YS Jagan on BJP: ఏపీ రాజకీయాలు యమ హాట్గా మారుతున్నాయి.. 2024 ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సమాయత్తమవుతున్నాయి. ఈ తరుణంలో మాటల తూటాలు పేలుతున్నాయి.
YS Jagan on BJP: ఏపీ రాజకీయాలు యమ హాట్గా మారుతున్నాయి.. 2024 ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సమాయత్తమవుతున్నాయి. ఈ తరుణంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు విమర్శలు సంధించారు. నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి తప్ప మరేం లేదంటూ పేర్కొ్నారు. అంతేకాకుండా కేంద్ర పథకాలను సైతం సీఎం జగన్ తన ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ తరుణంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కురుక్షేత్ర సంగ్రామంలో బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. తాను వాళ్లను నమ్ముకోలేదని.. ప్రజలను నమ్ముకున్నానంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.
జగనన్న విద్యా కానుక పథకం నాలుగో విడతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రారంభించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుకను అందజేశారు. ఈ సంరద్భంగా సీఎం జగన్.. టీడీపీ, జనసేన, బీజేపీ టార్గెట్ గా విమర్శలు సంధించారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వమని.. ఆయన పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా గుర్తుకురాజన్నారు. అన్ని విషయాల్లో బాబును వెనకేసుకురావడానికి కొందరు జత అవుతున్నారంటూ పేర్కనొ్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయని పనులు.. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయంటూ విమర్శించారు. ఆయన బతుకంతా వాగ్దానాలు, వెన్నుపోట్లేనన్నారు.
బాబు పెత్తందారీ భావజాలానికి, పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు ఈ యుద్ధం జరుగుతోందని ప్రజలు గమనించాలన్నారు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధంలో దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు.. బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు.. మీ జగనన్న వీళ్లను నమ్ముకోలేదు. దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడంటూ పేర్కొన్నారు. వాళ్లు చేస్తున్న దుష్ర్పచారాలను నమ్మొద్దని.. అందరికీ మంచి చేసే అవకాశం ఇవ్వాలంటూ వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
WEB POSTS :