Khammam: మద్యం మత్తులో దర్జాగా హైవే పైకాళ్లు చాపి కూర్చున్న వ్యక్తి.. వాహనాలు తాకుతూ వెళ్తున్నా కదలని వైనం….

Follow Us :

పగటి పూట బిక్షాటన చేస్తూ..రాత్రుళ్ళు ఫుల్ గా మందు కొడతాడు. ఆ వ్యక్తి రాత్రి మందు ఎక్కువై మత్తులో డివైడర్ కు ఆనుకుని రెండు కాళ్ళు చాపి దర్జాగా హైవే పై కూర్చున్నాడు. సృహలో లేకపోవడంతో కాళ్ళకు ఆనుకుని వందలాది వెహికిల్స్ వెళ్తున్న అతనికి స్పృహ లేదు.

తాగర అన్న.. తాగి ఊగ రా అన్నట్టు గా ఒక వ్యక్తి ఫుల్ గా తాగి నడి రోడ్డు మీదనే మద్యం మత్తులో కూర్చున్నాడు. వందలాది వాహనాలు రయ్.. రయ్..మంటు పోతున్నాయి కానీ అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. వెళ్ళే వాహనాలకు అడ్డుగా కాళ్ళు చాపి కూర్చోవడంతో బస్, లారీలు..చక్రాల కింద కాళ్ళు ఎక్కడ నలిగిపోతాయో అనే విషయం కూడా పట్టించుకోకుండా ఎవ్వరూ దారిన వారు వెళ్తున్నారు. ఇంత వరకు ఒకే.. అయితే అటుగా వెళ్ళే పోలీసులు కూడా కనీసం కన్నెత్తి చూడకుండా.. చూసి చూడనట్టు హైవే పెట్రోలింగ్ వెహికిల్ లో రయ్.. మంటు దూసుకు పోయారే.. కానీ మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పోలీసులు కూడా వదిలేశారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఆర్టీసీ బస్ స్టాండ్ కు ఇన్ గేట్ సమీపంలో మెయిన్ హైవే రోడ్డు పై రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇది. సత్తుపల్లి లో పగటి పూట బిక్షాటన చేస్తూ..రాత్రుళ్ళు ఫుల్ గా మందు కొడతాడు. ఆ వ్యక్తి రాత్రి మందు ఎక్కువై మత్తులో డివైడర్ కు ఆనుకుని రెండు కాళ్ళు చాపి దర్జాగా హైవే పై కూర్చున్నాడు. సృహలో లేకపోవడంతో కాళ్ళకు ఆనుకుని వందలాది వెహికిల్స్ వెళ్తున్న అతనికి స్పృహ లేదు. ఇంక ఆర్టీసీ బస్సులు మాత్రం డివైడర్ వద్ద ఆ యువకుడు కూర్చునే సరికి బస్ స్టాండ్ లోకి బస్ లు మలుపు తిప్పెందుకు ఇబ్బంది పడ్డారు. ఇదంతా బాగా నే ఉంది..

ఎలాంటి బాధ్యత లేదన్నట్టుగా సత్తుపల్లి పోలీసులు పోలీస్ వాహనం లో అక్కడే రయ్..రయ్..మంటు తిరుగుతున్నారు.. తమకు ఎందుకు అన్నట్లుగా.. రోడ్డు మధ్య ఉన్న  అతని పట్టించుకుని కనీసం రోడ్డు పక్కకు కూడా తీసుకు వెళ్ళలేదు. మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బైకు మీద వచ్చి చూసుకుంటూ తాపీగా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి దగ్గరలోనే బైకు ఆపి ఎంచక్కా సెల్ ఫోన్ మాట్లాడుతూ.. టీ లు తాగుతున్నారు. ఈ దృశ్యాలు చూసిన కొందరు సమాజం పట్ల మరి బాధ్యత లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు. నిర్లక్ష్యంగా రోడ్ల మీద వ్యవహరిస్తూ వాహన చోదకులు ఇబ్బందులు గురి చేస్తున్న వారి పై కొంచెం పోలీసులు కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు.

 

WEB POSTS :

Telangana: భూ సమస్య తీర్చి బాధితుడి కొడుకు దృష్టిలో హీరోగా మారిన జిల్లా కలెక్టర్.. ఐడాక్‌లో కలుసుకుని సందడి

ప్రజల దృష్టిలో హీరోలుగా నిలబడవచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలబడుతున్నారు పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ ఒక వ్యక్తి భూ సమస్యను పరిష్కరించారు. దీంతో బాధితుడి తనయుడు దృష్టిలో ఆ కలెక్టర్ హీరో అయ్యాడు. అభిమానిగా మారాడు. ఈ తెలంగాణలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది.
ప్రజల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకుని అభిమానాన్ని సంపాదించుకోవాలంటే.. సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు.. ఫైట్స్, డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదని కొందరు అధికారులు నిరూపిస్తున్నారు. అవును ప్రభుత్వ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే ప్రజల దృష్టిలో హీరోలుగా నిలబడవచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలబడుతున్నారు పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ ఒక వ్యక్తి భూ సమస్యను పరిష్కరించారు. దీంతో బాధితుడి తనయుడు దృష్టిలో ఆ కలెక్టర్ హీరో అయ్యాడు.  అభిమానిగా మారాడు. ఈ తెలంగాణలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

దమ్మపేట మండలం జమేదార్ బంజర్‌కు చెందిన కుంజా వెంకటేశ్వలు తనకు భూమి సమస్య ఉంది.. పరిష్కరించమని కొంతకాలం క్రితం గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రం సమర్పించాడు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి  స్పందిస్తూ.. పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై సభలో చర్చ జరగడంతో కలెక్టర్ ఆదేశాలతో భూ సమస్య పరిష్కారం జరుగుతుందని వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులకు తెలిపారు.

భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడడం బాధితుడు వెంకటేశ్వర్లు కుమారుడు హర్షానందన్‌ పరిశీలించాడు. దీనికి కారణంగా హర్షానందన్‌ కలెక్టర్‌ను కలవాలని పట్టుబట్టాడు. కలెక్టరేట్‌కు తీసుకెళ్లాలని తండ్రిని కోరారు. కొడుకు కోరిక తీర్చడం కోసం సోమవారం వెంకటేశ్వర్లు తన కుమారుడిని కలెక్టరేట్‌కు తీసుకొచ్చి ప్రజావాణి సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టిను కలిశారు. కలెక్టర్‌ని కలిసిన హర్షానందన్‌ సంతోషంగా కరచాలనం చేశాడు. అనుదీప్ దురిశెట్టి కొద్దిసేపు ఆ బాలుడితో మాట్లాడి.. ఫోటో దిగారు. ఈ ఘటన సోమవారం ప్రజావాణిలో హైలెట్‌గా మారింది.

WEB POSTS :

YS Jagan: కురుక్షేత్ర సంగ్రామంలో బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan on BJP: ఏపీ రాజకీయాలు యమ హాట్‌గా మారుతున్నాయి.. 2024 ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సమాయత్తమవుతున్నాయి. ఈ తరుణంలో మాటల తూటాలు పేలుతున్నాయి.

YS Jagan on BJP: ఏపీ రాజకీయాలు యమ హాట్‌గా మారుతున్నాయి.. 2024 ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సమాయత్తమవుతున్నాయి. ఈ తరుణంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు విమర్శలు సంధించారు. నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి తప్ప మరేం లేదంటూ పేర్కొ్నారు. అంతేకాకుండా కేంద్ర పథకాలను సైతం సీఎం జగన్ తన ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ తరుణంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కురుక్షేత్ర సంగ్రామంలో బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. తాను వాళ్లను నమ్ముకోలేదని.. ప్రజలను నమ్ముకున్నానంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.

జగనన్న విద్యా కానుక పథకం నాలుగో విడతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రారంభించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుకను అందజేశారు. ఈ సంరద్భంగా సీఎం జగన్.. టీడీపీ, జనసేన, బీజేపీ టార్గెట్ గా విమర్శలు సంధించారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వమని.. ఆయన పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా గుర్తుకురాజన్నారు. అన్ని విషయాల్లో బాబును వెనకేసుకురావడానికి కొందరు జత అవుతున్నారంటూ పేర్కనొ్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయని పనులు.. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయంటూ విమర్శించారు. ఆయన బతుకంతా వాగ్దానాలు, వెన్నుపోట్లేనన్నారు.

 

బాబు పెత్తందారీ భావజాలానికి, పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు ఈ యుద్ధం జరుగుతోందని ప్రజలు గమనించాలన్నారు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధంలో దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు.. బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు.. మీ జగనన్న వీళ్లను నమ్ముకోలేదు. దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడంటూ పేర్కొన్నారు. వాళ్లు చేస్తున్న దుష్ర్పచారాలను నమ్మొద్దని.. అందరికీ మంచి చేసే అవకాశం ఇవ్వాలంటూ వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

WEB POSTS :

Andhra Pradesh: ఆ రోజే విద్యార్థులకు ఫ్రీగా ట్యాబ్‌లు పంపిణీ.. సీఎం జగన్ గుడ్‌ న్యూస్..

ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న 8వ తరగతి విద్యార్ధులకు డిసెంబర్ 21న తన పుట్టినరోజున ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అలాగే వారికి చదువులు చెప్పే టీచర్లకు కూడా ట్యాబ్‌లు ఇస్తామన్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక రాష్ట్రమంతటా అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్ధులకు ఉచితంగా కిట్ల పంపిణీ చేశారు. ఈ కిట్‌లో ప్రతీ విద్యార్ధికి 3 జతల యూనిఫాం, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బైలింగువల్ పాఠ్యపుస్తకాలూ, డిక్షనరీ ఉంటుందని చెప్పారు.

ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులుతెచ్చామన్నారు సీఎం జగన్. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చామని, టోఫెల్ పరీక్షలకు విద్యార్ధులను సిద్దం చేయడమే కాదు.. ఇంగ్లీష్ మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నామన్నారు. అలాగే పాఠశాలలు మొదలైన తొలి రోజే విద్యాకానుక అందించామన్నారు సీఎం జగన్.

Janasena: ఇకపై మంగళగిరి కేంద్రంగానే జనసేన ఆపరేషన్స్‌

హైదరాబాద్‌లో ఉంటాడు, ఎప్పుడో వీకెండ్‌లో వస్తాడు, షూటింగ్‌ లేనట్టుంది! ఇలాంటి విమర్శలకు చెక్‌ పెట్టబోతున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఇప్పటివరకూ ఒక లెక్క-ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా ఇకపై మంగళగిరిలోనే ఉండబోతున్నారు‌. పవన్‌ ఒక్కరే కాదు, జనసేన ఆపరేషన్స్‌ అన్నీ మంగళగిరి నుంచే జరగనున్నాయ్‌. ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి జరుగుతోన్న కార్యకలాపాలను కూడా మంగళగిరి నుంచే నిర్వహించాలని నిర్ణయించారు జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌.ఇకపై జనసేన విభాగాలన్నీ మంగళగిరి పార్టీ ఆఫీస్‌ నుంచే పనిచేయనున్నాయ్‌. ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ను ప్రారంభించిన పవన్‌… మరో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 12వందల గజాల స్థలంలో జీ+5 భవనం కోసం భూమిపూజ చేశారు. ఎన్నికల్లోపే ఈ భవన నిర్మాణం పూర్తిచేసి ఇక్కడ్నుంచే అన్ని విభాగాలు పనిచేసేలా ప్లాన్‌ చేశారు పవన్‌.

మంగళగిరి జనసేన ఆఫీస్‌లో ప్రస్తుతం ప్రత్యేక యాగం చేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. మీడియాకి ప్రవేశం లేదంటూ గోప్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే  చంద్రబాబు- పవన్ పలుసార్లు కలవడంతో.. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అమిత్ షాతో మంతనాలు జరిపారు. ఆ భేటీకి సంబంధించి.. వివరాలు ఏం తెలియరాలేదు. కానీ ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా, అమిత్ షా వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ, జనసేనతో బీజేపీ కూడా జట్టు కడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

WEB POSTS :

Karumuri Nageswara Rao : అమిత్ షా కామెంట్లలకు కారుమూరి కౌంటర్…

Karumuri Nageswara Rao: కేంద్ర హోంశాఖ మంత్రి అమితా విశాఖ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. వరుసగా షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. పనిలో పనిగా రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.. ఇక, అమితా వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. వైసీపీని విమర్శించడానికే అమిత్ విశాఖకు వచ్చినట్టున్నారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి.. విశాఖ రైల్వే జోన్, మెట్రో రైలు వంటి అంశాలపై అమిత్ షా మాట్లాడడం లేదని నిలదీశారు.. రాష్ట్రానికి సంబంధించి ఏం మాట్లాడకపోయినా.. టీడీపీ, బీజేపీ నేతలు చప్పట్లు కొట్టేస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో 40 గుళ్లు కూలిస్తే బీజేపీ నేతలు మాట్లాడారా..? అని నిలదీశారు. అమిత్ షా తిరుపతి పర్యటనలో గతంలో టీడీపీ నిరసనలు తెలిపిందని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీని చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శించలేదా? అయినా బీజేపీకి సిగ్గు లేదా..? అంటూ ఫైర్ అయ్యారు.

అన్నింటిలోనూ ఏపీ నంబర్ వన్ అంటూ కేంద్రం ప్రకటనలు ఇస్తుంటే.. అవినీతి అంటూ అమిత్ షా కామెంట్లు చేస్తారా..? అని నిలదీశారు కారుమూరి.. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందన్న అమిత్ షా.. ఇప్పుడిలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు. బహిరంగ సభ వేదిక మీద అందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.. టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతల మనస్సు ఓ చోట.. మనిషి ఓ చోట అన్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక, అమిత్ షా సొంతంగా మాట్లాడారని అనుకోవడం లేదన్న ఆయన.. ఎవరో చెప్పిన మాటలు విని అమిత్ షా ఇలా మాట్లాడ్డం సరికాదన్నారు.. కర్ణాటకలో బీజేపీ పరిస్థితేం అయిందో చూశారుగా.. ఇక్కడ.. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి వచ్చినా జగనన్ను ఏం చేయలేరు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రతి ఇంట్లో మనిషిలా మారారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలదే.. గత ప్రభుత్వంలో కేంద్రం నిధులు విషయంలో ఏం చేశారో.. మేమూ అదే చేశాం అన్నారు. రైతులు రొడ్డేక్కి కేంద్రానికి ఏళ్ల తరబడి ఆందోళనలు చేశారు.. దీనికి అమిత్ షా సిగ్గు పడాలని హితవుపలికారు. చెవిలో ఎవరో ఊదితే.. దాన్నే అమిత్ షా మాట్లాడారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

WEB POSTS :

Kottu Satyanarayana : పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు.. సెక్షన్ 30 కొత్తది కాదు..!

Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధం అవుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో సెక్షన్ 30 అమల్లో ఉంటుందని ప్రకటించారు పోలీసులు.. అయితే, దీనిపై జనసేన నేతలు భగ్గుమంటున్నాయి.. పవన్ యాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈ రకంగా కుట్రలు చేస్తుందని ఫైర్ అవుతున్నారు నేతలు.. అయితే, పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదంటున్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. సెక్షన్ 30 అనేది కొత్తగా తీసుకువచ్చింది కాదన్న ఆయన.. సెక్షన్ 30 శ్రమలు తప్పుబట్టే ముందు.. ముద్రగడ పాదయాత్ర చేస్తానంటే 15 వేల మంది పోలీసులను పెట్టి ఆయన కుటుంబాన్ని హింసించారు.. అప్పుడు పవన్ కల్యాణ్ ఎవరిని తప్పుబట్టారు..? అని ప్రశ్నించారు.

ఇక, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆంధ్రలో జరుగుతున్న అభివృద్ధితో పోటీ పడగలరా.? అని ప్రశ్నించారు మంత్రి కొట్టు.. ఆంధ్రలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా ? అని నిలదీశారు. ఏపీలో బీజేపీ కాలు పెట్టేందుకు గుండు సూది అంత సందైన దొరుకుతుందేమో అని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి బీజేపీ చేసిన
అన్యాయానికి ఎన్ని తరాలైన రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు అవకాసం ఇవ్వరని స్పష్టం చేశారు. చంద్రబాబు వందల కోట్లు దోచుకోవడానికి అవకాశం కల్పించింది బీజేపీనే అని ఆరోపించారు.. ఇక, ప్రత్యేక హోదా, పోలవరం విషయాల్లో రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు.. మరోవైపు.. చంద్రబాబు కోసం ప్రచారం మొదలు పెట్టేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు.. చేసుకుని ఇవ్వండి అంటూ వారాహి యాత్రపై సెటైర్లు వేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

WEB POSTS :

Bholashankar : ‘సినిమా’ లో హైలైట్ గ నిలవనున్న ఆ సీన్స్

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమా భోళా శంకర్. వాల్తేరు వీరయ్య వంటి భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తరువాత సినిమాతో భారీ విజయం సాదించాలి అని అనుకుంటున్నారు.. అందుకే తన తరువాత సినిమా భోళా శంకర్ ను శర వేగంగా పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.. రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా మెహర్ రమేష్ చేస్తున్నారని తెలుస్తుంది..మెహర్ రమేష్ ఈ సినిమాను ఎన్నో హైలెట్స్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఎంతో బాగుంటుందని.. ముఖ్యంగా మెగాస్టార్,వెన్నెల కిషోర్, హైపర్ ఆది మరియు సత్య మధ్య సాగే కామెడీ సీన్స్ ఎంతో హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది.. ఈ సీన్స్ చూస్తే మెగా ఫ్యాన్స్ కు
వింటేజ్ మెగాస్టార్ గుర్తొస్తాడని మూవీ టీం తెలిపింది. అంతేకాదు మెహర్ రమేష్ చిరును తన కెరీర్ లో ఎవ్వరు కూడా ఇంత వరకు చూపించని డిఫరెంట్ లుక్ లో చూపించనున్నారని సమాచారం. కథలోని కీలక ఎమోషన్స్ అన్నిటిని మెహర్ రమేష్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని అన్ని సీన్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. మరి మెహర్ రమేష్ చిరూ ను ఎంత కొత్తగా స్టైలిష్ గా చూపించాడో చూడాలి మరీ . ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరూ కు చెల్లెలుగా నటిస్తుంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడని సమాచారం.అలాగే ఈ సినిమాలో అక్కినేని యువ హీరో అయిన సుశాంత్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారని సమాచారం.

WEB POSTS :

Lavanya Tripathi : మెగా కోడలి కాస్ట్ కోసం గూగుల్ సెర్చ్.. ఏమని వచ్చిందంటే ?

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి.. మెగా కోడలిగా కొన్ని రోజుల్లో మెగాస్టార్ ఇంట అడుగుపెట్టబోతుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు.. హీరో వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్థ వేడుక జూన్ 9న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక మెగా కోడలు అని తెలియడంతో లావణ్య గురించిన వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టారు మెగా ఫ్యాన్స్. ముఖ్యంగా కొంతమంది అయితే ఆమె క్యాస్ట్ ఏంటి..? అని సెర్చ్ చేస్తున్నారట. లావణ్య త్రిపాఠి ఎవరు..? ఆమె
కుటుంబం ఏంటి..? ఆమె పుట్టింది ఎక్కడ అని అభిమానులు గూగుల్ సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారు. అంతేనా.. మెగా కోడలు అని ముద్ర పడిన దగ్గరనుంచి ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే అమాంతం పెరిగిపోయారు. ఇక వరుణ్ ఫ్యాన్స్ అయితే ముద్దుగా వదినా అని పిలవడం కూడా మొదలుపెట్టారు. కాగా, లావణ్య ఏ క్యాస్ట్ కు చెందిన అమ్మాయి అనేది చెప్పాలంటే.. ఆమె ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె డెహ్రడూన్ లో పుట్టింది. లావణ్యకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. లావణ్య నాన్న న్యాయవాది.. అమ్మ రిటైర్డ్ టీచర్. ఇక ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఇష్టం ఉండడంతో చదువు పూర్తిచేసి సినిమాల వైపు అడుగులువేసింది.

ఇకపోతే వరుణ్ తో పరిచయం 2016 లో జరిగింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసి పెళ్లి వరకు వచ్చింది. ఇక ఇది ఆమె గురించి సెర్చ్ చేస్తే గూగుల్ లో కనిపించింది. దీంతో అభిమానులు మెగా కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు. అందరిలా క్యాస్ట్ వేరు అని చెప్పకుండా ప్రేమకు విలువనిచ్చి పెళ్లి చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు. ఆ లెక్కన చెప్పుకోవాలంటే.. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ కూడా వేరే క్యాస్ట్ నే. స్నేహాను బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక గతంలో కొడుకు పెళ్లి గురించి నాగబాబు కూడా ఈ విధంగానే చెప్పుకొచ్చాడు. తన కొడుకు ఎవరిని ప్రేమించినా.. ఎలాంటి అడ్డు చెప్పకుండా పెళ్లి చేసేస్తాను అని చెప్పుకొచ్చాడు. చెప్పినట్లుగానే వరుణ్ – లావణ్యను కలిపి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక త్వరలోనే వీరి పెళ్లి ఇటలీలో జరగనుందని టాక్. మరి పెళ్లి కూడా ఎంగేజ్ మెంట్ లా సింపుల్ గా చేస్తారో, లేదో చూడాలి

WEB POSTS :

DEVARA : ‘సినిమా లో’ జాన్వీ పాత్ర ఎలా వుండబోతుందో తెలుసా..?

ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. RRR సినిమా ఎన్టీఆర్ రేంజు భారీగా పెంచేసింది అని చెప్పాలి. అదే ఎనర్జీ తో ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ చిత్రం ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లోనే కోస్టల్ బ్యాగ్ డ్రాప్తో రూపొందుతోందని సమాచారం.. దీంతో ఈ మూవీపై భారీ గా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగా నే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. ఆ వెంటనే దీనికి సంబంధించిన రెండు భారీ
యాక్షన్ షెడ్యూళ్లను కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం.. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ తాజా షెడ్యూల్లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా భాగం అవుతారని సమాచారం.. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ‘దేవర’ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె మత్స్యకార కుటుంబానికి చెందిన యువతిగా కనిపించబోతుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఆమె అండర్ కవర్ ఆఫీసర్గా కూడా నటిస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.. అయితే, తాజా సమాచారం ప్రకారం..ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్కు సవతి కూతురిగా జాన్వీ కపూర్ పాత్ర ఉండబోతుందని సమాచారం.. ఈ విషయం సినిమాలో సస్పెన్స్ ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు, ఇది రివీల్ అయినప్పుడు ప్రేక్షకులంతా కూడా ఆశ్చర్యపోవడం ఖాయం అని తెలుస్తుంది.

WEB POSTS :

1 14 15 16 17 18 22