ICC World Cup 2023: టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. ప్రాక్టీస్‌లో గాయపడిన స్టార్‌ ప్లేయర్‌..

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్లు వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచింది. ఏడో మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేయడంతో టీమిండియా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లను కూడా టీమిండియా ఓడించింది. టోర్నీలో లీగ్ రౌండ్‌లో టీమిండియా ఆఖరి, తొమ్మిదో ఓవరాల్ మ్యాచ్ ఆదివారం (నవంబర్‌ 12) నెదర్లాండ్స్‌తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌, నాకౌట్‌ గేమ్స్‌కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ నెదర్లాండ్స్‌తో తమ మ్యాచ్‌కు ముందు బుధవారం (నవంబర్ 8) టీమ్‌ ఇండియా ప్రత్యామ్నాయ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఈ ప్రాక్టీస్‌లో బుమ్రా బాగానే బౌలింగ్ చేశాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లోనే బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తోన్న యువ వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. బంతి బలంగా ఇషాన్ పొట్టను తాకింది. దీంతో ఇషాన్‌ మైదానంలో పడిపోయాడు. అయితే ఇషాన్‌కు తగిలిన గాయం తీవ్రమైనది కాదని తెలుస్తోంది. ఇక గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మొత్తం టోర్నమెంట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ తమ చివరి మ్యాచ్ నెదర్లాండ్‌తో ఆడనుంది. ఇందుకోసం ఆదివారం దక్షిణాఫ్రికాపై గెలిచిన అనంతరం సోమవారం సాయంత్రం కోల్‌కతా నుంచి నేరుగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు టీమిండియా ప్లేయర్స్‌. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది.

వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

World Cup 2023: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. మరో రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్..

Team India News: స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా హెల్త్ కండీషన్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. గత మ్యాచ్‌లో ఆడలేకపోయిన ఈ టీమిండియా ఆల్ రౌండర్ చీలమండ గాయం నుంచి కోలుకోలేదు. దీంతో తదుపరి రెండు ప్రపంచ కప్ మ్యాచ్‌లకు దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది. అక్టోబరు 19న పూణేలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన బౌలింగ్‌లో బంతిని ఆపే క్రమంలో చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత అక్టోబరు 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో ఆడలేకపోయాడు. బరోడాకు చెందిన ఈ ఆటగాడు గాయం నుంచి కోలుకునేందుకు సోమవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లాడు. హార్దిక్ పాండ్యా చికిత్స పొందుతున్నాడని NCA వర్గాలు తెలిపాయి. హార్దిక్ పాండ్యా ఎడమ చీలమండలో వాపు గణనీయంగా తగ్గింది. అయితే అతను ఈ వారం చివరి నాటికి బౌలింగ్ చేయడం ప్రారంభిస్తాడు. అయితే, కోలుకోవడానికి చాలా సమయం కావాల్సి వస్తుంది.
తదుపరి రెండు మ్యాచ్‌ల నుంచి ఔట్..
ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం ద్వారా సెమీ-ఫైనల్‌కు చేరుకునే బలమైన స్థితిలో భారత్ నిలిచింది. కాబట్టి హార్దిక్ పాండ్యాకు తదుపరి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. ఇది అతనికి నాకౌట్‌లకు ముందు పూర్తిగా కోలుకునే అవకాశాన్ని ఇస్తుంది. హార్దిక్ పాండ్యా తీవ్రమైన బెణుకుతో బాధపడుతున్నాడు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ఫ్రాక్చర్ జరగలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బీసీసీఐ వైద్య బృందం గరిష్ట జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వచ్చే రెండు మూడు మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. అతను నాకౌట్‌కు పూర్తి ఫిట్‌గా ఉండాలని జట్టు కోరుతోంది.
లేటెస్ట్ అప్‌డేట్..
హార్దిక్ పాండ్యాకు గురువారం ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని, దీని ఆధారంగా అతడు తిరిగి వచ్చే తేదీని బీసీసీఐ వైద్య బృందం నిర్ణయిస్తుందని పేర్కొంది. ఈ సమయంలో అతని బౌలింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. పూర్తి శక్తితో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను తన ఎడమ కాలు చీలమండతో అసౌకర్యంగా ఉన్నాడో లేదో చూడవచ్చు. భారత్ తన తదుపరి మ్యాచ్‌ని డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో అక్టోబర్ 29న లక్నోలో, శ్రీలంకతో నవంబర్ 2న ముంబైలో ఆడాల్సి ఉంది.
బ్యాటింగ్ కూడా బలంగా ఉంది..
హార్దిక్ పాండ్యా లేకపోవడంతో న్యూజిలాండ్‌తో జరిగిన ప్లేయింగ్ ఎలెవన్‌లో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీలకు చోటు దక్కింది. మహ్మద్ షమీ టోర్నమెంట్‌లో తన మొదటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే లక్నో పిచ్ స్లో బౌలర్‌లకు సహాయపడే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో, రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించవచ్చు. ఇదే జరిగితే బ్యాటింగ్ కూడా బలంగా ఉంటుంది. ఎందుకంటే అశ్విన్ ఎనిమిదో నంబర్‌లో ఆడతాడు.

ENG vs SL: ఇరు జట్లకు చావో రేవో.. మరికాసేపట్లో శ్రీలంక వర్సెస్‌ ఇంగ్లండ్‌ కీలక మ్యాచ్‌.. గత రికార్డులివే

ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ 2023లో ఇవాళ (అక్టోబర్‌ 26) ఇంగ్లండ్‌, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ హై వోల్టేజీ మ్యాచ్‌ ఇరు జట్లకు చావో రేవో లాంటిది. ఓడిపోతే ఇరు జట్లు దాదాపు ఇంటికే. కాబట్టి విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా వరల్డ్‌కప్‌లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ ఆటతీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడి, ఒక్కటి మాత్రమే గెలిచింది. సెమీస్‌లోకి ప్రవేశించాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లిష్‌ జట్టు విజయం సాధించాలి. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ సమన్వయంతో కూడిన ప్రదర్శన ఇవ్వడంలో ఇంగ్లండ్‌ జట్టు బాగా ఇబ్బంది పడుతోంది. అటు కెప్టెన్‌గానూ, ఆటగాడిగానూ బట్లర్ ఫెయిలవుతున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 170 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో చేతులెత్తేసి ప్రత్యర్థికి ఏకంగా 399 పరుగులు ఇచ్చారు. ఇలా అన్ని విభాగాల్లోనూ ఇంగ్లిష్‌ జట్టు విఫలమవుతుండడం వారి ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది.
లంకది అదే పరిస్థితి..
మరోవైపు శ్రీలంకది అదే పరిస్థితి. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచి మూడింటిలో ఓడిపోయారు. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఓడిపోతే లంకేయులు కూడా దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. ఆసియాకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన శ్రీలంక.. ప్రపంచకప్‌లో మాత్రం చతికిలపడింది. దీనికి తోడు దసున్ షనక, హసరంగా వంటి స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం ఆ జట్టు ఆటతీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయితే నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆ జట్టు భారీ విజయం సాధించడం కాస్త రిలీఫ్‌. అయితే బౌలింగ్‌లో లంకేయులు మరింత మెరుగుపడాల్సి ఉంది. మరి ఈరోజు ఆంగ్లేయులపై ఎలా రాణిస్తారో చూడాలి.
బ్యాటర్లకు స్వర్గధామమే..
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 367 పరుగులు చేసింది. ఈ పిచ్ నుంచి స్పిన్నర్లకు కొంత సహాయం లభించినప్పటికీ, మైదానం చిన్నది కావడంతో బౌండరీల వర్షం కురిసే అవకాశం ఉంది. బెంగుళూరులో 31 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతతో ఎండ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాలు కురిసే అవకాశం లేదు.
ఇంగ్లండ్‌ దే ఆధిపత్యం..
ఇక గత రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇంగ్లండ్, శ్రీలంక జట్లు 78 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 38 మ్యాచ్‌లు గెలవగా, శ్రీలంక 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

World Cup 2023: ప్రపంచకప్ చరిత్రలోనే ఆస్ట్రేలియా భారీ రికార్డ్..

ODI World Cup 2023: న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం ఆస్ట్రేలియా చారిత్రాత్మక ఫీట్ సాధించింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 309 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 309 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టైనా సాధించిన పరుగుల పరంగా అతిపెద్ద విజయంగా ఇది ప్రపంచ రికార్డుగా నిలిచింది.
ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా గొప్ప రికార్డ్..
48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా తన పాత రికార్డును తానే బ్రేక్ చేసింది. అంతకుముందు ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించిన రికార్డు ఆస్ట్రేలియాదే. మార్చి 2015లో జరిగిన ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ఈ జాబితాలో భారత్ పేరు మూడో స్థానంలో నిలిచింది. మార్చి 2007లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ 257 పరుగుల తేడాతో బెర్ముడాను ఓడించింది. దక్షిణాఫ్రికా 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను కూడా ఇదే విధమైన పరుగుల తేడాతో ఓడించింది.
ODI ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయం (పరుగుల పరంగా)
1. ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ – ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో గెలిచింది (2023 ప్రపంచ కప్)
2. ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో గెలిచింది (2015 ప్రపంచ కప్)
3.భారత్ vs బెర్ముడా – భారత్ 257 పరుగుల తేడాతో గెలిచింది (2007 ప్రపంచ కప్)
4. దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – దక్షిణాఫ్రికా 257 పరుగులతో గెలిచింది (2015 ప్రపంచ కప్)
5. ఆస్ట్రేలియా vs నమీబియా – ఆస్ట్రేలియా 256 పరుగులతో గెలిచింది (2003 ప్రపంచ కప్)

వన్డేల్లో రెండో అతిపెద్ద విజయం..
309 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించడం వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయం. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన రికార్డును భారత్ సొంతం చేసుకుంది. 2023 జనవరిలో తిరువనంతపురంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 317 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది.

అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం (పరుగుల పరంగా)
1. భారత్ vs శ్రీలంక – భారత్ 317 పరుగుల తేడాతో గెలిచింది (2023)
2. ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ – ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో గెలిచింది (2023)
3. జింబాబ్వే vs UAE – జింబాబ్వే 304 పరుగుల తేడాతో గెలిచింది (2023)
4. న్యూజిలాండ్ vs ఐర్లాండ్ – న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో గెలిచింది (2008)
5. ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో గెలిచింది (2015)

World Cup 2023: రోజూ 8 కిలోల మటన్ అయితే తింటారా? పాక్‌ క్రికెటర్లను దారుణంగా తిట్టేసిన మాజీ కెప్టెన్‌

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా మారింది. భారీ ఆశలు, అంచనాలతో మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన ఆ జట్టు వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. భారత్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో ఓడిపోయిన ఆ జట్టు సోమవారం క్రికెట్‌ బేబీస్‌గా పేరున్న అఫ్గనిస్తాన్‌ చేతిలో పరాజయం పాలైంది. అది కూడా చిత్తు చిత్తుగా. ఈ ఓటమిని పాక్‌ క్రికెట్‌ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ క్రికెటర్ల పెర్ఫామెన్స్‌ ఏ మాత్రం బాగోలేదంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ ఆటగాళ్లు కూడా పాక్‌ క్రికెటర్లను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక పాకిస్తాన్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ వసీమ్‌ అక్రమ్‌ ఒక అడుగు ముందుకేసి పాక్‌ క్రికెటర్ల ఫిట్‌నెస్‌ గురించి బూతులు తిట్లాడు. ఒక టీవీ షోలో భాగంగా వసీమ్‌ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఫిట్ నెస్ లెవెల్స్ సరి చూసుకుంటున్నారా?
‘ఇది నిజంగా పాక్‌ క్రికెట్‌కు తలవంపులే. 280-290 లాంటి భారీ స్కోరును కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించడం చాలా పెద్ద విషయం. పిచ్‌ సంగతి పక్కన పెడితే.. ఓసారి పాక్‌ ఆటగాళ్ల ఫీల్డింగ్‌ చూడండి. వీరి ఫిట్‌నెస్‌ లెవెల్స్‌ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. ఫిట్‌నెస్‌ లేని క్రికెటర్ల పేర్లను ప్రస్తావిస్తే వారికి నచ్చదు కానీ.. వీళ్లు రోజుకు 8 కిలోల చొప్పున మటన్‌ తింటున్నట్లు ఉంది. ఇప్పుడు వాళ్లు దేశం తరపున క్రికెట్ ఆడేందుకు బరిలోకి దిగారు. ఇందుకు పారితోషకం కూడా తీసుకుంటున్నారు. ఒక దేశం తరఫున ప్రాతినిథ్యం వహించేటప్పుడు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉండాలి. ప్రస్తుతం మనం ఏ స్థితికి చేరుకున్నామంటే గెలుపు కోసం దేవుడిని ప్రార్థించాల్సి వస్తోంది. అది జరిగితే బాగుండు.. ఆ జట్టు ఓడిపోతే బాగుండు. సెమీస్‌కు చేరొచ్చంటూ మాట్లాడుతున్నాం’ అంటూ మాట్లాడాల్సిన కర్మ వచ్చింది’ అంటూ పాక్‌ క్రికెటర్లపై పరుష పదజాలంతో మండి పడ్డారు అక్రమ్‌. ప్రస్తుతం ఇతని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

World Cup 2023: ఉయ్యాలో ఉయ్యాల !! సూపర్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీనీ కుమారుడికి అంకితమిచ్చిన మ్యాక్స్‌వెల్‌

వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు మళ్లీ దూకుడు చూపిస్తోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కంగారూ టీమ్‌ మెగా క్రికెట్‌ టోర్నీలో మొదట తడబడింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే మళ్లీ తనదైన ఆటతీరును ప్రదర్శిస్తూ సెమీస్‌కు చేరువైంది. తాజాగా పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసీస్‌ జట్టు బుధవారం నెదర్లాండ్స్‌పై అద్భుత విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 309 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది కంగారూ టీమ్‌. ప్రపంచకప్‌లో పరుగుల పరంగా ఏజట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం. ఇక చాలా రోజుల తర్వాత మ్యాక్స్‌వెల్‌ తన బ్యాటింగ్‌ పవర్‌ను చూపించాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన మ్యాక్సీ ఓవరాల్‌గా 4 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇది ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ. ఇదే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ 49 బంతుల్లో సెంచరీ రికార్డును మ్యాక్సీ బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో తన సూపర్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీని మ్యాక్స్‌వెల్‌ ఇటీవలే పుట్టిన తన కుమారుడికి అంకితమిచ్చాడు. దీనికి సంకేతంగా సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఊయల ఊపుతూ సంజ్ఞలు చేశాడీ స్టార్‌ ఆల్‌రౌండర్‌. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే మ్యాక్స్‌వెల్‌ తమిళనాడుకు చెందిన విని రామన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2022, మార్చి 27న వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. భారతీయ సంప్రదాయాలకు ఎంతో గౌరమిచ్చే మ్యాక్సీ వినీ రామన్‌ను కూడా తమిళ ఆచార పద్ధతుల్లోనే వినీ రామన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కాడు. తమ ప్రేమ బంధానికి గుర్తుగా మే నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మ్యాక్సీదంపతులు. జులైలో వినీ రామన్‌కు హిందూ సంప్రదాయ ప్రకారం సీమంతం కూడా జరిపారు కుటుంబ సభ్యులు. ఇక సెప్టెంబర్ 11న వినీ రామన్‌ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఇటీవలే తమ కుమారుడికి లోగన్ మ్యాక్స్‌వెల్‌ అని నామకరణం చేశారు. కాగా ఇదే మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్ కూడా సెంచరీ సాధించాడు. కేవలం 93 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు.

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో తొలి మ్యాచ్‌లో సెంచరీల వరద.. లిస్టులో భారత్ నుంచి ఇద్దరు.. ఎవరో తెలుసా?

World Cup 2023: ప్రపంచ కప్‌లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడికైనా ఇది పెద్ద అవకాశం. ప్రతి ఆటగాడు తన మంచి ప్రదర్శన ఆధారంగా ప్రపంచ కప్‌లో తన దేశ జట్టులో భాగం కావాలని ప్రయత్నిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక బ్యాట్స్‌మన్ దృక్కోణంలో 50 ఓవర్ల టోర్నమెంట్‌లో సెంచరీ చేయడం కూడా చాలా గౌరవప్రదమైన విషయం. టోర్నమెంట్‌లోని ఏ ఎడిషన్‌లోనైనా చేసిన తొలి సెంచరీతో దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైన ప్రపంచ కప్ 2023లో ఇదే విధమైన ఫీట్ చేశాడు. ఇంతకు ముందు ఇలాంటి ఫీట్ చేసిన దిగ్గజాల జాబితాలో అతని పేరు చేరింది.

డెవాన్ కాన్వే తన దేశం తరపున తొలిసారి వన్డే ప్రపంచ కప్ ఆడుతున్నాడు. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి కేవలం 83 బంతుల్లో తన కెరీర్‌లో ఐదో సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ సెంచరీ తొలి సెంచరీ కూడా.ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎడిషన్‌లోనూ పలు దేశాల ఆటగాళ్లు ఆయా ఎడిషన్‌లో తొలి సెంచరీ సాధించిన ఘనత సాధించారు. ఈ జాబితాలో భారత జట్టులోని ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ కూడా ఉన్నారు.

ODI ప్రపంచకప్ యొక్క ప్రతి ఎడిషన్‌లో సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితా..

1975 ప్రపంచ కప్ – డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్): 137 vs భారతదేశం

1979 ప్రపంచ కప్ – గోర్డాన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్): 106* vs భారతదేశం

1983 ప్రపంచ కప్ – అలాన్ లాంబ్ (ఇంగ్లండ్): 102 vs న్యూజిలాండ్

1987 ప్రపంచ కప్ – జావేద్ మియాందాద్ (పాకిస్తాన్): 103 vs శ్రీలంక

1992 ప్రపంచ కప్ – మార్టిన్ క్రో (న్యూజిలాండ్): 100* vs ఆస్ట్రేలియా

1996 ప్రపంచ కప్ – నాథన్ ఆస్టిల్ (న్యూజిలాండ్) :101 vs ఇంగ్లాండ్

1999 ప్రపంచ కప్ – సచిన్ టెండూల్కర్ (భారతదేశం): 140* vs కెన్యా

2003 ప్రపంచ కప్ – బ్రియాన్ లారా (వెస్టిండీస్): 116 vs దక్షిణాఫ్రికా

2007 ప్రపంచ కప్ – రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): 113 vs స్కాట్లాండ్

2011 ప్రపంచ కప్ – వీరేంద్ర సెహ్వాగ్ (భారతదేశం): 175 vs బంగ్లాదేశ్

2015 ప్రపంచ కప్ – ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా): 135 vs ఇంగ్లాండ్

2019 ప్రపంచ కప్ – జో రూట్ (ఇంగ్లండ్): 107 vs పాకిస్థాన్

2023 ప్రపంచ కప్ – డెవాన్ కాన్వే (న్యూజిలాండ్): 152* vs ఇంగ్లాండ్

Asian Games : ఆసియా క్రీడ‌ల్లో స్వ‌ర్ణం గెలిచిన భార‌త పురుషుల క్రికెట్ జ‌ట్టు

Asian Games 2023 : చైనా వేదిక‌గా జ‌రుగుతున్న‌ ఆసియా క్రీడ‌ల్లో భార‌త పురుషుల క్రికెట్ జ‌ట్టు స్వ‌ర్ణం గెలిచింది. అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. దీంతో సీడింగ్ ఆధారంగా టీమ్ఇండియా గోల్డ్ మెడ‌ల్ అందుకుంది. ఆసియా క్రీడ‌ల్లో భార‌త పురుషుల క్రికెట్ జ‌ట్టు టాప్ సీడింగ్‌తో బ‌రిలోకి దిగింది. ఈ క్రీడ‌ల్లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు కూడా స్వ‌ర్ణం గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే.

ఫైన‌ల్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. భార‌త బౌల‌ర్ల ధాటికి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 52 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. షాహిదుల్లా కమల్ (49 నాటౌట్; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), గుల్బాదిన్ నైబ్ (27 నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు) జ‌ట్టును ఆదుకున్నారు. వీరిద్ద‌రు భార‌త బౌల‌ర్లను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని ప‌రుగులు సాధించారు. అభేధ్య‌మైన ఐదో వికెట్‌కు 60 ప‌రుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు.

అయితే.. 18.2 ఓవ‌ర్లకి పూర్తి అవ‌గానే వ‌ర్షం ఆరంభమైంది. అప్ప‌టికి ఆఫ్గానిస్తాన్ స్కోరు 112/5. డ‌క్ వ‌ర్త్ ప‌ద్ద‌తిలో విజేత‌ను నిర్ణ‌యించాల‌న్నా ఇరు జ‌ట్లు క‌నీసం 5 ఓవ‌ర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎంత‌సేప‌టికీ వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. ఆసియా క్రీడ‌ల్లోని నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏదైన మ్యాచ్ ర‌ద్దు అయితే.. ఇరు జ‌ట్ల‌లో టాప్ సీడింగ్ ఉన్న జ‌ట్టును విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. భార‌త్ టాప్ సీడింగ్‌తో బ‌రిలోకి దిగ‌డంతో టీమ్ఇండియా విజేత‌గా నిల‌వ‌డంతో స్వ‌ర్ణ ప‌త‌కం ల‌భించింది.

Video: ‘ప్రత్యేక అభిమానిని’ కలుసుకున్న విరాట్ కోహ్లి.. గుండెలను పిండేసే వీడియో షేర్ చేసిన బీసీసీఐ..

CWC 2023: ఈ ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023)లో విరాట్ కోహ్లీపై భారత జట్టుతోపాటు అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి కింగ్ కోహ్లీ (Virat Kohli) తన వన్డే కెరీర్‌లో నాలుగో ప్రపంచకప్‌ను ఆడుతున్నాడు. టోర్నీ కోసం కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. టీమ్ ఇండియా (Team India) తొలి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో (IND vs AUS) జరగనుంది. దీని కోసం ఇరు జట్లు చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇంతలో, కోహ్లీ మ్యాచ్ ఆడకుండానే తన ప్రత్యేక అభిమానులలో ఒకరి హృదయాన్ని గెలుచుకున్నాడు.

ప్రపంచ కప్ కోసం భారత జట్టు కొత్త శిక్షణా కిట్‌ను పొందింది. అక్టోబరు 5న, భారత ఆటగాళ్లు ఆరెంజ్ జెర్సీలో మూడు గంటలపాటు తీవ్రమైన ప్రాక్టీస్ చేశారు. జట్టు మొత్తం ప్రాక్టీస్‌లో లీనమైంది. ఈ సమయంలో భారత క్రికెట్ జట్టును చూసేందుకు ఓ వికలాంగ అభిమాని టిక్కెట్ కొనడానికి స్టేడియంకు చేరుకున్నాడు. ఈ అభిమాని విరాట్ కోహ్లి చిత్రాన్ని కూడా తన చేతితో గీసి, స్టేడియానికి తీసుకొచ్చాడు. అది అతనికి 40 గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందంట. కోహ్లితో పాటు టీమిండియా ఆటగాళ్లు కూడా ఈ అభిమానిని కలుసుకుని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

కోహ్లి కవర్ డ్రైవ్ నన్ను అభిమానిని చేసింది – శ్రీనివాస్

వీడియోలోని ఇంటర్వ్యూలో, శ్రీనివాస్ అనే అభిమాని మాట్లాడుతూ, నేను ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం టిక్కెట్లు కొనడానికి వచ్చాను. అయితే, నేను విరాట్ కోహ్లీని కలిశాను. 40 గంటల సమయం పట్టిన ఈ చిత్రాన్ని నా చేతులతో రూపొందించాను. కోహ్లీ నా దగ్గరకు వచ్చి దీనిపై నా ఆటోగ్రాఫ్ కావాలా అని అడిగాడు. తను ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. నేను తరతో ఫొటోలు కూడా తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

తను మైదానంలో దూకుడుగా ఉంటాడు. కానీ, మైదానం వెలుపల అతను చాలా దయగల, మంచి వ్యక్తి. ఆయన కవర్ డ్రైవ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన ఫ్యాన్ అయ్యాను. మేం అభిమానులు బహుశా జట్టుపై ఒత్తిడి తెస్తాం. కానీ, అది వారి పట్ల మనకున్న ప్రేమ మాత్రమే. మొత్తం జట్టుకు శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు.

World Cup 2023 RSA Vs SL ODI : నిల‌క‌డ‌గా ఆడుతున్న ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు, డుసెన్‌, డికాక్ హాఫ్ సెంచ‌రీలు

క్వింట‌న్ డికాక్ హాఫ్ సెంచ‌రీ

దునిత్ వెల్లలగే బౌలింగ్‌లో (21.2వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 61 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్ సెంచ‌రీ చేశాడు. అత‌డితో పాటు వాన్ డ‌ర్ డుసెన్ 65 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. 22 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాప్రికా స్కోరు 127/1.

వాన్ డ‌ర్ డుసెన్ అర్థ‌శత‌కం

పతిరణ బౌలింగ్‌లో (17.3వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టి వాన్ డ‌ర్ డుసెన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 18 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 105/1. వాన్ డ‌ర్ డుసెన్ (51), క్వింట‌న్ డికాక్ (43) లు ఆడుతున్నారు.

10 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 48/1

ఆరంభంలోనే వికెట్ కోల్పోయి న‌ప్ప‌టికీ ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. స‌ఫారీల ఇన్నింగ్స్‌లో మొద‌టి 10 ఓవ‌ర్లు ముగిశాయి. వికెట్ న‌ష్టానికి 48 ప‌రుగులు చేసింది. వాన్ డ‌ర్ డుసెన్ (18), క్వింట‌న్ డికాక్ (21) లు ఆడుతున్నారు.

కెప్టెన్ బావుమా ఔట్‌

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు ఆరంభంలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. మధుశంక బౌలింగ్‌లో స‌ఫారీ కెప్టెన్ బావుమా (8) ఎల్భీ డ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 1.4వ ఓవ‌ర్‌లో 10 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా మొద‌టి వికెట్ కోల్పోయింది.

శ్రీలంక తుది జ‌ట్టు : కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీప‌ర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలగే, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక, కసున్ రజిత

దక్షిణాఫ్రికా తుది జ‌ట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీప‌ర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), వాన్ డ‌ర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ