మనిషివి అన్ని మరిచిపోకు .. రోజాకు కీర్తన డెడ్లీ వార్నింగ్

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum. It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters, as opposed to using ‘Content here, content here’, making it look like readable English. Many desktop publishing packages and web page editors now use Lorem Ipsum as their default model text, and a search for ‘lorem ipsum’ will uncover many web sites still in their infancy. Various versions have evolved over the years, sometimes by accident, sometimes on purpose (injected humour and the like).

విమానం

Miss Shetty Mr Polishetty Review : శెట్టి, పొలిశెట్టి కలిసి సూపర్ హిట్ కొట్టేశారుగా..!
నటినటులు:  అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి, సోనియా దీప్తి, మురళీశర్మ, నాజర్, జయసుధ తదితరులు…
దర్శకత్వం: మహేశ్ బాబు.పి
నిర్మాత:  వంశీ – ప్రమోద్
సంగీతం: రదన్, గోపి సుందర్

Rating:

2.75/5
2.75/5
జాతిరత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టి పేరు మారుమోగింది. తను పేల్చిన నవ్వులు ఇప్పటికి పేలుతూనే ఉంటాయి. అలాంటి నవీన్ తన నెక్స్ట్ మూవీ టాప్ హీరోయిన్ అనుష్కతో కలిసి చేస్తున్నాడంటే అందరు నవ్వుకున్నారు. నవీన్ పక్కన అనుష్క హీరోయినా అంటూ మాట్లాడుకున్నారు. నవ్విన నాపచేనే పండినట్లు… వాళ్లిద్దరు కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమా చేశారు. ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీని పెంచిన ఈ మూవీ… ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కథ :
అన్విత శెట్టి(అనుష్క) ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో మాస్టర్ చెఫ్. తల్లి(జయసుధ) అనారోగ్యం కారణంగా లండన్ నుంచి ఇండియాకు తిరిగి వస్తుంది. తల్లి చనిపోవడంతో ఒంటరిగానే ఉంటుంది. ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటుంది. కానీ ఓ బిడ్డకు తల్లి కావాలనేది తన తప్పన. అయితే అది శారీరకంగా కాకుండా IUI పద్దతిలో బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది. ఇందుకోసం స్పర్మ్ డోనర్స్ ను వెతుకుతుంది. ఆ క్రమంలో స్టాండప్ కమెడియన్ అయిన సిద్ధు పొలిశెట్టి(నవీన్ ) అన్వితకు తారాసపడతాడు. తన ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని అన్విత భావిస్తుంది. సిద్ధు గురించి, అతని కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుంటుంది. అన్విత ప్రవర్తన, తీరు నచ్చి తనకంటే వయస్సులో పెద్దదైనా ప్రేమలో పడతాడు సిద్ధు. ఈ క్రమంలో ప్రేమ, పెళ్లి వద్దు తన బిడ్డకు జన్మనివ్వడానికి సహాయం కావాలంటుంది అన్విత. ఆ మాట విన్న సిద్ధు ఏం చేశాడు, అన్విత బిడ్డకు జన్మనిచ్చిందా లేదా అనేదే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కథ.

విశ్లేషణ : ఒక అమ్మాయి పెళ్లి కాకుండానే తల్లి కావాలనుకుంటుంది. వినడానికి ఆ అమ్మాయి నిర్ణయం సమాజానికి వింతగానే ఉండొచ్చు. సాటి మనుషులు హర్షించకపోవచ్చు. ఏ కుటుంబంలోనూ ఇలాంటి అమ్మాయి ఉండకపోవచ్చు. ఏ రకంగా ఆ అమ్మాయి తల్లి కావాలనుకుంటుందనే సందేహాలు తలెత్తొచ్చు. అలాంటి అంశాన్నే కథగా మలిచి సినిమా రూపంలోకి తీసుకొచ్చాడు దర్శకుడు మహేశ్ బాబు. దర్శకుడిగా ఒక సినిమానే చేసినా రెండో సినిమాకు ఇలాంటి వైవిధ్యమైన పాయింట్ తో సినిమాను తెరకెక్కించి శభాష్ అని నిరూపించుకున్నాడు. దానికి తోడు నవీన్ పొలిశెట్టి, అనుష్క లాంటి నటీనటులు తోడవడం సున్నితమైన పాయింట్ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లింది. పిల్లలను కనాలంటే ఒకరికొకరు శారీరకంగా దగ్గరవ్వాల్సిన అవసరం లేదనే విషయాన్ని తన రచనలో అందంగా చూపించారు. రైటింగ్ లో ఏ మాత్రం గాడి తప్పినా సినిమా ఫలితం పూర్తిగా నిరాశపరిచేది. ఫస్టాప్ అన్విత IUI పద్దతిలో బిడ్డను కనేందుకు పడే తాపత్రయం, సిద్ధు స్టాండప్ కామెడీతో నవ్వులు పండించారు. సెకండాఫ్ లో వారిద్దిరి మధ్య సంఘర్షణ, అన్విత బిడ్డను కనడానికి గల బలమైన కారణం, క్లైమాక్స్ లో గర్బం దాల్చాక నిజమైన ప్రేమ కోసం అన్విత- సిద్ధుల పడే వేదన భావోద్వేగంగా సాగుతుంది. తండ్రీ కొడుకులుగా నవీన్- మురళీశర్మ ట్రాక్ ఆకట్టుకుంటుంది. మురళీశర్మ తో చెప్పించిన మాటలు అర్థవంతంగా ఉంటాయి. కథను నవ్వులతో నడిపిస్తూనే ఏమోషనల్ గా తీసుకెళ్లాడు దర్శకుడు మహేశ్. ఈ సినిమా విషయంలో దర్శకుడు మహేశ్ పనితీరును ప్రశంసించాల్సిందే. మాటలు ఆకట్టుకుంటూనే చప్పట్లు కొట్టేలా చేస్తాయి. నటీనటులుగా నవీన్ పొలిశెట్టి, అనుష్కలు ఇద్దరికి ఇద్దరు సాటే. ఎక్కడా ఎవరూ తగ్గకుండా చేశారు. జయసుధ, నాజర్ పాత్రలు అతిథి పాత్రలకే పరిమితం అయ్యాయి. పాటల పరంగా రథన్ మరింత దృష్టి పెడితే బాగుండేది. గోపిసుందర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. నీరవ్ షా లెన్స్ అనుష్క అందాన్ని మరింత ఎలివేషన్ చేశాయి. బొద్దుగా ఉన్నా చాలా ముద్దుగా చూపించారు. నిర్మాణ పరంగా యూవీ క్రియేషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు.
నటీనటుల పనితీరు: వికలాంగుడిగా వీరయ్య చాలా అద్భుతంగా నటించారు. కొడుకు కోరికను నెరవేర్చే క్రమంలో ఎదురయ్యే సంఘర్షణను ఆయన అద్భుతంగా పండించారు. ప్రతి ఒక్క తండ్రి ఆయన పాత్రలో వారిని చూసుకునేంతగా నటించి మెప్పించారు. రాజు పాత్రలో మాస్టర్ ధృవన్ బాగా నటించాడు. సుమతి పాత్రలో అనసూయ, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ, డానియల్ గా ధనరాజ్ తమ పాత్రల మేర బాగా నటించారు. అతిథి పాత్రలో మీరా జాస్మిన్ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
బలాలు:
  • అనుష్క శెట్టి
  • నవీన్ పోలిశెట్టి
  • సాంగ్స్
  • స్టోరీ కొత్తగా ఉంది
బలహీనతలు:
  • స్క్రీన్ ప్లే
  • నిడివి
చివరి మాట: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ట్రైనెర్
రేటింగ్: 2.75/5

సైతాన్ (వెబ్ సిరీస్)

సైతాన్ (వెబ్ సిరీస్)
నటినటులు:  రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, కామాక్షి భాస్కర్ల, నితిన్ ప్రసన్న తదితరులు..
దర్శకత్వం: మహి వి రాఘవ్
నిర్మాత:  మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి
సంగీతం: శ్రీరామ్ మద్దూరి

Rating:

2.5/5
2.5/5
ఈ మధ్యకాలంలో సినిమాలకు ధీటుగా వెబ్‌ సిరీస్‌ల హవా పెరిగిపోయింది. థియేటర్‌లలో సినిమాలు చూడని వారు కూడా మొబైల్‌లో.. ఓటీటీలో వెబ్‌ సిరీస్‌ చూస్తున్నారు. స్టార్‌ హీరోలు, హీరోయిన్స్‌ సైతం ఓటీటీకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా.. వెబ్‌ సిరీస్‌ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా విషయం అయితే, ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె ఓటీటీలో వరుసగా వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు చేస్తున్నారు. తమన్నా నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ జీ కర్ధా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
కథ : లావణ్యా సింగ్ (తమన్నా), రిషబ్ రాథోడ్ (సుహైల్ నయ్యర్), అర్జున్ గిల్ (ఆశిమ్ గులాటీ), ప్రీత్ (అన్యా సింగ్), షీతల్ (సంవేదన), షాహిద్ (హుస్సేన్ దలాల్), మెల్రాయ్ (సయాన్ బెనర్జీ) స్కూల్‌ మేట్స్‌. చిన్నప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఏం చేసినా కలిసే చేస్తుంటారు. 15 ఏళ్ల తర్వాత లావణ్యా సింగ్, రిషబ్ రాథోడ్ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి సమయంలో వారి జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనతో వారి ఇద్దరి జీవితాలు కష్టాల్లో పడతాయి. ఈ ఇద్దరి జీవితాలే కాదు. వేరు వేరు కారణాల వల్ల వీరి స్నేహితుల జీవితాలు కూడా కష్టాల్లో పడతాయి. మరి, వీరి జీవితాలు ఎలా గాడిన పడ్డాయి అన్నదే కథాంశం.
విశ్లేషణ : స్నేహితులు.. వారి జీవితాల్లో కష్టాలు అన్న కథాంశంతో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఆ పాయింట్‌ మీద ఈ స్టోరీ కొత్తదేమీ కాదు. దర్శకులు నేటి పరిస్థితులకు, మారిన మనుషుల మనస్తత్వాలకు తగ్గట్టు సీన్లను రాసుకోవటంలో మాత్రమే సఫలం అయ్యారు. ప్రస్తుతం ఓటీటీలోకి వస్తున్న కంటెంట్‌కు ఏ మాత్రం తగ్గకుండా బోల్డ్‌నెస్‌ను జోడించారు. అవసరం ఉన్న చోట అడల్ట్‌ సీన్లను బానే ఎలివేట్‌ చేశారు. ఏదైనా మానసిక సంఘర్షణ మొదలైనపుడు మనుషులు ఎలా ఉంటారు.. ఎలా ప్రవర్తిస్తారు.. వారి మనస్తత్వాలు ఎలా మారతాయి అన్నది చక్కగా చూపించారు. సినిమా మొత్తం మనుషుల జీవితాల్లో జరిగే మానసిక సంఘర్షణ మీదే ఉంటుంది. పాత్రలను మలిచిన తీరులోనూ.. వాటితో కథను నడిపే తీరులోనూ దర్శకులు సక్సెస్‌ అయ్యారు. ఈ కథ ఎక్కువగా ఉత్తర భారతదేశంలోని పరిస్థితులకు తగ్గట్టుగానే ఉంటాయి. మూడ్‌ తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్‌ మనల్ని హత్తుకుంటుంది.
నటీనటుల పనితీరు: బాలి పాత్రలో రిషి చాలా బాగా నటించారు. క్రోధం, ఆవేశం, దుఃఖం వంటి భావోద్వేగాలను చక్కగా పండించారు. ఇక దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, కామాక్షి భాస్కర్ల, షెల్లీ, రవి కాలే వంటి నటులు చాలా బాగా నటించారు. ఈ పాత్రల్లో వీరు తప్ప వేరే వాళ్ళు నటించలేరేమో అన్న భావన కలిగించారు. కామాక్షి భాస్కర్ల, షెల్లీ, రవి కాలే పాత్రలైతే ఛాలెంజింగ్ అని చెప్పాలి. అంత బాగా నటించారు. లీనా, నితిన్ ప్రసన్న, మణికందన్, రవి కుమార్, అనీషా దామ, సంజయ్ కృష్ణ తదితరులు బాగా నటించారు.
బలాలు:
  • నటీనటుల నటన
  • కెమెరా పనితనం
  • బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌
  • డైలాగ్స్

బలహీనతలు:

  • రొటీన్ కాన్సెప్ట్
  • అక్కడక్కడా బోరింగ్ సీన్స్

చివరి మాట: సైతాన్ ని చూసే వారు నేరస్తులు కాదు, బాధితులు అంతకంటే కాదు. ఇలాంటి కంటెంట్ ని యాక్సెప్ట్ చేసేవారు హ్యాపీగా చూసుకోవచ్చు.

రేటింగ్: 2/5.5

జీ కర్ధా

జీ కర్ధా
నటినటులు:  తమన్నా, సుహైల్ నయ్యర్, ఆశీమ్ గులాటీ, అన్యా సింగ్, సయాన్ బెనర్జీ, సంవేదన, మల్హర్ టక్కర్, హుస్సేన్ దలాల్ తదితరులు..
దర్శకత్వం: అరుణిమా శర్మ, హోమీ అదజనియా
నిర్మాత:  దినేష్ విజయన్
సంగీతం: సచిన్ – జిగార్

Rating:

2.5/5
2.5/5
ఈ మధ్య కాలంలో బూతులు, బోల్డ్ సన్నివేశాలు, హత్యలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు బాగా ఆడుతున్నాయి. కంటెంట్ లో అశ్లీలత, అసభ్యకర సన్నివేశాలు ఉన్నా కూడా చూసేస్తున్నారు. అయితే అడల్ట్ కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ లే ఇటీవల కాలంలో బాగా హిట్ అవుతున్నాయి. ఈ కోవకి చెందినదే సైతాన్ వెబ్ సిరీస్. పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర వంటి క్లీన్ సినిమాలను తెరకెక్కించిన మహి వి. రాఘవ్ ఇలాంటి వెబ్ సిరీస్ ని తీస్తారని ఎవరూ ఊహించలేదు. క్రియేటర్ మరియు నిర్మాతగా ఈయన చేసిన క్లీన్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ తర్వాత రూటు మార్చి దర్శకుడిగా ‘సైతాన్’ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. డిస్నీ+హాట్ స్టార్ లో జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ : సావిత్రికి (షెల్లీ నబు కుమార్) బాలి (రిషి), జయప్రద (దేవయాని శర్మ), గుమ్తి (జాఫర్ సాదిక్) అనే ముగ్గురు పిల్లలు ఉంటారు. భర్త వదిలేసి వెళ్లిపోవడంతో పిల్లల కోసం ఓ పోలీస్ తో ఇల్లీగల్ రిలేషన్ లో ఉంటుంది. అయితే తల్లి గురించి ఇరుగు పొరుగు వారు తప్పుగా మాట్లాడుతుంటే బాలికి అవమానంగా అనిపిస్తుంది. తన తల్లి కోసం వచ్చిన పోలీస్ అధికారి చెల్లెలిని తప్పుగా చూడడంతో పోలీస్ తలను నరుకుతాడు బాలి. దీంతో జైలుకు వెళ్తాడు. కొన్నాళ్ళకు తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత దళంలో చేరతాడు. హోమ్ మినిస్టర్ నుదిటి మీద గన్ పెట్టి బెదిరించే స్థాయికి ఎదుగుతాడు. ఈ స్థాయికి ఎలా ఎదిగాడు? కళావతి (కామాక్షి భాస్కర్ల), పోలీస్ అధికారి నాగిరెడ్డి (రవి కాలే) బాలి ప్రయాణాన్ని ఎలాంటి కీలక మలుపు తిప్పారు అనేది తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ : ‘సమాజాం నన్ను నేరస్తుడు అన్నది, కానీ నేనొక బాధితుడిని’ అనే డైలాగ్ తో దర్శకుడు కథేంటో చెప్పేశారు. బాధ ఉంటే తప్ప నేరం చేయరు, నేరం చేసిన వాళ్ళు నేరస్తులు కాదు, బాధితులు అనే ఉద్దేశంతో దర్శకుడు ఈ కథని తెరకెక్కించారు. అయితే కత్తి పట్టుకున్నోడు చివరికి ఆ కత్తితోనే అంతమవుతాడు అన్నట్టు బాలి అధ్యాయం కూడా ముగిసిపోతుంది. సైతాన్ కథ నిజంగా సైతాన్ లానే ఉంటుంది. హింస, శృంగారం, బూతులు మాత్రమే కాదు అంతకు మించి ఉంటుంది. బాలి, అతని కుటుంబ సభ్యులు కలిసి హత్యలు చేస్తుంటే అలా చేయడంలో తప్పు లేదు అనేంతగా ప్రేక్షకులను కన్విన్స్ చేసేలా సిరీస్ ని తెరకెక్కించారు దర్శకుడు మహి వి రాఘవ్.తలలు తెగిపడిన దృశ్యాలు, మహిళలను బలాత్కారం చేసే సన్నివేశాలు, బూతు మాటలు ఎక్కువగా ఉంటాయి. అన్ని వర్గాల వారికి ఈ సిరీస్ నచ్చకపోవచ్చు. బోల్డ్ సీన్లు, ఘాటు సన్నివేశాలే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. భర్త చనిపోయిన మహిళ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే ఆమెను ఒక తిట్టుతో ముద్ర వేసే సమాజం మగాడి మీద ఎందుకు వేయదు అని అడిగే ప్రశ్న ఆకట్టుకుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వ్యక్తి నేరస్తుడు అవుతాడు కానీ అతనూ ఒక బాధితుడే అని, ఆ వ్యక్తిని బాధితుడిగానే చూడాలని చెప్పే కాన్సెప్ట్ సిరీస్ లోనే బాగుంటుంది. నిజ జీవితంలో వర్కవుట్ అవ్వదు.ఇది అందరూ యాక్సెప్ట్ చేసే వెబ్ సిరీస్ కాదు. కేవలం ఒక వర్గం మాత్రమే ఆదరించే సిరీస్. అనుకోని పరిస్థితుల్లో నేరస్తుడు అయ్యి జైలుకు వెళ్లడం, ఆ తర్వాత బయటకొచ్చి నేరస్తులతో కలిసి పని చేసే కాన్సెప్ట్ లతో చాలా కథలు వచ్చాయి. ఈ సిరీస్ కూడా అలానే ఉంటుంది. కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. కాస్త రొటీన్ గా ఉంటుంది. మరీ కొత్తగా ఏమీ ఉండదు. అయితే తెలుగులో ఇలా బూతులు, హింస, అశ్లీలత, క్రూరత్వంతో నిండిన వెబ్ సిరీస్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. అందులోనూ బాగా రా అండ్ రస్టిక్ గా రావడం అయితే ఇదే తొలిసారి.
నటీనటుల పనితీరు: ఈ వెబ్‌ సిరీస్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటీనటుల పని తీరు గురించే. ఎవరికి వారు తమ పాత్రకు న్యాయం చేశారు. ఎమోషన్స్‌తో కూడుకున్న స్టోరీలో.. ఎమోషన్స్‌ను ఏమాత్రం అటుఇటూ కానివ్వకుండా బ్యాలెన్స్‌డ్‌గా నటించారు. ప్రధాన పాత్రధారి అయిన తమన్నా దగ్గరినుంచి చిన్న చిన్న పాత్రల్లో నటించిన వారు కూడా చాలా చక్కగా నటించారు. నిజం చెప్పాలంటే.. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ జీవించారు కూడా. ఈ స్టోరీ నటీనటుల నటనే ప్లస్‌ పాయింట్‌.
బలాలు:
  • నటీనటుల నటన
  • కెమెరా పనితనం
  • బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌
బలహీనతలు:
  • కొత్త దనం లేని కథ
  • అక్కడక్కడా బోరింగ్ సీన్స్
చివరి మాట: కథలో కొత్తదనంలేని ‘జీ కర్థా’..
రేటింగ్: 2/5.5

ఆదిపురుష్

ఆదిపురుష్
నటినటులు:  ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, సోనాల్ చౌహన్ తదితరులు..
దర్శకత్వం:  ఓం రౌత్
నిర్మాత:  భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేష్ నాయర్
సంగీతం:  సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా

Rating:

3/5
3/5
రామాయణం కథ అందరికీ తెలిసిందే. అయినా కానీ ఎంతమంది ఎన్ని సార్లు తీసినా గానీ చూడాలనిపిస్తుంది. ఒక మాస్ హీరో భక్తి ప్రధాన చిత్రాన్ని ఎంచుకోవడమే గొప్ప విషయం. అందుకు ప్రభాస్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ పడలేదు. దీంతో ప్రభాస్ తో సహా అందరూ ఆదిపురుష్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా పోస్టర్లు, టీజర్ చూసి బాలేదన్న విమర్శలు మూటగట్టుకున్నా గానీ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎట్టకేలకు విమర్శల సముద్రాన్ని దాటుకుంటూ ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ లంకకు బయలుదేరింది. మరి లంకలో ఆదిపురుష్ ప్రభాస్ విజయం సాధించారా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

Obama on Modi Tour: మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇండియాలో ముస్లింల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన బరాక్ ఒబామా

Modi USA Tour: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. గురువారం అమెరికా కాంగ్రెస్‭ను ఉద్దేశించి కీలక ప్రసంగం చేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‭తో కలిసి మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు. దీనికి కొద్ది సమయం ముందు ఇండియాలోని ముస్లిం మైనారిటీల భద్రతపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. అంతే కాకుండా.. మోదీని కలిసిన సమయంలో ఈ విషయమై ప్రస్తావన లేవనెత్తాలని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‭ను ఒబామా కోరారు.

తండ్రి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు

Suleman Dawood : ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో కనిపించకుండా పోయిన సబ్ మెరైన్ ‘టైటాన్’ తీవ్ర విషాదాన్ని నింపింది. టైటాన్ కుప్పకూలినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సబ్ మెరైన్‌లో ప్రయాణించిన పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్ కుమారుడు సులేమాన్ దావూద్‌కి ఈ యాత్ర చేయడం అస్సలు ఇష్టం లేదట. తండ్రికోసం వెళ్లి అతనితోపాటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అతని అత్త ఓ ప్రకటనలో తెలిపారు.

సబ్ మెరైన్ ‘టైటాన్’ కుప్పకూలినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ రియర్ అడ్మిరల్ జాన్ ముగేర్ ప్రకటనలో తెలిపారు. సముద్రంలో 13,000 అడుగుల లోతున టైటానిక శకలాలకు 1500 అడుగుల దూరంలో టైటాన్ ఆనవాళ్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. సముద్ర ఒత్తిడిని తట్టుకోలేక టైటాన్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో టైటాన్‌లో ప్రయాణిస్తున్నవారంతా జలసమాధి అయ్యారు. అయితే పాక్‌లోని ప్రముఖ బిజినెస్ గ్రూప్ ఎంగ్రో (Engro) సంస్థ వైస్ చైర్మన్‌గా ఉన్న షహజాదా దావూద్ ఆయన కుమారుడు 19 సంవత్సరాల సులేమాన్ దావూద్‌కు అసలు ఈ సాహస యాత్రకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదట. ఈ విషయాన్ని అతని అత్త ఓ ప్రకటనలో తెలిపారు. వారి మరణాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సులేమాన్ ‘ఫాదర్స్ డే’ సందర్భంలో తండ్రి వెంట వెళ్లేందుకు అంగీకరించాడని ఆమె తెలిపారు.

రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తాం..వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రతిజ్ఞ

RUSSIA: రష్యా దేశంలో శనివారం తిరుగుబాటు చేసిన వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ సంచలన ప్రతిజ్ఞ చేశారు. (Wagner chief vows)రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తానని యెవ్జెనీ ప్రిగోజిన్ చెప్పారు. రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టేందుకు సైనికులపై దాడులు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ( topple Russian military leadership)

మొత్తం తన కిరాయి సైన్యం 25వేలమంది ఉన్నారని వారితో కలిసి పోరాడుతున్నామన్నారు. తమ వాగ్నర్ కిరాయి సైనికులు రష్యా దేశ ప్రజల కోసం చావడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు.  రష్యా సైనిక హెలికాప్టర్‌ను తన బలగాలు కూల్చివేసినట్లు అతను పేర్కొన్నాడు.వాగ్నల్ కిరాయి సైనికుల తిరుగుబాటు తర్వాత రష్యాలో సైనిక వాహనాలను మోహరించారు. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వాగ్నర్ ఫైటర్స్ ప్రిగోజిన్‌ను నిర్బంధించాలని కోరింది

PM Modi US Visit: అమెరికా పర్యటన చాలా ప్రత్యేకమైనది.. ఈజిప్టు వెళ్లే ముందు ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్..

మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకున్న ప్రధాని మోదీ.. ఇవాళ ఈజిప్ట్‌కు పయనమయ్యారు. అక్కడ ప్రధాని మోడీ రెండు రోజులపాటు పర్యటిస్తారు. మోదీ రాక కోసం ఈజిప్ట్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ ఫతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈజిప్ట్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ అక్కడి నాయకులు, ప్రవాస భారతీయులతో వరుసగా భేటీ కానున్నారు. దాదాపు అరగంటపాటు అల్-హకీమ్ మసీదులో గడపనున్నారు. తన ఈజిప్ట్ పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ స్మశానవాటికను కూడా సందర్శించనున్నారు. ముఖ్యంగా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు PM మోడీ ఈజిప్ట్ సందర్శిస్తున్నారు.

అయితే.. ఈజిప్టు పర్యటనకు ముందు.. అమెరికా పర్యటన విజయవంతంపై ప్రధాని మోడీ కీలక వీడియోను పంచుకున్నారు. ‘‘చాలా ప్రత్యేకమైన అమెరికా పర్యటనను ముగించాను.. అక్కడ నేను భారతదేశం-USA స్నేహానికి ఊపందుకునే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలు.. ప్రముఖులతో పలు సమావేశాల్లో పాల్గొన్నారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి.. మంచి ప్రదేశంగా మార్చడానికి మన దేశాలు కలిసి పనిచేస్తాయి” ప్రధాన మంత్రి అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

1 8 9 10 11 12 15