక్తుల మోదమే తప్ప తనకు ఎలాంటి భేదమూ తెలియదని.. వైకుంఠనాధుడే వినయంగా విన్నవించుకునే విడ్డూరమిది.
ఆడినా.. పాడినా.. కలిసినా.. కలహించినా.. అన్నీ ఆ జగన్నాధునితోటే. ఇక్కడ వేదనలుంటాయి. వేదనలకు తోడు నివేదనలూ ఉంటాయి. అన్నింటినీ సాంత్వన పరిచే జగన్నాథ తత్వమూ ఉంటుంది. ఇంత అబ్బుర పరిచే రథోత్సవ విన్యాసాలు.. బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు.

పూరీలో రథయాత్రే కాదు.. ఆలయంలోనూ అడుగడుగునూ విశిష్టతలే.. పూరీ దేవాలయంలో మూల విరాట్‌ నుండి ప్రసాదం వరకు అంతా విశిష్టమే. దేవాలయాల్లో ఎక్కడ చూసినా మూలవిరాట్‌ విగ్రహాలు రాతితో ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు పంచలోహములతో తయారుచేస్తారు. కానీ ఈ విశిష్ట దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి. అదే విగ్రహాలు ఉత్సవమూర్తులుగా ఊరేగింపబడతాయి. ప్రసాదంగా ఇచ్చే అన్నం, పప్పు మొదలైనవి కుండల్లోనే వండుతారు. ఇతర దేవాలయాల్లో మాదిరిగా స్వామి తన దేవేరులతో కాకుండా.. సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు.

Ganesh Temples: దర్శనంతోనే దోషాలు తొలగించే ఈ 5 గణపతి ఆలయాలు.. జోడీ మేకర్‌గా ఫేమస్ ఈ గుడి

గణేశుడు జ్ఞానానికి అధిపతి. భారతదేశంలో గణేశుడికి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లోని గణేషుడిని దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ రోజు గణేశుడికి సంబంధించిన ప్రముఖ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, పూజ  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
హిందూ సనాతన ధర్మంలో ఆదిపూజ్యుడు విఘ్నలకధిపతి గణేశుడు. ఏ భక్తుడైనా ముందుగా గణపతిని నిష్టతో, భక్తితో పూజిస్తే శుభాలు జరుగుతాయి.. జీవితం సుఖమయం అవుతుంది. గణపతిని ఆరాధించడం ద్వారా జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం. జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆశించిన విజయం లభిస్తుంది. గణేశుడు జ్ఞానానికి అధిపతి. భారతదేశంలో గణేశుడికి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లోని గణేషుడిని దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ రోజు గణేశుడికి సంబంధించిన ప్రముఖ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, పూజ  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

సిద్ధి వినాయక దేవాలయం (ముంబై): ముంబయిలోని సిద్ధివినాయక దేవాలయం దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఒక భక్తుడు సిద్ధివినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత అతడిపై అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. గణపతి ఆశీస్సులతో ఎటువంటి సమస్యలైనా క్షణాల్లో పరిష్కారమవుతాయి. సిద్ధి వినాయక దేవాలయాన్ని సామాన్యులు మాత్రమే కాదు.. బాలీవుడ్ , టీవీ పరిశ్రమకు చెందిన పెద్ద ప్రముఖులు దర్శించుకుంటారు. తమ కోరికను గణపయ్యకు చెప్పుకోవడానికి చెప్పులు లేకుండా ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం దేశంలోని గొప్ప గణపతి దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారీ సంఖ్యలో భక్తులు కానుకలు సమర్పిస్తారు.

దగ్దుసేత్ హల్వాయి మందిర్ (పుణె): పూణేలోని సుందర్ నగర్‌లోని గణపతికి కి చెందిన దగ్దుసేత్ హల్వాయి ఆలయం అద్భుతాలతో నిండి ఉంది.  ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. ఈ ఆలయాన్ని దగ్దుసేత్ హల్వాయి నిర్మించాడని అప్పటి నుంచి ఈ పేరుతోనే ప్రసిద్ధిగాంచింది. బంగారంతో చేసిన గణపతి  విగ్రహాన్ని దర్శనంతోనే అన్ని బాధలు తొలగిపోయి కోరికలు కూడా తీరుతాయని నమ్మకం.

Balamurugan Statue: ఎత్తైన ఏకశిలా బాలమురుగన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు.. 2000 లీటర్ల పాలతో అభిషేకం

కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు, బలమురుగన్ వంటి పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా తమిళనాడులో బలమురుగన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో  40 అడుగుల ఎత్తు.. 180 టన్నుల బరువుతో కూడిన ఏకశిలా విగ్రహం భక్తులను కనువిందు చేసింది. 2వేల లీటర్ల పాలతో ఏకశిలా విగ్రహాన్ని అభిషేకించారు. శివ పార్వతుల తనయుడు తారకాసుర వధ కోసం జన్మించిన వాడు సుబ్రమణ్య స్వామి. మన దేశ వ్యాప్తంగానే కాదు మలేషియా వంటి దేశాల్లో కూడా సుబ్రహ్మణ్యుడి అనేక దేవాలయాలున్నాయి. కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు, బలమురుగన్ వంటి పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా తమిళనాడులో బాలమురుగన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో  40 అడుగుల ఎత్తు.. 180 టన్నుల బరువుతో కూడిన ఏకశిలా విగ్రహం భక్తులను కనువిందు చేసింది. 2వేల లీటర్ల పాలతో ఏకశిలా విగ్రహాన్ని అభిషేకించారు. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్ తాండలం దగ్గర 40 అడుగుల ఎత్తు.. 180 టన్నుల ఉన్న ఏకశిల విగ్రహం విశ్వరూప బాలమురుగన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాలకు సుమారు 2000 వేల లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. రత్నగిరి బాలమురుగన్ స్వామి నేతృత్వంలో 108 మంది మహిళలు పాల బిందెలు తీసుకుని వచ్చి మురుగన్ కు పాలాభిషేకం చేశారు.స్వామి వారికీ చేసిన పాలాభిషేకం భక్తులను కనువిందు చేసింది. కొండల నుంచి జాలు వారీ జలపాతాన్ని తలపిస్తూ.. మురుగన్ విగ్రహం మీద నుంచి పాల ధార జాలువారింది… ఇది చూసిన భక్తులు దైవంపై భక్తితో    ఆనందంతో పరవశించిపోయారు. అంతకుముందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు

Srikalahasti – Governing Council: శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఇవాళ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం పాలక మండలి ఛైర్మన్ శ్రీనివాసులు (Srinivasulu) వివరాలు తెలిపారు.ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న 4 దేవాలయాలకు కుంభాభిషేకం, 12 దేవాలయాలకు జీర్ణోదరణ పనులు చేయాలని నిర్ణయించామని శ్రీనివాసులు చెప్పారు. అలాగే, స్వర్ణముఖి నదిలో మురికి నీరు చేరకుండా అడ్డుకట్ట వేస్తామని అన్నారు. టీటీడీ తరహాలో ముక్కంటి ఆలయంలోనూ ఆశీర్వాద మండపం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అలయ పైభాగంలో లీకేజీల నివారణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు శ్రీనివాసులు చెప్పారు. ఇందుకోసం దాతల ద్వారా లేదంటే ఆలయ నిధులతో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అన్నదాన మండపాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు. ప్రొటోకాల్ దర్శనానికి ఒక ప్రత్యేక సమయం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు

Ayodhya: శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం.. దీపావళికి తొలి అంతస్తు సిద్ధం

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయం శరవేగంగా నిర్మాణమవుతోంది. సుదీర్ఘ వివాదాల తర్వాత 2020లో ప్రారంభమైన నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయి. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయంలో మొదటి దశ.. తొలి అంతస్తు (First Floor) ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి సిద్ధం కానుంది. వచ్చే జనవరి ఫస్ట్ కల్లా మిగిలిన పనులు పూర్తిచేసి సంక్రాంతి (Sankranti) నాటికి గర్భగుడి (Garba gudi)లో దేవుడిని ప్రతిష్టించాలని పట్టుదలగా ఉంది రామాలయ ట్రస్ట్ (Ramalay Trust).

దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చేఏడాది జనవరి ఫస్ట్ నాటికి నిర్మాణం పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులను పరుగు తీయిస్తోంది రామజన్మభూమి తీర్థ ట్రస్ట్. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయంలో మొదటి అంతస్తు చాలా వరకు పూర్తయింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి తొలి అంతస్తు నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది ఆలయ నిర్మాణ సమితి. దీపావళికి తొలి అంతస్తు సిద్ధం చేసి.. మిగిలిన పనులు డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తవడం ఖాయం.

దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాలయ నిర్మాణానికి అధికార బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది. 2024 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని కోరుకుంటున్న బీజేపీ.. రామాలయ నిర్మాణం పూర్తిచేశామని చెప్పి ఓట్లు అడగాలని అనుకుంటోంది. అయోధ్యలో రామాలయం నిర్మాణం బీజేపీ ప్రధాన అజెండా.. ఆ పార్టీ స్థాపించిన నుంచి ఇదే ప్రధాన అజెండాగా పనిచేసింది. ఎన్నో పోరాటాలు చేసింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయోధ్యలో ఆలయ నిర్మాణంపై కదలిక వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కారం కాని వివాదాలను సంప్రదింపులతో కొలిక్కి తెచ్చింది. వివాదాలన్నీ ముగియడంతో 2020 ఆగస్టులో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ (PM Modi).

అందరిలో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న రామాలయం ఎలా ఉండబోతుందోననే చర్చ జరుగుతోంది. రామాలయ నిర్మాణంపై సమాచారం బయటకు వచ్చిన ప్రతిసారి నిర్మాణ విశిష్టతలు.. విశేషాలపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు భక్తులు. రాజస్థాన్ నుంచి ప్రత్యేక పాలరాతిని తీసుకువచ్చి ఆలయ గోడలను రమణీయంగా తీర్చిదిద్దుతున్నారు శిల్పులు. ఇక నేపాల్ నుంచి తెచ్చిన శాలగ్రామంతో దేవతా విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఒకవైపు దేవుడి విగ్రహాలు.. మరోవైపు ఆలయ నిర్మాణాలు చకచక సాగుతుండటంతో.. అయోధ్యలో సందడి కనిపిస్తోంది. దీపావళి నాటికి తొలి అంతస్తు పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది రామ జన్మభూమి ట్రస్ట్.

Tirumala : శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల.. రూ. 861 కోట్ల విరాళాలు

Srivani Trust Donations : తిరుమల శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల అయింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్ట్ కు ఇప్పటివరకు రూ. 861 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపారు. బ్యాంకుల్లో రూ. 603 కోట్లు డిపాజిట్ చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు. ఆలయాల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.120 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.

ఇచ్చిన విరాళాలకు రసీదులు ఇస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.దళారీ వ్యవస్థను అరికట్టేందుకే శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేశామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 70 మంది దళారులను అరెస్టు చేసి, 214 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.

PM Modi in US Congress: అమెరికన్ కాన్సులేట్‌లో మోదీ క్రేజ్ నెక్ట్స్ లెవల్.. వీడియో చూస్తే అవాక్కవుతారు..

అమెరికన్‌ కాంగ్రెస్ కాన్సులేట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మరోసారి అమెరికన్‌ కాంగ్రెస్‌ కాన్సులేట్‌ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం.. భారతీయులకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రధాని మోదీ. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్‌-అమెరికా దేశాలు ప్రతీక అన్నారు. అమెరికన్‌ కాంగ్రెస్ కాన్సులేట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మరోసారి అమెరికన్‌ కాంగ్రెస్‌ కాన్సులేట్‌ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం.. భారతీయులకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రధాని మోదీ. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్‌-అమెరికా దేశాలు ప్రతీక అన్నారు. అమెరికాలో 40 లక్షల మంది ఎన్ఆర్‌ఐలు ఉన్నారన్న ఆయన.. ప్రవాస భారతీయులను చూసి గర్వంగా ఉందన్నారు.

ప్రపంచశాంతి కోసం భారత్‌-అమెరికా దేశాలు కృషి చేస్తునట్టు తెలిపారు ప్రధాని మోదీ. భారత్ అభివృద్ధి ప్రపంచ అభివృద్ధి అన్నారు పీఎం. మోదీ తనకు మంచి మిత్రుడని అన్నారు బైడెన్‌. భారత్‌-అమెరికా మైత్రీబంధం 21వ శతాబ్ధానికి చాలా ముఖ్యమన్నారు. భారత్‌ – అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలు ప్రపంచానికి కూడా చాలా కీలకం అన్నారు బైడెన్. ఇవి తరతరాల పాటు నిలిచిఉంటాయన్నారాయన.ఇక ఈ వైట్‌హౌస్‌ విందుకు మెక్రోసాఫ్ట్ CEO సుందర్‌ పిచాయ్‌, గూగుల్‌ CEO సత్య నాదేళ్ల, Adobe’s CEO శాంతను నారాయణ హాజరైయ్యారు.. ఈ విందులో భారతదేశానికి చెందిన ప్రముఖులతో పాటు బడా వ్యపారవేత్తలు, టెక్ దిగ్గజాలు, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో కలిసి మోదీ విందును ఆశ్వాదించారు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలు ఈ విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అమూల్ బేబీ సృష్టికర్త కన్నుమూత.. ప్రముఖుల సంతాపం!

సాధారణంగా ఏ ఉత్పత్తి అయినా ప్రజల వద్దకు చేరాలంటే దానికి బలమైన పబ్లిసిటి ఉండాలి. పబ్లిసిటీ అనేది ఇప్పటిది కాదు.. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపార రంగానికి చెందిన వారు తాము ఉత్పత్తి చేస్తున్న ప్రొడక్ట్స్ కి రక రకాలుగా యాడ్స్ రూపకల్పన చేసి ప్రజలకు తెలిసేలా చేస్తుంటారు. కొంతమంది పబ్లిసిటీని చాలా క్రియేటీవ్ గా చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అలా క్రియేటీవ్ గా రూపొంది యాడ్స్ లో ఒకటి ‘అమూల్’ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అమూల్‌ గర్ల్‌ను కంపెనీ నేటికీ కొనసాగుతున్నది. తాజాగా అమూల్ గర్ల్ ‘అట్టర్లీ బటర్లీ’ కార్టూన్‌ సృష్టికర్త ప్రఖ్యాత కార్టూనిస్ట్ సిల్వెస్టర్‌ డాచున్హా కన్నుమూశారు.

పాల ఉత్పత్తులో ఎంతో ప్రసిద్దిగాంచిన అమూల్ బ్రాండ్ పేరు చెప్పగానే ‘అమూల్ గర్ల్’ గుర్తుకు వస్తుంది. ఎరుపు రంగు చుక్కల ఫ్రాక్‌లో కనిపించే చిన్నారి ఎంతో ఆకర్షణగా అనిపిస్తుంది.. ఈ కారణంగా అమూల్ బ్రాండ్‌కు ఎంతో కొత్త గుర్తింపు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని అమూల్ బ్రాండ్ కి అమూల్ గర్ల్ కార్టూన్ సృష్టించారు ప్రముఖ కార్టూనిస్ట్ సిల్వెస్టర్ డకున్హా. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆయన జూన్ 20 ర ముంబైలో తుదిశ్వాస విడిచారు. ‘అట్టర్లీ-బటర్లీ’ ప్రచారంతో 1966లో తొలిసారిగా ఆయన అమూల్‌ గర్ల్‌ కార్టూన్‌ను ల్వెస్టర్ డకున్హా గీశాడు. ఆనాటి నుంచి దాని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఆర్ట్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతూ వచ్చారు. ఒకరకంగా ఈ కార్టూన్ అమూల్‌ ఉత్పత్తుల అమ్మకాల పెరగడానికి దోహదపడింది.

సిల్వెస్టర్‌ డాకున్హా తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన, జనరంజకమైన యాడ్స్ ని రూపొందించారు. యాడ్స్ రూపొందించడంలో ఆయన క్రియేటివీటీ చాలా గొప్పగా ఉంటుందని అందరూ అంటుంటారు. ఆయన చనిపోయే వరకు డాకున్హా కమ్యూనికేషన్స్ కంపెనీకి చైర్మన్ గా కొనసాగుతూ వచ్చారు. మంగళవారం ఆయన కన్నుమూసినట్లు గుజరాత్ కో ఆపరేటీవ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయెన్ మెహతా ప్రకటించారు. సిల్వెస్టర్ డకున్హా మరణంతో ఆయన తనయుడు రాహుల్ కంపెనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దిగ్గజ కార్టూనిస్ట్ సిల్వెస్టర్‌ డాకున్హా మృతి పట్ల వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

Udayanidhi Stalin: సీఎం కుమారుడు ఉదయనిధి ఆసక్తికర వ్యాఖ్యలు

చెన్నై: తన తాత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అడుగుజాడల్లోనే నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) అన్నారు. నాగపట్టినంలో గురువారం ఉదయం కరుణానిధి శతజయంతి వేడుకలలో భాగంగా ఏర్పాటైన సభలో నిరుపేద విద్యార్థులకు ఉపకారవేతనాలు, విద్యా ఉపకరణాలు, మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ… దేశంలో అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలుగా పేరు గడించిన సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ పాలకుల చేతుల్లో కీలుబొమ్మల్లా మారాయని ఆరోపించారు. అన్నాడీఎంకే మాజీ మంత్రులు విజయభాస్కర్‌, ఎస్పీ వేలుమణి నివాసగృహాలు, కార్యాలయాలు, వారి అనుచరుల నివాసగృహాల్లో ఐటీ దాడులు ముమ్మరంగా జరిగాయని, అయితే బీజేపీ ప్రభుత్వం ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. బీజేపీ(BJP) పాలకులు ఎన్ని అవరోధాలు కల్పించినా, తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసినా డీఎంకే చెక్కుచెదరని, ప్రజల మద్దతు తమ పార్టీకే ఉందని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను ఉసికొల్పినా డీఎంకే సాధారణ కార్యకర్త కూడా భయపడే ప్రసక్తి లేదని అన్నారు. తాను అన్నాదురై, పెరియార్‌ బోధనలను ఒంటపట్టిచుకున్నానని, ఆ ఇరువురి బాటలో పయనించిన తన తాత అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. ఎలాంటి బెదిరింపులకు భయపడనని, అవసరమైతే తాత మారురూపంలా వ్యవహరించేందుకు వెనుకాడనని ఉదయనిధి పేర్కొన్నారు.

1 9 10 11 12 13 19