వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తికి చెత్తకుప్పలో ఒక నల్ల బ్యాగ్ దొరికింది. ఇక అందులో డబ్బు ఉంటుందని ఆశతో ఓపెన్ చేసిన అతడికి దెబ్బకు లచ్చిందేవే వరిచింది. ఆ బ్యాగ్లో ఏకంగా 30 లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి. అంటే మన భారత కరెన్సీలో అది సుమారు రూ. 25 కోట్లు. ఈ ఘటన నవంబర్ 3వ తేదీన బెంగళూరులోని నాగవార రైల్వేస్టేషన్ పట్టాల వద్ద జరిగింది. ఆ బ్యాగ్ దొరికిన సదరు వ్యక్తి పేరు సాల్మన్. ఆ బ్యాగ్పై యునైటెడ్ నేషన్స్ ముద్ర ఉండగా.. సాల్మన్ ఇంటికి వెళ్లి దాన్ని తెరిచి చూశాడు కంగుతిన్నాడు. అంత డబ్బు చూసిన సాల్మన్కు రెండు రోజులు అస్సలు నిద్రపట్టలేదు. అనంతరం మూడో రోజున తన స్నేహితుడు, స్వరాజ్ ఇండియా సామాజిక కార్యకర్త అయిన ఆర్.కలీముల్లాను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. అతడు ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ దయానందకు తెలిపాడు.
సాల్మన్ నుంచి సదరు బ్యాగ్, డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అవి దొరికిన ప్రదేశాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అలాగే బ్యాగ్లో లభించిన డాలర్లు నకిలీవని భావిస్తున్నారు ఖాకీలు. క్షుణ్ణంగా పరిశీలించేందుకు వాటిని రిజర్వు బ్యాంకుకు పంపినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆ బ్యాగ్ తెరిచినప్పుడు ఓ పెద్ద లెటర్ లభించడం విశేషం. అందులో ‘బ్యాగులో విషపూరితమైన రసాయనాలున్నందున.. తెరిచేటప్పుడు జాగ్రత్త’ అని పేర్కొని ఉంది.